మనిషి మృత్యువు తరువాత ఎక్కడికి పొవును?
మనిషి మృత్యువు తరువాత తన కర్మననుసరిమ్చి పరలోకమునకు పోవును. ఏ మానవుడైతే విద్యాలయములు, అన్నసత్రములు, దేవాలయములు నిర్మించి దీనజనులకు సేవ చేయునో అతడు చంద్రలోకములో సుఖముగ ఉండును. మరియు ఏ మానవుడైతే వాజపేయ సోమయాగాది హవనములు చేయునో అతడు స్వర్గలోకములో సుఖము పొందును. ఈ రెండు విధములైన మానవులు పరలోకములో కొంతకాలము సుఖముగా ఉండి మరల భూలోకమున జన్మింతురు. కానీ ఎవరైతే సగుణ బ్రహ్మ ఉపాసన చేయుదురో వారు బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మజ్ఞానమును పొంది అచ్చటనే ముక్తి పొందెదరు. ఇంతేకాకుండ పాపకర్మలనాచరించిన జనులు మరణానంతరము యమలోకమునందు పాపఫలములనుభవించి తిరిగి భూలోకముననే జన్మింతురు.

మనిషి మృత్యువు తరువాత తన కర్మననుసరిమ్చి పరలోకమునకు పోవును. ఏ మానవుడైతే విద్యాలయములు, అన్నసత్రములు, దేవాలయములు నిర్మించి దీనజనులకు సేవ చేయునో అతడు చంద్రలోకములో సుఖముగ ఉండును. మరియు ఏ మానవుడైతే వాజపేయ సోమయాగాది హవనములు చేయునో అతడు స్వర్గలోకములో సుఖము పొందును. ఈ రెండు విధములైన మానవులు పరలోకములో కొంతకాలము సుఖముగా ఉండి మరల భూలోకమున జన్మింతురు. కానీ ఎవరైతే సగుణ బ్రహ్మ ఉపాసన చేయుదురో వారు బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మజ్ఞానమును పొంది అచ్చటనే ముక్తి పొందెదరు. ఇంతేకాకుండ పాపకర్మలనాచరించిన జనులు మరణానంతరము యమలోకమునందు పాపఫలములనుభవించి తిరిగి భూలోకముననే జన్మింతురు.

No comments:
Post a Comment