What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 19 April 2026

అనంతాళ్వార్ ఎవరు?

 *🌻 భక్తశిఖామణి అనంతాళ్వార్ గారి కథ – గడ్డపార రహస్యం 🌻*


🍃🌹 తిరుమలలో స్వామివారి గడ్డపార వెనుక ఒక అద్భుతమైన భక్తి కథ ఉంది. ఈ కథలో ప్రధాన పాత్ర అనంతాళ్వార్ గారిది.


🛕 అనంతాళ్వార్ ఎవరు?


🍃🌸 అనంతాళ్వార్ గారు రామానుజాచార్యులు వారి శిష్యుల్లో ఒకరు.

👉 గొప్ప భక్తుడు, సేవలో నిబద్ధత కలిగిన మహానుభావుడు.


🍃🌸 ఆయనకు గురువు ఇచ్చిన ఆజ్ఞ:

👉 తిరుమలలో స్వామివారి కోసం పూల తోట (నందవనం) ఏర్పరచాలి.


🌿 నందవనం సేవ


🍃🌹 అనంతాళ్వార్ గారు తిరుమల కొండపై తోటను ఏర్పరచి, స్వామివారికి ప్రతిరోజూ పూలు సమర్పించేవారు.


🍃🌹 ఈ పనిలో ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదు అనుకున్నారు.

👉 “నేనే సేవ చేయాలి” అన్న దృఢ సంకల్పం.


👦 బాలుడి రూపంలో స్వామివారు


🍃🌸 ఒక రోజు తోట పనిలో ఉన్నప్పుడు, ఒక చిన్న బాలుడు వచ్చి:

👉 “నేను సహాయం చేస్తాను” అన్నాడు.


🍃🌸 కానీ అనంతాళ్వార్ గారు కోపంతో:

👉 “నాకు ఎవరి సహాయం అవసరం లేదు” అని చెప్పి పంపించారు.


⚒️ ఆ సంఘటన


🍃🌹 అయినా బాలుడు మళ్లీ మళ్లీ సహాయం చేయడానికి ప్రయత్నించాడు.


🍃🌹 కోపం వచ్చిన అనంతాళ్వార్ గారు:

👉 తన చేతిలో ఉన్న **గడ్డపార (crowbar/iron tool)**తో ఆ బాలుడిపై విసిరారు.


😲 అద్భుతం ఏమిటి?


🍃🌸 ఆ గడ్డపార బాలుడి **చిన్ (గడ్డం భాగం)**పై తగిలింది.

👉 వెంటనే బాలుడు కనిపించకుండా పోయాడు!


🍃🌸 అనంతాళ్వార్ గారికి అనుమానం వచ్చి ఆలయానికి వెళ్లి చూసినప్పుడు…


👉 స్వామివారి విగ్రహంలో గడ్డం దగ్గర రక్తం కారుతోంది!


🙏 నిజం తెలిసినప్పుడు


🍃🌹 అప్పుడు ఆయనకు అర్థమైంది:

👉 ఆ బాలుడు మరెవరో కాదు

👉 శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా!


🍃🌹 తన తప్పుకు బాధపడి, క్షమాపణ కోరాడు.


🪔 గడ్డపార రహస్యం


🍃🌸 ఆ గాయం గుర్తుగా:

👉 స్వామివారి గడ్డం భాగంపై

👉 ఇప్పటికీ కర్పూరంతో అలంకరిస్తారు


🍃🌸 అదే మనం దర్శనంలో చూసే

👉 గడ్డపార గుర్తు


🛕 సంప్రదాయం ఇప్పటికీ


🍃🌹 అనంతాళ్వార్ గారు విసిరిన ఆ గడ్డపారను

👉 ఇప్పటికీ తిరుమల ఆలయంలో భద్రపరచి ఉంచారు.


🍃🌹 ఇది భక్తికి, వినయానికి గొప్ప గుర్తుగా భావిస్తారు.


🌟 ఈ కథ చెప్పే సందేశం

🍃🌸 భక్తి అంటే:


అహంకారం లేకుండా సేవ చేయడం

దేవుడు ఎలాంటి రూపంలోనైనా రావచ్చు ఆయనను గుర్తించే జ్ఞానం ఉండాలి


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

Read More

🔅 కుంతీ మాధవ స్వామి దేవాలయం : పిఠాపురం

 🕉 


🔅 తూ.గో జిల్లా :  పిఠాపురం


🔅 కుంతీ మాధవ స్వామి దేవాలయం :  పిఠాపురం

👉 శ్రీ కుంతీ మాధవ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఇది పురాతన వైష్ణవ దేవాలయాలలో ఒకటి మరియు పంచ మాధవ దివ్య క్షేత్రం. ఇది పిఠాపురంలోని ప్రసిద్ధ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. 


👉ఇంద్రుడు వృత్తాసురుని చంపాక ఆ బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తి పొందడం కోసం దేశంలోని ఐదు ప్రాంతాల్లో వైష్ణవాలయాలను నిర్మించి ఆరాదించాడని పురాణాలు చెబుతున్నాయి. 


👉వాటిని పంచ మాధవ క్షేత్రాలుంటారు. 

వాటిలో మొదటిది కాశీలోని భిందుమాధవ స్వామి ఆలయం, 

రెండోది ప్రయాగలోని వేణుమాధవ స్వామి గుడి. 

మూడోది పిఠాపురంలోని కుంతీ మాధవ క్షేత్రం. నాలుగోది రామేశ్వరంలో సేతుమాధవుని ఆలయం, 

ఐదవది అనంతపద్మనాభంలో సుందరమాధవ క్షేత్రం. 


👉కుంతీమాధవస్వామిని పిఠాపురం క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తారు. భిందుమాధవుని దర్శించనిదే కాశీయాత్ర సఫలం కానట్టు కుంతీమాదవుని దర్శనం చేసుకోనిదే పిఠాపుర క్షేత్ర సందర్శన ఫలించదని పండితులు చెబుతారు. 


👉ఇక గర్బాలయంలో చతుర్భుజాలతో కుంతీమాధవస్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి వారి కంఠహారం 24 సాలగ్రామములతో ఉంటుంది. 

ఈ స్వామివారు శంఖు, చక్ర, గద, కిరీటం తిరునామాలను ధరించి ఉంటాడు. 

ఇంకా ముఖమండపంలో శ్రీదేవి – భూదేవి సమేతంగా కుంతి మాధవుడు, మహాలక్ష్మి, గోదాదేవి మొదలగు ఉత్సవ మూర్తులు ఉన్నాయి.


👉ఈ పిఠాపురం క్షేత్రం స్కంద పురాణంలోని భీమ ఖండంలో బాగా ప్రస్తావించబడింది. 

ఈ ప్రదేశంలో శ్రీ కుకుటీశ్వర్ స్వామి మరియు శ్రీ కుంతీ మాధవ స్వామికి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ కారణంగానే పిఠాపురం క్షేత్రం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 

అతని చేతులలో పద్మం, చక్రము, శంఖము మరియు కుంతము  అనే గద ,  మోహనాకర రూపంలో కనిపిస్తూ, శ్రీ కుంతీ మాధవ స్వామిగా ఆరాధించబడ్డాడు.


🔅 " కుంతము అనే అని గద ధరిస్తాడు కనుక కుంతి మాధవ స్వామి అని స్వామివారికి పేరు. 

కుంతిదేవి పూజించినందుకు స్వామివారికి ఆ పేరు రాలేదు...అందరూ గమనించగలరు " 


👉చరిత్రలోని శాసనాల ప్రకారం, చంద్ర గుప్త మౌర్య రాజవంశం ఈ ప్రాంతాన్ని పాలించింది. తరువాత పల్లవులు క్రీ.శ. 3వ శతాబ్దంలో బాధ్యతలు స్వీకరించారు, మళ్లీ 6వ శతాబ్దంలో చాళుక్యులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


👉ఈ ఆలయం కూడా ముస్లిం పాలకుల దాడికి గురైంది, వారు ఈ ఆలయ నిధిపై దాడి చేసి దోచుకున్నారు. ఈ ఆలయం 17వ శతాబ్దంలో పద్మనాయక పాలకులచే పునర్నిర్మించబడింది.


👉ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసం నందు 7 రోజులపాటు స్వామివారికి కల్యాణోత్సవాలు జరుగుతుంటాయి. 

ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Read More

ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి నమోస్తుతే .....!!

 🙏  ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి  నమోస్తుతే .....!!




శుభం కరోతి కళ్యాణం 

            ఆరోగ్యం ధన సంపద

శత్రు బుద్ధి వినాశాయ 


          దీప జ్యోతిర్ నమోస్తుతే 

       దీప-జ్యోతి: పరబ్రహ్మ               

           దీప జ్యోతి జనార్ధనః,

  దీపో హారతి మే పాపం 

          దీప-జ్యోతిర్-నమోస్తుతే

ఏ దీపజ్యోతి ఐతే శుభం,మంచి,ఆరోగ్యం ధనసంపదలు మీకు ప్రసాదిస్తుందో,చెడు తలపులను తొలగిస్తుంది,ఆ దీప జోయతికికి ప్రణమిల్లుతున్నాను ..


🙏🪔🪔🙏🪔🪔🙏🪔🪔🙏

Read More

మహానంది


*కర్నూలు జిల్లా*


*మహానంది -2* 


*'చెక్కిలి చుక్క’*


ఈ ఆలయం నిర్మింపబడిన పరిసరాలలోని ప్రకృతి దృశ్యాలను బట్టి యాత్రీకులకు మహానంది యాత్రాస్థలమే కాకుండా విహార యాత్రాస్థలము అవుతోంది. కొండల చేరికవల్లా ఏటికి ఏడాది పొడవునా ఎడతెగక గుడి చుట్టూ పారే నీటి బుగ్గల చలవ వల్ల నిసర్గసిద్ధమైన ఏకాంత పావనత్వం వల్లా ఈప్రదేశం యాత్రికుల

ను సర్వకాలాలలోనూ ఆకర్షిస్తూనే వుంటుంది. నల్లమల కొండల ప్రకృతి సౌందర్యానికి యీ ప్రదేశాన్ని 'చెక్కిలి చుక్క' అంటారు. ఈ ఆలయ తీర్థం తన ఔషధీ గుణంచేత ప్రసిద్ధికెక్కింది. ఈ ధాతు జలం ఏడాది పొడుగునా కవోష్టంగానే ఉంటుంది. 


ప్రధాన తీర్థం ఆలయ ముఖమంటపం ముందు వుంది. ఇది అరవై అడుగుల చదరపు తొట్టె! మధ్యలో ఒక మంటపం ఉంటుంది. యాత్రికులు మునగడానికి వీలుగా ఎప్పుడూ అయిదు అడుగుల లోతు నీరు వుండేటట్లు యీ తొట్టి యొక్క జలనిస్పరణ, ప్రసరణ మార్గములు అమర్చబడి ఉన్నాయి. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియదు. తొట్టెలోనికి నీటి పారుదల కనిపిస్తుందే కాని సరిగ్గా తూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ తీర్థంలోకి నీరు అయిదు బుగ్గల్లో నుంచి వస్తోంది. వాటిని శ్రీశైలధార, సరసింహధార, దైవేదినీ తీర్థం, నంది తీర్థము, కైలాస తీర్థమని పిలుస్తారు. స్ఫటిక నిర్మలమైన ఈ నీరు ఎప్పుడూ కవోష్ణమై (గోరువెచ్చని) ఉంటుంది.


లింగాకారమై ఉన్న ఇచ్చటి మూలవిరాట్టు భారతదేశంలోని ఇతర లింగాలకంటే విలక్షణమై అసదృశమై వుంది. ఇది రెండు చోట్ల సొట్టలు పడిన పుట్టుశిల! కాని వైష్ణవులకు కూడా ప్రతిపత్తి విషయములైన సాలగ్రామములతో కూడి యున్నందువల్ల యీ లింగము యొక్క మహిమ అమేయమని భావించబడుతోంది. శ్రీశైలంలో మాదిరిగానే లింగం ఇక్కడ కూడా పీఠత్రయ విరహితయై భూమికి ఉపరితలం మీదనే కానవస్తుంది. అక్కడ మాదిరిగానే ఇక్కడా స్వామి ని అందరూ ముట్టుకోవచ్చును. మనసారా, చేతులారా పూజించుకోవచ్చును.

📖


ప్రస్తుతం ఈ విధమైన లింగాకారాన్ని గూర్చి ఇచ్చటి స్థలపురాణంలో నచ్చిక కలిగించే గాధ ఒకటి ఇలా ఉన్నది. పూర్వం నవనంది మండలాన్ని సందుడనే మహారాజు ఏలుతున్నాడు. మహానంది ఆ నవనంది మండలంలో చేరికయై ఉంది. ఆ మహారాజునకు ఒక తలంపు కలిగింది. స్వామి విగ్రహానికి తైలాభ్యంజనం చేసి పాలతో అభిషేకం చెయ్యాలని! ఎక్కడెక్కడి ఆవుల మందలను రప్పించాడు. గోపవరం అనే పల్లె నుండి వచ్చిన మందలో ఒక కట్టి ఆవు ఉంది. ఆ రాజుచేసే అభిషేకంలో ఎక్కువగా ఆ కట్టి ఆవుపాలే ఎక్కువగా ఉపయోగపడేవి. ఆ ఆవు అడవులలో స్వేచ్ఛగా తిరుగుతూ మేస్తూండేది. కొన్నాళ్ళకు అది అడవిలో చాలాసేపు కనపడకుండా వుండటం చాలా పర్యాయాలు గమనించారు. అభిషేకంలో వినియోగపడే దాని పాలు క్రమంగా తరిగిపోవటం గమనించారు. ఇలా పాలెందుకు తరిగిపోతున్నాయో గమనించడానికి ఒకనాడు గొల్లవాడు ఆవు వెంట అడవికి వెళ్లాడు. ఒక చీమల పుట్ట చుట్టూ తిరుగుతూ ఆవు మేయడం గమనించాడు. కొంచెంసేపటికి ఆవు పుట్టమీద నిలబడింది. ధారగా పాలు పుట్టలోనికి కారుతున్నాయి. చివరికి కృష్ణుని రూపంలో వున్న ఒక శిశువు చీమల పుట్టలో నుంచి పైకి తొంగి చూచి ఆవుకు దర్శనమిచ్చాడు. తరువాత నెమ్మదిగా ఆవు మందలోకి వచ్చింది. గొల్లడు ఈ సంగతి రాజుతో చెప్పాడు. తన విశ్వాసాన్ని పరీక్షించడానికి పరమేశ్వరుడే అలా శిశువు రూపంలో వచ్చాడని రాజు సూటిగా ఊహించాడు. 


మరునాడు రాజు కూడా ఆవు వెంట అడవికి వెళ్ళి ఒక దట్టమయిన పొదలో దాగి ధ్యాన నిమగ్నుడై పరమేశ్వరుని దర్శనక్షణం కోసం ఎదురుచూస్తూ వున్నాడు. ఆవు పుట్టను సమీపించి చుట్టూ తిరిగి భక్తి నిశ్చలయై నిలబడి వుంది. పరమేశ్వరుడు శిశువుగా కనబడి ఆవు పాలు ఆరగించాడు. అద్భుతాక్రాంతుడైన రాజు రాట్రిల్లడంలో ఎండుటాకులు మరమరలాడాయి. ఆ సవ్వడికి మనసు చెదరి ఆవు బెదరి భయ భ్రాంతమై పుట్టను గిట్టలతో మట్టగించింది. శిశువు అదృశ్యమైపోయినాడు. పుట్ట మట్టి తేమగా వున్నందువల్ల ఆవు గిట్టల అచ్చు దానిమీద అత్తుకుంది. తలవని తలంపుగా జరిగిన యీ దైవాపచారానికి రాజు భయపడి పరమేశ్వరుణ్ణి క్షమించమని ప్రార్థించాడు. రాజు ప్రార్థనకు సంతుష్టుడై ఆవు మట్టగించిన ఆ చీమల పుట్ట తేమ ఆరి తనంతట మహానంది వద్ద స్వయం భూలింగమై వెలిసేటట్లు పరమేశ్వరుడు సంకల్పించాడు. అందువల్లనే గిట్టల రెండు గుర్తులూ మహానంది లింగంమీద నేటికీ కనిపిస్తాయి.

📖


ఆలయం ముందు పెద్ద నంది వున్నది. బహుశః యీ ప్రదేశానికి 'మహానంది' అనే వాడుక ఆ నంది వల్లనే వచ్చి వుంటుంది. ఆలయం వెనుక వున్న చెరువును 'రుద్రగుండం' అంటారు. అచ్చట విష్ణు గుండమనీ, బ్రహ్మగుండమనీ ఇంకా రెండు చెరువులున్నాయి.


ప్రధానాలయం ప్రక్కన అమ్మవారి ఆలయం వుంది. అమ్మవారి ముందున్న శ్రీ చక్రం ఆదిశంకరులు ప్రతిష్ఠించినదంటారు. అమ్మవారి కన్నుల ఎదుట ఏకనాగ్రంగా పరమేశ్వరుణ్ణి ధ్యానించినవారికి వారి సంస్కారానుభూతమై దర్శనం కలుగుతుందని యిచ్చటి జనప్రచురమైన విశ్వాసం. అమ్మవారి ముందున్న ముఖమంటపం ఇటీవల భైరవ జ్యోస్యుల మహానందయ్యగారు కట్టించినది.


ప్రధానాలయం వెనుక మూడు చిన్న గుడులు వున్నాయి. ఒక్కొక్క లింగంలో ఈ మూడు లింగాలను ఆరాధించినట్లయితే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు అతీతమైన స్థితి సిద్ధిస్తుందని ప్రసిద్ధి.


మహానందికి చుట్టూ పదిమైళ్ళ వలయంలో తొమ్మిది నంది అలయములున్నాయి. వాటి పేర్లివి: 1) పద్మనంది. 2) నాగనంది, 3) వినాయక నంది, 4) గరుడనంది, 5) బ్రహ్మనంది, 6) సూర్యనంది, 7) విష్ణునంది, 8) సోమనంది 9) శివనంది. 


నిజానికి ఇది 'నంద్యాల' అనే నంద్యాలయము నకు తద్భవ రూపమే.


ఇచ్చటి ఉత్సవాలలో శివరాత్రి చాలా ముఖ్యమైన ఉత్సవం. శ్రీశైలానికి వచ్చే యాత్రీకులందరూ సామాన్యంగా యిచ్చటికే వస్తారు. కార్తీక మాసం లో శ్రద్ధాన్వితులైన యాత్రికులు ఉషఃకాలంలో ప్రప్రథమంగా మల్లికార్జున స్వామిని సేవించి యిచ్చటికి రెండు మైళ్ళ దూరంలో వున్న పద్మ నందిని సేవించి యిచ్చటికి రెండు మైళ్ళ దూరం లో పడమరగా ఉన్న నాగనందిని సేవించి చేరువనే ఉన్న బ్రహ్మనందినీ, సోమనందినీ, శివనందినీ సేవించుకొని, అచ్చటికి ఈశాన్యంగా మూడు మైళ్ళలో వున్న విష్ణునందిని సేవించి యాత్ర ముగిస్తారు. ఈ నవనందుల సేవ సూర్యుడస్తమించేలోగా పూర్తిచేసుకోవాలని సంప్రదాయజ్ఞులంటారు.

📖


ఈ ప్రదేశం 'నవనంది'గా మారటానికి జన ప్రసిద్ధములైన గాథలు రెండు ఉన్నాయి. ఒకటి కృతయుగంలో పర్వతుడనే మహర్షికి ఇద్దరు కొడుకులు. శిలాదుడని, నంది అని. పెద్దవాడైన శిలాదుడు తన తీవ్ర తపశ్చర్యవల్లనే పేరు పొందాడు. ఏమంటే ఆయన రాళ్ళు తిని తపస్సు చేశాడు. ఆ విధమైన తపస్సుకు సంతుష్టుడై పరమేశ్వరుడు శిలాదుణ్ణి ఒక పుణ్య పర్వతంగా చేసి దానిమీద నివసించటం మొదలుపెట్టాడు. ఒక శ్రేణిలో సుప్రసిద్ధమైన శ్రీశైలం అదే! 


అదే రీతిగా రెండవ కుమారుడు నంది కూడ పరమేశ్వరుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. శివుడియనను నందిగా మార్చి తనకు వాహనం గా చేసుకొన్నాడు. నంది తపస్సు చేసిన ప్రదేశం లోని భాగమే యిఫ్ఫటి మహానంది ఉన్న ప్రదేశం.


 రెండవ గాథ- ఈ ప్రదేశాన్ని క్రీ.శ.11వ శతాబ్దంలో నందవంశపు రాజులు పరిపాలించారు. వారు తమ కులదైవమైన నందికి అనేకాలయాలు నిర్మించి ఆరాధించారు. ఇచ్చటి నంది ఆలయాలు విజయనగర రాజులతోసహా అనేక రాజవంశాల ఆదరణను పొందాయి.


ఇచ్చట యాత్రికులకు మంచి వసతులున్నాయి. మహానంది యాత్రాస్థలమేకాక ప్రకృతి రమణీయ స్థలం కూడా కావటమే దీనికి కారణం. ఇచ్చటి ప్రధానోత్సవం శివరాత్రి. దసరా, ఉగాదులకు కూడా యిచ్చట ఉత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయం దూర, సమీప ప్రాంత జనాలను సమానంగా ఆకర్షిస్తుంది. దేశకాలముల అలజళ్ళకు చలించని దృఢవిశ్వాసానికి ప్రతీకగా మహానంది నిలిచి ఉంది.


మౌన విలీనమైన అభివ్యక్తితో చక్రనేమిక్రమప్రాప్త ములైన మానవజాతి యొక్క పతనాభ్యుదయ ములకు సాక్షియై మహానంది ప్రణవానుసంధానం చేస్తున్నట్లు వుంటుంది.

🛕

*సశేషం*

Read More

సూర్యుని రూపాలు 🙏🏻

 

1. ఇంద్రుడు : 

స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు. 


2. ధాత : 

ప్రజాపతియై భూతములను సృష్టించాడు. 


3. పర్జన్యుడు:

తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.


4 త్వష్ట :

ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి. 


5. పూష : 

ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు. 


6. అర్యముడు :

దేవతారూపంలో వుంటాడు.


7. భగుడు :

ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు. 


8. వివస్వంతుడు :

ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు. 


9.విష్ణువు : 

శత్రువులను నాశనం చేస్తాడు. 


10.అంశుమంతుడు :

గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు. 


11. వరుణుడు :

జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు. 


12. మిత్రుడు :

లోకాాలలో మేలుచేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు.

Read More

నవగ్రహ స్తోత్రములు*

 *☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸


నవగ్రహ స్తోత్రములు*

(తాత్పర్య సహితము)

🙏🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹🙏


🙏 *నవగ్రహస్తోత్రం* 🙏


*ఆదిత్యాయ చ సోమాయ*

*మంగళాయ బుధాయ చ*

*గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!!*


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂


🕉️ *01. రవి (ఆదిత్య):* 🙏


*జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్!*

*తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్!!*


*భావము:* 🌹


*దాసనచెట్టుపువ్వు రంగుతో సమానమైన ఎరుపు రంగు కలవాడు, కాశ్యప వంశంలో జన్మించినవాడు, గొప్ప కాంతి కలవాడు, చీకటికి శత్రువు, అన్ని పాపములను పోగొట్టేవాడు అయిన సూర్యభగవానునికి నమస్కరించుచున్నాను.*


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂


🕉️ *02. చంద్ర (సోమ):* 🙏


*దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవమ్!*

*నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్!!*


*భావము:* 🌹


*పెరుగు, శంఖము, మంచు మొదలైనవాటి తెలుపురంగుతో సమానమైన తెలుపురంగు కలవాడు,  పాలసముద్రం నుండి పుట్టినవాడు, శివుని యొక్క కిరీటము నందు అలంకారమైనవాడు, కుందేలు గుర్తుగా కల్గినవాడు, ఉమతో కూడిన శివుని యొక్క మూర్తులలో ఒకడైన (స+ ఉమ=సోమ) సోమునికి నమస్కరించుచున్నాను.*


*విశేషము:* 🌈


*చంద్రమా మనసో జాతః...* 

భగవంతుని మనస్సు చంద్రుడు.. . 

శ్రద్ధతో ఈ శ్లోకం చదవటం ద్వారా మనస్సుకు బలం కలుగుతుంది.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ *03. కుజ (మంగళ):* 🙏


*ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్!*

*కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్!!*


*భావము:* 🌹


*భూమికి జన్మించినవాడు, మెఱుపు వంటి కాంతి కలవాడు, బాలుడు, శక్తి అనే ఆయుధం హస్తము నందు కలవాడు, శుభములను, క్షేమమును ప్రసాదించే అంగారకుని (కుజుని) కి నమస్కరించుచున్నాను.*


*విశేషాలు:* 🌈


1. *శక్తి హస్తమందు కలవాడు.*

(1. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి,  

2. ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము 

3. సత్వము, రజస్సు, తమస్సు 

అను శక్తులను తన అధీనమందు కలిగినవాడని తాత్పర్యం.) 


2. *భూమికి జన్మించినవాడు*

మంగళవారానికి అధిపతి అయిన కుజుడు భూమి కుమారుడు. ఏ కొడుకైనా తన తల్లిని బాధ పెట్టాలని భావించడు. అందుకే మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అన్నారు పెద్దలు.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂


🕉️ *04. బుధ:* 🙏


*ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్!* 

*సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్.*


*భావము:* 🌹


*ప్రేంకణపు చెట్డు అనగా కదంబవృక్షపు మొగ్గ వలె ఆకుపచ్చని రంగు కలిగినవాడు, తన ఆకారములో ఎవరితోనూ సాటిలేని వాడు, సోముడు దేవతగా కలవాడు, సత్వగుణముతో కూడినవాడూ అయిన బుధునికి నేను నమస్కరింతును.*


*విశేషం:* 🌈

✅👉 *బుద్ధికి సంబంధించిన ప్రతిబంధకాలను ఈ బుధ స్తోత్రం తొలగిస్తుంది.*


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ *05. గురు:* 🙏


*దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |* 

*బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||*


*భావము:* 🌹


క్రీడించేవారిని దేవతలంటారు. అటువంటి దేవతలకు; జ్ఞానము యొక్క సారము పొందినవారు ఋషులు. అటువంటి ఋషులకి ; సర్వార్ధములు చెప్పే గురువుకి; 

ప్రకాశించేది కాంచనం. అటువంటి బంగారముతో సమానమైన కాంతి కలవానికి; దేనిచేత తెలియబడుతుందో అది బుద్ధి. అటువంటి బుద్ధి కలవారిలో శ్రేష్ఠునికి; మూడు లోకములకు ప్రభువైన; దేవతలు వేదమంత్రములను బృహత్తులు అంటారు. వాటికి ప్రభువు బృహస్పతికి; నమస్కరించుచున్నాను.  


*విశేషాలు:* 🌈


1. ఇందులోని త్రిలోకేశ పదం - *జాగ్రత్, స్వప్న సుషుప్తావస్థలను* సూచిస్తుంది. ఈ మూడు దశలలోను బుద్దిని సరిగా ఉంచుటకు గురు గ్రహ ప్రార్ధన ఉపయోగపడుతుంది.


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ *06. శుక్ర:* 🙏


*హిమ కుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ |*

*సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||*


*భావము:* 🌹


*చల్లని మంచులా, మొల్ల పుష్పము వలె, తామరతూడువలె పోలిక కలిగినవాడు, రాక్షసులకు పరమశ్రేష్ఠుడైన గురువు, అన్ని శాస్త్రములను చక్కగానెరిగినవాడు అయిన శుక్రునికి నేను నమస్కరించుచున్నాను.*


*విశేషాలు:* 🌈


1) *ఈ శుక్ర గ్రహ స్తోత్రం బలాన్ని, ఉత్సాహాన్ని కలుగచేస్తుంది.*


2) *శుక్రమనగా తేజస్సు. అది కలవాడు శుక్రుడు.*


꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂

🕉️ *07. శని:* 🙏


*నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|* 

*ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||*


*భావము:* 🌹


*నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి వాడు, సూర్యభగవానుడి పుత్రుడు, యముడికి సోదరుడు, ఛాయా దేవికి మార్తాండుడికి అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడైనటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను.*


*విశేషములు:* 🌈


మనం ఎప్పుడు కూడా శని శని శని అని పిలిచి భయపడక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనైశ్చరుడు. ఒక విశేషం గమనించండి. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఉంటుంది.


ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనైశ్చరుడు కూడా శివుడిలాగా, వేంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి.

Read More

అక్షయ్తృతీయ విశేషం ఏంటి తెలుసుకుందాము.

 🌷 #అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రం లో లేదు . వీలైతే బ్రాహ్మణుల కు స్వయం పాకం ఇవ్వండి , బీద వాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. 


అక్షయ్తృతీయ విశేషం ఏంటి తెలుసుకుందాము.


 1. పరశురాముని జన్మదినం

 2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

 3. త్రేతాయుగం మొదలైన దినం

 4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

 5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం

 6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

 7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం

 8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

 9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

11.సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా ఆ రోజే జరుగుతుంది 🌹🌹🌹

Read More

వైశాఖ శుద్ద తదియ - అక్షయ తృతీయా / తదియ 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*

 వైశాఖ శుద్ద తదియ - అక్షయ తృతీయా / తదియ 𝕝𝕝卐𝕝𝕝_*

*≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*

 

*_అక్షయ తృతీయా విశిష్టత_*

*━❀꧁ 🔆 ꧂❀━*


వైశాఖ శుద్ద తదియ నాడు ఈ పండుగను ఆచరిస్తారు. వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ అక్షయ తదియ నాడు రోహిణి నక్షత్రముంటే మరింత పుణ్యప్రదమని చెబుతారు. ఈరోజు చేసేటటువంటి హోమం, దానం, పితృదేవతలకు చేసే పూజ అక్షయమవుతుంది గనుక ఇది "అక్షయ తదియ" అనబడింది. శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఎంతో పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్నైనా మొదలు పెడితే అది అక్షయంగా ఉంటూ వృద్ది చెందుతుంది. ఈ అక్షయ తదియ బుధవారం లేదా సోమవారం నాడు వస్తే మరీ విశేషం గా చెప్పబడింది.


కొన్ని ప్రాంతాలలో గౌరీదేవీకి డోలోత్సవం, కృష్ణునికి డోలోత్సవం చేస్తారు. ముత్తైదువులు, కన్యలు ఈ పూజలో పాల్గొంటారు. పూజ అయ్యాక పండ్లు, తీపి పదార్దాలు నాన వేసిన సెనగలను వాయనమిస్తారు. ఈ రోజు అక్షయ తదియ వ్రతాన్ని చేసుకొనే వారు ఉప్పును మానేసి చక్కర కలిపిన పేలపిండిని భుజిస్తారు. బదరీనారాయణ మందిర ద్వారము ఈ రోజే తెరుస్తారు. ఇంతవరకు అక్కడ మంచు పేరుకుని ఉంటుంది. పరశురాముని జయంతి కూడా ఈరోజు జరుపుకొంటారు. ధనానికి మూలంగా చెప్పే కుబేరుడికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహం వరం లభించిన రోజు. శివుడు అన్నపూర్ణ దేవి దగ్గర గుప్త రూపం లో బిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పబడింది.  


ఈరోజు చేసే మంచి పనులు కోట్ల రెట్ల ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని  ఈ రోజే వ్రాయడం మొదలు పెట్టాడు, దీనివలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని ఈరోజుకీ పొందగలుగుతున్నాం. శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఈరోజే అక్షయ పాత్రని అనుగ్రహించిన రోజు. కుచేలుడు శ్రీ కృష్ణునికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందగలిగాడు.


బంగారు వెండి ని కొనాలాని ఎక్కడ కుడా శాస్త్రవచనం లేదు. ఈరోజు చేయవలసిన మంచిపనులు దానాలు గురించే ప్రస్తావించబడింది. భగవంతున్ని ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి, అలాగే  వారికున్నదానిలో నలుగురి మంచి కోరి ఒకరికి సహాయం చేసే వారికి బీదవారికి తమ చేతనైన సహాయం చేసేవారికి భగవంతుని కృపతో అంతకి కోటి రెట్ల రూపంలో మనకి చేరుతుందని తెలుస్తుంది.


కృతయుగానికి ఆది అయిన ఈ రోజు ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలి. సూర్యోదయం ముందు నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్య ఫలం లభిస్తుంది. ఆ తర్వాత ఉదక ఘటమును అనగా నీటికుండను వేసవిలో పండే పంటలు, యవలు, గోధుమలు, సెనగలు మొదలైనవి మరియు పెరుగు అన్నం దానం చేయాలి. అలా చేస్తే శివ సాయుజ్యం లభిస్తుందని భవిష్య పురాణం, దేవీపురాణం తెలియజేస్తున్నాయి. శ్రీ మహావిష్ణువికి చందనం లేపనం చేయడం వల్ల ,నారాయణ మందిర వాసం లభిస్తుందని చెబుతారు. సింహాచల క్షేత్రం లో స్వామి వారికి సంవత్సరానికి ఒకసారి చందనం పూత పూసి అలంకరిస్తారు. మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ నాడు మటుకే చందనం తీసి మళ్ళీ అలంకరిస్తారు. ఈ రోజు పితరులకు పిండరహితమైన శ్రాద్ధమును చేయాలి. ఈ వైశాఖ శుక్లతదియ రోజున గొడుగు, పాదరక్షలు, గోవ, భూమి, బంగారం, వస్త్రములు, నీటితో నిండిన కుండను దానమివ్వడం మహా పుణ్యమని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.


ఈ రోజు సూర్య చంద్రులిద్దరు తేజోవంతంగా ఉంటారు కావున దానాలుకు చాలా మంచి సమయమని చెప్పవచ్చు అలాగే ఈ రోజు ప్రతి ఘడియ కుడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన  దానాలు చేయడం వలన అనంత ఫలం పొందగలం.


తులసి ఆకులతో విష్ణుసహస్రనామ పారాయణ చేయడం అనంత పుణ్య ఫలం లభిస్తుంది.


గోధుమలు దానం చేస్తే ఇంద్రుడు యొక్క అనుకూలత తో వర్షాలు చక్కగా కురిసి అన్నాదులకు లోటు కలగదు.


పానకం వడపప్పు మామిడి పళ్ళు శ్రీ మహా విష్ణువుకి నివేదించడం మంచిది. మామిడి పళ్ళు విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.


గోధుమలు, నెయ్యి, ఉప్పు, పండ్లు, కూరగాయలు, చింతపండు కూడా దానం చేసినట్లైతే వారికి అన్ని విధాల మంచి ఫలితాలు కలుగుతాయి.


కంచు గిన్నెలో నీటిని పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, తులసి, వక్క, దక్షిణతో సహా దానమిస్తే గయాలో శ్రాద్ధ చేసిన ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కావాలనుకొనే వారు, పితృ శాపాలు ఉన్న వారు చేస్తేమంచి ఫలితం లభిస్తుంది.


ముఖ్యంగా ఈరోజు చెట్లని నాటడం అనంత ఫలాన్నిస్తుంది, ఎప్పటికి తరిగిపోని పచ్చదనం భూమిపై పెరుగుతుంది. ప్రకృతిని పూజించి ఔషద మొక్కలను ఈ రోజు నాటి నట్లైతే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని ప్రతీతి.


*అక్షయ తృతీయ. దాని ప్రాముఖ్యత*

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈


1. పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం 

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.


కేవలం దాన ధర్మాలకు, ఆధ్యాతిక చింతనకు, సేవా దృక్పథానికి ప్రత్యేకత కలిగినదే అక్షయ తృతీయ. రోగులకు సేవ, పేదలకు అన్నదానం, గోవులు, పశు పక్ష్యాదులకు దాణా, తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి. బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఏర్పాటుచేయడం ఎంతో పుణ్యఫలం. దైవ పూజ - వ్రతం, మంత్ర సాధన చేస్తూ భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక సందేశాలు వినడం ఉత్తమం. ఓ రెండు ముద్దలు పక్షులకు పెడితే పితరులకు, యముడు, శని, కాలభైరవునికి పెట్టినట్టే. ఈ పుణ్యకార్యాల వల్ల భవిష్యత్తు బంగారంగా మారుతుంది. అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి.


అంతేగాని…


బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు. అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం.


*అక్షయతృతీయ శుభాకాంక్షలు*

Read More

వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, సింహాచలం చందనోత్సవము. సందర్భంగా ఈ కథనం

 శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, సింహాచలం చందనోత్సవము.   సందర్భంగా ఈ కథనం

సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామీ వారి నిజ రూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ… అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం  అత్యంత వైభవంగా జరుగనుంది.


చైత్ర అమావాస్య ను గంధం అమావాస్య గా జరుపుతారు. ఇందుకు నిదర్శనం గా ఖచ్చితంగా గంధం అమావాస్య రోజున వర్షం పడుతుందని పెద్దలు చెపుతుంటారు.


విశాఖపట్టణం జిల్లా , సింహాచలం ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం. దేశంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో అతి పాచీనమైనది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం క్షేత్రం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. 


దశావతారాల్లోని రెండు అవతారాలు కలగలసిన అరుదైన స్వరూపమే సింహాచల క్షేత్రం లోని వరాహనరసింహావతారం. తన భక్తుడైన ప్రహ్లాదునికిచ్చిన మాట కోసమై హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారమూ కలిసి వరాహ లక్ష్మీనరసింహావతారం గా భక్తులకు అభయమిస్తున్నారు. స్వామివారు త్రిభంగి ముద్రలో అనగా వరాహము యొక్క తల, మానవ శరీరము, సింహం తోక కలిగిన మూర్తిగా దర్శనమిస్తారు.


స్థలపురాణం:-

******

తన అన్నహిరణ్యాక్షుని చంపినవాడని హరి మీద ద్వేషం పెంచుకున్న హిరణ్యకశిపుడు, స్వయంగా తనకు కలిగిన బిడ్డే హరిభక్తుడు కావడం సహించలేకపోయాడు. కన్నమమకారాన్ని కూడా చంపుకుని, పసివాడని కూడా చూడకుండా, అతని హరిభక్తిని మానిపించడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. అయినా వినకపోవడంతో అనేక రకాల చిత్రహింసలు పెట్టాడు. ఏనుగులతో తొక్కించాడు. విష సర్పాలతో కరిపించాడు. అగ్ని జ్వాలల మధ్య పడవేయించాడు. నిరంతర హరినామస్మరణతో, భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ప్రహ్లాదుడిని అవి ఏ రకంగానూ బాధపెట్టలేకపోయాయి. చివరికి ఒక కొండపైనుండి సముద్రంలోనికి తోసివేయించే ప్రయత్నం చేసాడు. ఆ కొండయే సింహాచలమనీ, ఎన్ని ఆపదలొచ్చినా, తన భక్తులను ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉండే శ్రీమన్నారాయణుడు సముద్రంలో పడిపోకుండా ప్రహ్లాదుడిని కాపాడాడనీ, అప్పుడు ప్రహ్లాదుడు, తనను కాపాడటానికి ద్వయావతారంలో(వరాహ, నరసింహ) వచ్చిన విష్ణుమూర్తిని అదే రూపంతో సింహాచలం మీద వెలిసి, భక్తులను కరుణించమని వేడుకున్నాడనీ స్థలపురాణం చెప్తోంది.


హిరణ్యకశిపుని సంహారానంతరం ప్రహ్లాదుడు సింహాచలం కొండపై వెలసిన స్వామికి దేవాలయం కట్టించాడు. కానీ కృతయుగం చివరికి అది శిథిలమైపోగా, విగ్రహం చుట్టూ మన్ను పుట్టలా కట్టింది. తర్వాతి యుగంలో చంద్ర వంశం లోని వాడైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆ ప్రాంతాలలో ఆకాశమార్గాన విహరిస్తుండగా, సరిగ్గా స్వామివారు వెలిసిన ప్రాంతంలో ఆయన రథం ఆగిపోవడంతో, అక్కడ ఏదో శక్తి ఉందని భావించి, క్రిందకి దిగాడు. ఆయన మట్టితో కప్పబడిన విగ్రహాన్ని చూసి, చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తూ ఉండగా ఆకాశవాణి స్వామివారిని చందనంతో కప్పి ఉంచమని, కేవలం సంవత్సరానికి ఒక్క రోజు(అక్షయ తృతీయ- వైశాఖ శుద్ధ తదియ) మాత్రమే స్వామి నిజరూప దర్శనంతో అనుగ్రహిస్తారనీ పలికింది. అప్పుడు పురూరవుడు స్వామివారి మూర్తిని చందనంతో పూత పూసి ఆలయం నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకూ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చందనపు పూతతో ఉన్న స్వామి లింగాకారుడిగా దర్శనమిస్తాడు.

Read More

బహుప్రాచీనమైన దివ్యస్థలం అహోబలం!


*కర్నూలు జిల్లా*


*అహోబలం -1*


బహుప్రాచీనమైన దివ్యస్థలం అహోబలం!



కర్నూలు మండలములోని నంద్యాల రైలు స్టేషనుకు ముప్పయి మైళ్ళ దూరంలో అహోూ బలం ఉంది. నంద్యాల నుండి అహోూబలానికి సమృద్ధిగా బస్సులున్నాయి. ఆంధ్రదేశంలోని మరికొన్ని ప్రధాన కేంద్రాల నుండి కూడ ఇచ్చటికి బస్సులున్నాయి.


అహోబలానికి వెళ్ళే మార్గాలు మూడు ఉన్నాయి. ఉత్తరాది నుండి వచ్చే యాత్రికులు నంద్యాలలో రైలు దిగి అచ్చటికి ముప్పయి మైళ్ళలో వున్న అహోబలానికి బస్సు మీద ఆళ్లగడ్డ మీదుగ వెళ్ళవచ్చు. రెండవది 'దోను'లో రైలు దిగి అచటి నుండి బనగానపల్లి, కోయిలకుంట్ల మీదుగా అహోబలం చేరవచ్చు. మూడవది సులభమైన మార్గం కడపలో రైలు దిగి అచ్చటికి నలభై మైళ్ళలో ఉన్న ఆళ్ళగడ్డ వచ్చి అక్కడి నుండి అహోబలానికి రావచ్చును.


ఈ ప్రదేశాన్ని 'సింగవేలు తుండ్రం' అని కూడా అంటారు. నరసింహ క్షేత్రం. శ్రీమన్నారాయణుడు ప్రహ్లాద సంరక్షణార్థమై హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఈ రూపం ధరించవలసి వచ్చింది. నారాయణుణ్ణి నరసింహ రూపంలో ప్రతిష్ఠించుకొన్న దివ్యస్థలాలు ఎన్నో ఉన్నాయి. కాని ఒక్క అహోబలంలోనే ఆ అవతారం యొక్క సమగ్ర వైభవాన్ని ఆరాధించుకొనే అవకాశం ఉన్నది. ఇక్కడ ఆ అవతారం యొక్క అన్ని రూపాలూ విజయం చేసి ఉన్నాయి. ఇచ్చట నవనారసింహులూ ఉన్నారు.


పర్వతపాదం సమీపించటంతోనే ప్రహ్లాద వరద నరసింహ దేవాలయం కనిపిస్తుంది. స్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రూపం ఇది. ఈ ఆలయం మూడు ప్రాకారాల నడిమి భాగంలో ఉన్నది. ఇది విజయనగరం శిల్పశైలిలో నిర్మింపబడి ఉన్నది. ఈ ఆలయానికి ఫర్లాంగు దూరంలో ఆళ్వార్లు కోనేరు ఉన్నది. అది యీ క్షేత్రంలో పానీయ జలాన్ని ప్రసాదిస్తోంది. ఇక్కడికి మైలున్నర దూరంలో ఛత్రావిత నరసింహస్వామి వేంచేసి యున్నాడు. ఈ స్వామి చుట్టూ అన్నీ ముళ్ళ పొదలు! స్వామి విగ్రహం ఒక రావి చెట్టుక్రింద ప్రతిష్ఠితమై ఉన్నది. పర్వతపాదం నుండి ఎగువ అహోబలం చేరడానికి కొండ ఎక్కాలి. ఈ పర్వత మార్గం రమారమి 6 మైళ్ళు. ఇది కన్నె కొండల మీదుగా అడవుల మీదుగా అనేక జలపాతాలతో అతి మనోహరమైన ప్రకృతి

సౌందర్యంతో నిండి ఉంటుంది. అచ్చట అనేక నరసింహాలయాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. 


అందులో కరండ నరసింహస్వామి ఆలయం ఒకటి. ఇంకొకటి యోగానంద నరసింహస్వామి ఆలయం అంటారు. జనప్రచారంలో ఉన్న గాధ ఇలా చెబుతుంది. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుణ్ణి శిష్యుడుగా స్వీకరించి స్వామి అనేక యోగ విద్యా రహస్యాలు ఉపదేశించాడు. ఆ ఉపదేశ మూర్తిని యోగానంద నరసింహ మూర్తి అంటారు. ఈ పుణ్యస్థలంలోనే గోఖిల భరద్వాజ మహర్షులు తపస్సు చేసి పాపవిముక్తు లైనారని ప్రసిద్ధి.

📖


“ఈ స్తంభంలో కూడ విష్ణువు ఉన్నాడా?"


ఎగువ అహోబలం సముద్రతలానికి 2,800 అడుగుల ఎత్తున ఉంది. ఈ కొండయొక్క రెండు శిఖరాలకు వేలాద్రి అని గరుడాద్రి అని పేర్లు. ఈ శిఖరాల నుండి పావనమైన భవనాశిని తీర్ధం ప్రవహిస్తూంటుంది. ఈ తీర్థం రెండు పాయలై కుమద్వతీ నదిలో, పెన్నానదిలోను కలుస్తుంది. దీన్ని అంతర్వాహిని అంటారు. కొండ దక్షిణపు వాలులో స్వామి ఉగ్రనరసింహ రూపంలో సేవింపబడుతున్నాడు. ఈ ఆలయ ప్రాకారం గోపురాలతో బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి చాలా దగ్గరలోనే గుహనరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ద్వారంలో పెద్ద స్తంభం ఉంటుంది. పురాణ ప్రసిద్ధమైన ప్రహ్లాదుని కథలో ఏ స్తంభాన్ని నిర్దేశించి హిరణ్యకశపుడు "ఈ స్తంభంలో కూడ విష్ణువు ఉన్నాడా?" అని దట్టించి అడిగాడో, ఆ స్తంభం యిదేనని ఈ స్తంభం లోంచే ఉగ్ర నరసింహాకారంలో స్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి చీల్చివేశాడని జనసామాన్యంలో ఉన్న గాఢ విశ్వాసం. 


ఈ ఆలయానికి మూడు ఫర్లాంగుల దూరంలో ఉంది, కోట నరసింహుని దేవాలయం. స్వామి ఇచ్చట వరాహరూపంలో సేవింపబడుతున్నాడు. ఈ గుడిలో మూడు రోజులు నారాయణ శతాక్షరీజపం, వరాహకాండ పారాయణం చేసిన భక్తునికి అమితమైన ఆముష్మికాభ్యుదయం లభిస్తుందంటారు.

📖


*నవ నరసింహులు*


ఇక్కడికి రెండుమైళ్ళ దూరంలో ప్రసిద్ధమైన మాలోల నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి శాంతరూపంలో లక్ష్మి అమ్మవారి తో ఎప్పుడూ వినోదిస్తూంటారు. ప్రసిద్ధుడైన కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు బంగారంతో ఉత్సవ విగ్రహం చేయించి సమర్పించాడు. ఆ విగ్రహం ఆధ్యాత్మద్రష్టలైన అహోబలం జియ్యరు స్వాముల ఆరాధనలందుకొంటూ ఉన్నది. ఇంకా ఎగువకు వెడితే జ్వాలా నరసింహస్వామి దేవాలయం వస్తుంది. ఇచ్చట స్వామి యొక్క ఉగ్రకళ సాక్షాత్కరిస్తుంది. స్వామి యొక్క కోపరూపం పరాకాష్ట వహించి హిరణ్యకశిపుణ్ణి ముక్కలు ముక్కలుగా చీల్చిన ప్రదేశం సరిగ్గా యిదేనంటారు. దీని సమీపంలోనే పావన నరసింహస్వామి ఉన్నాడు. ఈ స్వామికి శాక్త సంప్రదాయానుసారంగా అర్చన చేయవలసి వుంటుందిట.


ఈ నవనరసింహుల పేర్లు ఇవి 


1) ప్రహ్లాద నరసింహుడు లేక లక్ష్మి నరసింహుడు, 2) ఛత్రవాట నరసింహుడు, 

3) కండర నరసింహుడు, 

4) యోగానంద నరసింహుడు 

5) గుహ నరసింహుడు, 

6) క్రోడనరసింహుడు, 

7 ) మాలోల నరసింహుడు, 

8) జ్వాలా నరసింహుడు, 

9) పావన నరసింహుడు

Read More

అక్షయ తృతీయ నాడు సూర్యభగవానుడు ద్రౌపదికి "అక్షయ పాత్ర"ను ప్రసాదించిన వృత్తాంతం మహాభారతంలోని వనపర్వంలో కనిపిస్తుంది.

 అక్షయ తృతీయ నాడు సూర్యభగవానుడు ద్రౌపదికి "అక్షయ పాత్ర"ను ప్రసాదించిన వృత్తాంతం మహాభారతంలోని వనపర్వంలో కనిపిస్తుంది. 

*అక్షయ పాత్ర పురాణ కథ*

పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో, అనేకమంది బ్రాహ్మణులు, మునులు వారిని దర్శించుకోవడానికి వచ్చేవారు. అతిథి అభ్యాగతులను పూజించడం ధర్మరాజు నిత్యకృత్యం. అయితే, అడవిలో ఉన్న సంపదతో అంతమందికి భోజనం పెట్టడం ద్రౌపదికి కష్టతరమైంది.

దీనితో చింతించిన ధర్మరాజు, తన పురోహితుడైన ధౌమ్యుని సలహా మేరకు సూర్య భగవానుని గురించి తపస్సు చేశాడు. ధర్మరాజు భక్తికి మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై, ఒక రాగి పాత్రను (అక్షయ పాత్రను) ప్రసాదించి ఇలా అన్నాడు

"ధర్మరాజా! ఈ పాత్రను నీకు ఇస్తున్నాను. దీని ద్వారా మీరు వనవాసంలో ఉన్న పన్నెండు ఏళ్ళ పాటు అక్షయంగా (తరిగిపోకుండా) ఆహారాన్ని పొందవచ్చు. ద్రౌపది భోజనం చేసే వరకు ఈ పాత్రలో ఆహారం వూరుతూనే ఉంటుంది."

ఈ అక్షయ పాత్ర మహిమ వల్ల పాండవులు వేలమందికి అన్నదానం చేయగలిగారు. చివరకు దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి వచ్చి పరీక్షించినప్పుడు కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఈ పాత్ర పాండవులను కాపాడింది.

సూర్య భగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను ఇచ్చేటప్పుడు చెప్పిన కీలకమైన కొన్ని శ్లోక వచనాలు

 (మహాభారతం - వనపర్వం)

ఆదిత్య ఉవాచ-

*యత్తేఽహం ప్రార్థితం సర్వం తత్తే తాత భవిష్యతి |*

*అహం అన్నం ప్రదాస్యామి సప్త పంచ చ వత్సరాన్ ||*

*ఫల మూల మిషం చైవ యత్కించిత్ వనగోచరమ్ |*

*అక్షయం తే భవిష్యతి పాత్రే చైవ నరాధిప ||*

"నాయనా ధర్మరాజా! నీవు కోరుకున్నది నీకు లభిస్తుంది. రాబోయే పన్నెండు ఏళ్ల పాటు నేను మీకు ఆహారాన్ని ప్రసాదిస్తాను. ఈ పాత్రలో మీరు వండిన ఫలాలు, మూలాలు లేదా ఏ ఆహారమైనా సరే... ద్రౌపది భోజనం ముగించే వరకు అక్షయంగా (అనంతంగా) వస్తూనే ఉంటుంది."

*దదామి తే పఞ్చ చ షట్ చ సప్త చ |*

*చతుర్దశేయం తవ రాజన్ సమాః ||*

*అక్షయం తే భవిష్యంతి భోజనాని నరాధిప |*

*యావత్ ధారయిష్యతి పాత్రం ద్రౌపదీ మమ శాసనాత్ ||*

"ఓ రాజా! నేను నీకు ఈ పాత్రను ఇస్తున్నాను. దీని ద్వారా వచ్చే ఆహారం అక్షయంగా (ముగిసిపోకుండా) ఉంటుంది. ద్రౌపది భోజనం చేసే వరకు ఈ పాత్ర నుండి మీరు కోరుకున్న ఆహారం లభిస్తుంది."

*అక్షయ పాత్ర తిరిగి అప్పగించడం:*

పాండవులు తమ జీవితాంతం ధర్మాన్ని పాటించి, చివరకు రాజ్యాన్ని పరీక్షిత్తు మహారాజుకు అప్పగించి వెళ్లే సమయంలో, అగ్నిదేవుడు వారిని అడ్డగించి అర్జునుడి గాండీవం మరియు అక్షయపాత్ర (కొన్ని చోట్ల కేవలం గాండీవం మరియు అక్షయ తూణీరాలు అని ఉంటుంది) తిరిగి ఇవ్వమని కోరుతాడు. అప్పుడు వారు వాటిని వరుణ దేవునికి లేదా సముద్రంలో విసర్జించి వెళ్తారు.

అక్షయ పాత్రను పొందేందుకు ధర్మరాజు చేసిన స్తోత్రం (సూర్య అష్టోత్తరం)

ధర్మరాజు సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రార్థనలో కొన్ని ముఖ్య నామాలు...

*ధాతా కృతవిధాతా చ కార్తవీర్యస్తథైవ చ |*

*శతృజిత్ శతృతాపశ్చ నారాయణ ఉపాశ్రితః ||*

ఈ విధంగా 108 నామాలతో సూర్యుడిని స్తుతించగా, సూర్యుడు ప్రత్యక్షమై ఆ అద్భుత పాత్రను అక్షయ తృతీయ రోజే అందించాడని పురాణ ప్రశస్తి.

స్వస్తి

*-శృంగేరీ జగద్గురువుల భాషణలనుండి సందర్భంగా*

Read More

“సంయుక్త దృష్టి” అంటే గ్రహాలు కలిసి ఉన్న స్థానం నుండి వారి స్వాభావిక దృష్టులు 👉 “శని–కుజ సంయుక్త దృష్టి

 “సంయుక్త దృష్టి” అంటే గ్రహాలు కలిసి ఉన్న స్థానం నుండి వారి స్వాభావిక దృష్టులు 

👉 “శని–కుజ సంయుక్త దృష్టి అంటే, శని మరియు కుజుడు ఒకే రాశిలో సంయోగంగా ఉండి, అక్కడి నుండి తమ స్వాభావిక దృష్టులను (కుజుడు: 4, 7, 8; శని: 3, 7, 10) ఇవ్వడం.”

🔍 స్పష్టీకరణ:

కుజుడు దృష్టులు → 4వ, 7వ, 8వ

శని దృష్టులు → 3వ, 7వ, 10వ

👉 సంయోగంలో ఉన్నప్పుడు: ➡️ ఈ రెండు గ్రహాల దృష్టులు కలిపి ప్రభావం ఇస్తాయి

📌 సింపుల్ ఫైనల్ లైన్:

👉 “శని–కుజ సంయోగం ఉన్న స్థానం నుండి 3, 4, 7, 8, 10 స్థానాలపై సంయుక్త ప్రభావం ఉంటుంది.”

Read More

రోజు శ్రీరామ నవమి...

 ఈ రోజు శ్రీరామ నవమి...


నారద మహర్షి శాపము విష్ణు మూర్తి కి ఉంది., అది భార్య వియోగం గురుంచి., అది రామ అవతరం లో జరిగింది.

ఈ శాపాన్ని జాతకములో ఎలా చూడాలి :

గురు గ్రహము గురువులని, మహర్షులనీ etc చూపిస్తుంది. రెండు అంతకంటే ఎక్కువ సహజ పాప గ్రహాలు గురుగ్రహాన్ని  చూసినప్పుడు అది గురు శాపము అవుతుంది. అక్కడ ఆత్మకారకుడు లేదా అష్టమాధిపతి involve అయితే అది పూర్వ జన్మ నుంచి వచ్చినట్టు..


శ్రీరాముని జాతకము లో గురు గ్రహాన్ని కుజ, శని  చూస్తున్నారు.. కనుక ఆయన జాతకము లో దీని వలన భార్య వియోగం జరిగినది. ఇక్కడ శని 4వ స్థానము నుంచి చూడటము వలన , ఈ భార్య వియోగము తల్లి(4) /పనిమనిషి ( శని ) వలన మొదలు ఐనది .


ఇటువంటి శాపాలు జన్మ జాతకములో ఉంటే సాధారణ రెమిడీస్ పనిచేయవు .


కనుక శ్రీరాముడు లంకకు వెళ్లేముందు రామేశ్వర  జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టించటము జరిగినది (శివ మహా పురాణము), కొంతమంది దీనిమీద వేరే అభిప్రాయము చెపుతారు . అది వేరే విషయము.


రామేశ్వర జ్యోతిర్లింగం ఎందుకు ? చంద్రుడినుంచి కేంద్రం,  ఆరూఢ లగ్నం నుంచి కోణము అయ్యే స్థానము , (మరి కృష్ణుడికి.. సోమనాధ జ్యోతిర్లింగం ?)


for better way of lord Sri Rama chart astrolgy understaning 


 ( మా గురువుల  ఉపదేశము నుంచి , శ్రీరామ నవమి శుభాకాంక్షలు తో... శ్రీరామజయం...🙏 )

Read More

తమిళ జ్యోతిష్య విషయాన్ని సులభమైన తెలుగులో,

 

🧠 ప్రధాన భావం:

👉 లగ్నాధిపతి (Lagna Lord)

👉 భాగ్యాధిపతి (9వ భావాధిపతి)

👉 గురు (Jupiter)

ఈ మూడు గ్రహాలకు పరస్పర సంబంధం ఉంటే:

🔥 జాతకుడు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాడు

🔥 తండ్రి–కొడుకు సంబంధం చాలా మంచి ఉంటుంది

🔥 ధనం, గౌరవం, పేరు రోజురోజుకీ పెరుగుతాయి

📌 ముఖ్య యోగాలు

1️⃣ లగ్నాధిపతి – భాగ్యాధిపతి సంబంధం

👉 లగ్నాధిపతి 9వ భావంలో ఉన్నా

👉 లేదా భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నా

✔️ జాతకుడు చాలా అదృష్టవంతుడు

✔️ తండ్రి స్థితి జాతకుడు పుట్టిన తర్వాత మెరుగుపడుతుంది

✔️ కుటుంబంలో సంపద పెరుగుతుంది

2️⃣ గురు సంబంధం

👉 గురువు ఈ రెండు గ్రహాలతో కలిసినా లేదా దృష్టి ఇచ్చినా

🌟 ఫలితం:

జాతకుడు చిన్నప్పటి నుంచే రాజులా జీవిస్తాడు

విద్య, గౌరవం, స్థాయి పెరుగుతాయి

3️⃣ సూర్యుడు బలహీనంగా ఉంటే

👉 సూర్యుడు (తండ్రి కారకుడు) బలహీనంగా ఉన్నా:

✔️ జాతకుడు తండ్రిని మించి

👉 ఎక్కువ ధనవంతుడు అవుతాడు

👉 ఇది ఒక ముఖ్యమైన నియమం:

తండ్రి సాధారణ స్థాయి → కొడుకు అత్యున్నత స్థాయి

4️⃣ తండ్రి–కొడుకు సంబంధం

👉 భాగ్యాధిపతి + లగ్నం + గురువు మంచి స్థితిలో ఉంటే:

💖 సంబంధం:

చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది

పరస్పర గౌరవం ఉంటుంది

తండ్రి కొడుకుపై గర్వపడతాడు

5️⃣ మూడు గ్రహాలు బలంగా ఉంటే

👉 లగ్నాధిపతి + భాగ్యాధిపతి + గురు

ఈ మూడు:

✔️ స్వరాశి / ఉచ్చ / మిత్రరాశిలో ఉంటే

✔️ పాపగ్రహ దోషం లేకపోతే

🔥 ఫలితం:

చిన్న వయసులోనే ఎదుగుదల

పేరు, ప్రఖ్యాతి పెరుగుతాయి

సమాజంలో గొప్ప స్థానం

🔱 శాస్త్ర నిర్ణయం

👉 ఈ యోగం ఉంటే:

✅ పుట్టిన రోజు నుంచే అదృష్టం మొదలవుతుంది

✅ స్థిరమైన ఎదుగుదల ఉంటుంది

✅ తండ్రి భాగ్యం + స్వీయ భాగ్యం రెండూ కలుస్తాయి

📖 గ్రంథ సూచన

ఈ భావం తుయ్య కేరళం అనే ప్రాచీన జ్యోతిష్య గ్రంథంలో చెప్పబడింది.

👉 అంటే ఇది:

అనుభవంతో నిరూపితమైన సిద్ధాంతం

అనేక జాతకాలలో సత్యంగా పనిచేసే నియమం

✨ సారాంశం

👉 ఈ మూడు గ్రహాలు మంచి స్థితిలో ఉంటే:

🔥 సాధారణ జీవితం → రాజయోగ స్థాయి

🔥 పుట్టినప్పటి నుంచే అదృష్టం

🔥 తండ్రిని మించే స్థాయికి ఎదుగుతాడు

Read More

గ్రహాలు

 1. శుభ గ్రహాలు: గురు, శుక్రులు శుభులు. శుక్రుడు ప్రాపంచిక సుఖాలనిస్తే, గురువు ఆధ్యాత్మికత మరియు మోక్షాన్ని ఇస్తాడు.

2. పాప గ్రహాలు: శని, కుజులు పాపులు. శని కష్టాలనిచ్చినా చివరకు మనిషిని ఉత్తముడిగా తీర్చిదిద్దుతాడు. కానీ కుజుడు ఇచ్చే కోపం, పగ నెగటివ్ ఫలితాలనిస్తాయి.

3. రాహు/కేతు: రాహువు కంటే కేతువు తక్కువ పాపి మరియు ఎక్కువ శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

4. గ్రహ బలం: జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంటే, ఆ వ్యక్తి స్వభావం ఆ గ్రహం లాగే ఉంటుంది.

5. కలియుగ బలం: కలియుగంలో శని, రాహు, కేతువులు చాలా శక్తివంతులు. రాహు/కేతువులకు మిథున, కన్యలు.. శని/కుజులకు మకర, కుంభాలు అత్యంత శుభప్రదమైన (త్రికోణ) స్థానాలు.

6. దృశ్య/అదృశ్యం: లగ్నం నుండి 6వ ఇల్లు వరకు అదృశ్య భాగం (తక్కువ బలం). 7 నుండి 12 వరకు దృశ్య భాగం (ఎక్కువ బలం). గోచారంలో కూడా 7-12 స్థానాల్లో గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి.

7. స్థాన బలం: మిత్ర క్షేత్రం, స్వక్షేత్రం, ఉచ్ఛ స్థితిలో శుభ ఫలితాలు ఎక్కువ. శత్రు క్షేత్రం మరియు నీచ స్థితిలో అశుభ ఫలితాలు ఎక్కువ.

8. శరీర భాగాలు - పీడ: రవి(ముఖం, తల), చంద్ర(మెడ), కుజ(పొట్ట, వెన్ను), బుధ(చేతులు), గురు(నడుము, మోకాళ్లు), శుక్ర(జననేంద్రియాలు), శని(పాదాలు). రాహువు శని లాగా, కేతువు కుజుని లాగా ప్రవర్తిస్తారు.

9. గోచార క్రమం: బలంలో తగ్గే క్రమం - శని, కుజ, బుధ, గురు, శుక్ర, చంద్ర, రవి.

10. దృష్టి బలం: శుభ గ్రహాల దృష్టి పడితే ఆ గ్రహం బలపడుతుంది.

11. ఉచ్ఛ/నీచ బలం: ఉచ్ఛలో ఉన్నప్పుడు 100%, మూల త్రికోణంలో 75%, స్వక్షేత్రంలో 50%, మిత్ర క్షేత్రంలో 25%, సమ క్షేత్రంలో 12.5%, నీచలో కేవలం 6.25% బలం ఉంటుంది.

12. దిగ్బలం: లగ్నంలో బుధ/శుక్రులు, 4లో చంద్ర/శుక్రులు, 7లో శని, 10లో రవి/కుజులు దిగ్బలం కలిగి ఉంటారు.

13. పక్ష బలం: కృష్ణ పక్షంలో పాప గ్రహాలు, శుక్ల పక్షంలో శుభ గ్రహాలు బలంగా ఉంటాయి.

14. ఆత్మకారక బలం: అత్యధిక డిగ్రీలు ఉన్న గ్రహం ఆత్మకారకుడు. దానికి 1,4,7,10 లో ఉన్న గ్రహాలు చాలా బలంగా ఉంటాయి.

15. అవస్థలు: బల్య (0-6°), కుమార (6-12°), యువ (12-18°), వృద్ధ (18-24°), మృత (24-30°). యువ అవస్థలో ఉన్న గ్రహం పూర్తి ఫలితాన్ని ఇస్తుంది.

16. మౌఢ్యం/వక్రం: సూర్యునికి దగ్గరగా వస్తే మౌఢ్యం (Combust). వక్ర గతిలో పాప గ్రహం మరింత కీడు చేస్తుంది, శుభ గ్రహం మరింత మేలు చేస్తుంది.

17. శుభ తత్వం: గురు, శుక్ర, పూర్ణ చంద్రులు పూర్తి శుభులు. బుధుడు 1/4 వంతు, క్షీణ చంద్రుడు కూడా 1/4 వంతు మాత్రమే శుభుడు.

18. పాప తత్వం: శని, రాహు, కేతువులు పూర్తి పాపులు. కుజుడు 3/4 వంతు, రవి 1/2 వంతు పాపి. రాహువుతో కలిసిన గురువు పూర్తి పాపిగా మారతాడు.

Read More

Sunday, 23 July 2023

वज्रकवचम् (Vajra Kavacham):

 अयं वेढाः परशू सायकवशाध्याः

सर्वाभरणभूषिताः।

निष्काशः श्मशानः कुण्डलिडृदामर

नागाह्व लीलागृहाः।।

सर्वार्थं भाजन्ते शिरः पथि कवटीभिः

कपाटैर्बहुभिः।।


सर्वे युद्धाभिमानिनस्ते बलाध्याः

सरणागताः।

सर्वे शत्रूघ्नाः सर्वार्थशरणास्ते

शर्वाणि देवाश्च ते।

यस्य शक्त्यात्मकाश्चित्रा त्रिदशास्तेन

सुरारिहन्त्रा देवाः।

इत्युक्त्वैवंस्तुवन्तो देवाः ददृशुस्ते

युधि प्रहराणि।


ततस्तु मारुतसेनाभिस्तुष्टुवुश्चाब्रुवन्

प्रहराणि।

श्रुत्वा तुष्टाव मधुसूदन नाग

प्रहराणि चैव ते।

एवमध्ये युधि योध इव स्तुतवन्तः

समागताः।

नैवान्न घोरमुपगच्छत क्षयाय

तत्र देवाञ्जग्मुर्हताः।

न तं देवाश्च मरुतश्च संयोजयंत

उपाददे।

न संयोजयित्वा विष्णोः

कवचाय मधुसूदनः।।


कृष्णो मारुत उवाच:


अयं वज्रकवचस्त्वंस्तु प्रसीद

माधव प्रभो।

वधं प्रति न वा वक्ष्ये त्रातारं त्वां

जनार्दन।

कवचस्यापि यत्प्राप्तै दृढं कार्यं

मया शुभे।

तत्कुरुष्व मतिमांस तु यदहमप्यवाञ्छितः।।


मधुसूदनो वाच:


नरवक्षस्थलालग्नाः समुद्रे घर्मकाननाः।

वज्राधरा मध्यमे वा त्रयः सप्त स्वराः प्रति।

स्वरास त्रयो दश मात्राश्च अक्षराणि च पञ्चदश।

नवत्या द्विशतिमात्रा याः ताः परिदधाति मम्।।

पादयोः सर्वभूतानां शिरः क्ष्माम्बुधारया।

दृढाश्वचीरुणा युक्ता वायुत्रायामवस्थितः।

वायोरन्तर्गतः कृष्णः पृष्ठे सूर्यमण्डले।

कवचं सर्वभूतानां जीवनाय प्रतिष्ठितम्।।


ततः प्रभृति युद्धाय मधुसूदनो

गदाधरः।

रथेन सह सन्धाय भुजङ्गवलयङ्कृतः।।


एवमुपायं भगवान् कवचं भगवत्तमः।

अधिगम्याभिमुख्येन प्राहाद्भुतं नृपाय तत्।

रथाच्च सत्वया युक्तो यथावत् समवस्थितः।

ययौ समागताश्चैव कृष्णस्यैकान्तिकं पदः।।


Telugu:


ఓం


అయం వేఢాః పరశూ సాయకవశాధ్యాః

సర్వాభరణభూషితాః।

నిష్కాశః శ్మశానః కుణ్డలిడృదామర

నాగాహ్వ లీలాగృహాః।।

సర్వార్థం భాజంతే శిరః పథి కవటీభిః

కపాటైర్బహుభిః।।


సర్వే యుద్ధాభిమానినస్తే బలాధ్యాః

సరణాగతాః।

సర్వే శత్రూఘ్నాః సర్వార్థశరణాస్తే

శర్వాణి దేవాశ్చ తే।

యస్య శక్త్యాత్మకాశ్చిత్రా త్రిదశాస్తేన

సురారిహన్త్రా దేవాః।

ఇత్యుక్త్వైవంస్తువంతో దేవాః దదృశుస్తే

యుధి ప్రహరాణి।


తతస్తు మారుతసేనాభిస్తుష్టువుశ్చాబ్రువన్

ప్రహరాణి।

శ్రుత్వా తుష్టావ మధుసూదన నాగ

ప్రహరాణి చైవ తే।।

ఏవమధ్యే యుధి యోధ ఇవ స్తుతవంతః

సమాగతాః।

నైవాన్న ఘోరముపగచ్ఛత క్షయాయ

తత్ర దేవాఞ్జగ్ముర్హతాః।।

న తం దేవాశ్చ మరుతశ్చ సంయోజయంత

ఉపాదదే।

న సంయోజయిత్వా విష్ణోః

కవచాయ మధుసూదనః।।


కృష్ణో మారుత ఉవాచ:


అయం వజ్రకవచస్త్వంస్తు ప్రసీద

మాధవ ప్రభో।

వధం ప్రతి న వా వక్ష్యే త్రాతారం త్వాం

జనార్దన।

కవచస్యాపి యత్ప్రాప్తై దృఢం కార్యం

మయా శుభే।

తత్కురుష్వ మతిమాంస తు యదహమప్యవాఞ్ఛితః।।


మధుసూదనో వాచ:


నరవక్షస్థలాలగ్నాః సముద్రే ఘర్మకాననాః।

వజ్రాధరా మధ్యమే వా త్రయః సప్త స్వరాః ప్రతి।

స్వరాస్ త్రయో దశ మాత్రాశ్చ అక్షరాణి చ పఞ్చదశ।

నవత్యా ద్విశతిమాత్రా యాః తాః పరిదధాతి మమ్।।

పాదయోః సర్వభూతానాం శిరః క్ష్మామ్బుధారయా।

దృఢాశ్వచీరుణా యుక్తా వాయుత్రాయామవస్థితః।

వాయోరన్తర్గతః కృష్ణః పృష్ఠే సూర్యమణ్డలే।

కవచం సర్వభూతానాం జీవనాయ ప్రతిష్ఠితమ్।।


తతః ప్రభృతి యుద్ధాయ మధుసూదనో

గదాధరః।

రథేన సహ సన్ధాయ భుజఙ్గవలయఙ్కృతః।।


ఏవముపాయం భగవాన్ కవచం భగవత్తమః।

అధిగమ్యాభిముఖ్యేన ప్రాహాద్భుతం నృపాయ తత్।

రథాచ్చ సత్వయా యుక్తో యథావత్ సమవస్థితః।

యయౌ సమాగతాశ్చైవ కృష్ణస్యైకాంతికం పదః।।

Read More

Friday, 21 July 2023

sani kavacham .

 సఞ్చరే సుమహాసూరిః రవి పుత్రః యమగ్రజః।

చాయామాచారే సుమహాసూరిః సింహీకాగ్రజః॥

సౌరి గ్రహాధీపతయే సనిప్రపితామహాయై।

నమః కరోమి సద్భావేషు త్రైలోక్యానాం యశస్వినే॥


కోణే దిశం దధానాః స్యాద్రుద్రాధీపతయే నమః।

వాయవ్యాం వాయువే చాన్తరిక్ష గ్రహాధిపాయై॥

దక్షిణే నిశాకరాయ వరుణాధీపతయే నమః।

దక్షిణే చిత్రాసూభాన్తే వార్హదాదిధిపాయ చ॥


కోణే బృహస్పతేస్తు పూర్వఫాల్గుని సన్నుతౌ।

వామే వామాశ్లేష గతిః పశ్చిమార్ద్రే గ్రహపతయే॥

ఉత్తరే వహ్నినా చైవానుదకే నైమిషాయ చ।

ఉత్తరే సోమసంస్థానే విద్యుత్పుఞ్జాయ సన్నుతౌ॥


భృగు గురవే చ సౌమ్యాయ పిప్పలాదిగతాయ చ।

శన్యాం చ మే విధీతాయై పునరాయాన్తు దేహినః॥


నక్షత్రమాలాన్తర్గతాయ పఞ్చమీం ఆశ్రితాయ చ।

జఙ్గమాదిగతాయై చ షష్ఠీ గతికరాయ చ॥


గోప్త్రే సురకటాక్షాయ చక్రద్రుహాయ వై నమః।

త్రయాయుధాయ సర్వజగతాం పతయే నమః॥


యస్య జ్ఞానం దృశి స్థానం యశ్చ యన్త్రోద్యమ చ।

సర్వం తస్య సమాచిన్త్యం నాన్తరా సూరిభిర్గణైః॥


భయప్రదం జగత్సారం బ్రహ్మహత్యాదికారణమ్।

అష్టాదశపురాణాన్తం అజ్ఞానం చ వినాశనమ్॥


యోగాయ యోగసూత్రాయ భక్తానాం ప్రవరాయ చ।

తస్మై తేజోనిధయే చ యోగీశాయ విదేమహే॥


ఇదం కవచం పఠేన్నిత్యం శనేరం భక్తిసంయుతః।

రహతే చ సదా పుత్రం సన్తతోఽప్యవధీర్యతే॥


భుక్తిముక్తి ఫలం వాపి యస్య పుత్రప్రదాయకమ్।

కవచం నో దదీయాత్కిఞ్చిదన్యస్తు సనేరపి॥




Note: The above text is a transliteration of the Sani Kavacham in Telugu script. If you plan to use this prayer, it is recommended to seek the guidance of a knowledgeable priest or spiritual guide for proper pronunciation and understanding of the verses.

Read More

Saturday, 8 July 2023

తలలో రెండు సుడులు ఎందుకు ఉంటాయి? దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందా?

 తలలో రెండు సుడులు ఎందుకు ఉంటాయి? దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందా?

రెండు సుడులు ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని కొందరు అంటారు. నిజమేనా? లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. 

 చాలా మందికి తలలో రెండు సుడులు ఉంటాయి.. తలలో రెండు మూడు సుడులు ఉండడంపై చర్చనీయాంశమైంది. దీంతో పెద్దలు సైతం ఆందోళన చెందుతున్నారు, తమ పిల్లలకు, మనవళ్లకు కొంత ఇబ్బందేమో అనుకుంటారు.


చాలా మందికి తలలో రెండు సుడులు ఉంటాయి.. తలలో రెండు మూడు సుడులు ఉండడంపై  చర్చనీయాంశమైంది. దీంతో పెద్దలు సైతం ఆందోళన చెందుతున్నారు, తమ పిల్లలకు, మనవళ్లకు కొంత ఇబ్బందేమో అనుకుంటారు.


 మరికొందరు రెండు సుడులు ఉన్నవారు రెండుసార్లు పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. ఇలా ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారా? లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. 


 చాలా మందికి నెత్తిమీద సుడులు ఉంటాయి. మరికొందరికి రెండు ఉంటాయి. ప్రపంచ జనాభాలో 5% మందికి రెండు సుడులు ఉన్నట్లు  NHGRI అధ్యయనం వెల్లడించింది. 

చాలా మందికి నెత్తిమీద సుడులు ఉంటాయి. మరికొందరికి రెండు ఉంటాయి. ప్రపంచ జనాభాలో 5% మందికి రెండు సుడులు ఉన్నట్లు  NHGRI అధ్యయనం వెల్లడించింది.


 నిజానికి, శాస్త్రీయంగా చెప్పాలంటే, డబుల్-ట్విస్టెడ్ హెయిర్ ఏర్పడటంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పురుషులు మరియు మహిళలు వారి కుటుంబ సభ్యుల నుండి వారసత్వంగా పొందుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు.


నిజానికి, శాస్త్రీయంగా చెప్పాలంటే, డబుల్-ట్విస్టెడ్ హెయిర్ ఏర్పడటంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పురుషులు మరియు మహిళలు వారి కుటుంబ సభ్యుల నుండి వారసత్వంగా పొందుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు.



 రెండు సుడులు ఉన్నవారు చాలా అరుదు. అయితే ఇందులో అసహజంగా ఏమీ లేదు. ఇది శరీరం  లక్షణం. తలలో రెండు సుడులున్న కొందరు రెండు సార్లు పెళ్లి చేసుకుంటారు. లేకుంటే పెళ్లి ముహూర్తం కుదిరిన సమయంలో కూడా పెళ్లి బంధం తెగిపోయి రెండో పెళ్లి కూడా ఖాయం అని నమ్ముతారు. కానీ దీని గురించి కచ్చితమైన సమాచారం లేదు.


రెండు సుడులు ఉన్నవారు చాలా అరుదు. అయితే ఇందులో అసహజంగా ఏమీ లేదు. ఇది శరీరం  లక్షణం. తలలో రెండు సుడులున్న కొందరు రెండు సార్లు పెళ్లి చేసుకుంటారు. లేకుంటే పెళ్లి ముహూర్తం కుదిరిన సమయంలో కూడా పెళ్లి బంధం తెగిపోయి రెండో పెళ్లి కూడా ఖాయం అని నమ్ముతారు. కానీ దీని గురించి కచ్చితమైన సమాచారం లేదు.'.‘


కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సుడులు ఉన్నవారు మంచివారు. సూటిగా మాట్లాడుతారని, ఓపికగా ఉంటారని, అందరితో కలిసి మెలిసి ఉంటారని, కష్టాలకు స్పందించేవారని చెబుతారు.



 ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వందసార్లు ఆలోచిస్తాడు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ తలలో రెండు సుడులు పడితే రెండు పెళ్లిళ్లు అవుతాయన్న మాట మాత్రం నిజంకాదు.


ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వందసార్లు ఆలోచిస్తాడు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ తలలో రెండు సుడులు పడితే రెండు పెళ్లిళ్లు అవుతాయన్న మాట మాత్రం నిజంకాదు

Read More

అంగారక చతుర్ధి

అంగారక చతుర్ధి


కాశీ‌ ఖండమందు ఈ రోజు చాలా గొప్పగా చెప్పబడినది. దశహరావ్రతము (అనగా  జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి జ్యేష్ఠ శుద్ధ దశమి వరకు ఆచరించేది).


దశాశ్వమేధ కుండమందు ఎవరయితే ఈ పది రోజులు స్నానం చేస్తారో వారు కొన్ని వేల అశ్వమేధయాగ సమయములో ఆచరించే అవబృద స్నానములను చేసే ఫలం తో పాటు ఏ తిధి లో స్నానం చేస్తే అన్ని జన్మ ల పాపములు తొలగించేస్తారు.( ఉదాహరణకు పంచమి రోజు ఐదు జన్మల పాపం, దశమి రోజు పది జన్మల పాపం) 


అలాగే ఈ మంగళవారం ఎవరయితే గణపతి ఆరాధన చేస్తారో వారికి సమస్త కార్య సిద్ధి కలుగుతుంది.

ఈ రోజున చేసే లక్ష్మీ గణపతి హోమం కార్యసిధ్ది ను కలుగజేస్తుంది. అలాగే ఒక చెరకు గడను ఉదయం సూర్యోదయం లగాయితు గంటలోపు(ముఖ్యంగా) లేదా ఆ రోజులో ఎపుడైనా సమర్పణం చేస్తే కోరిన కోరిక తీరును.

Read More

గాయత్రీమాతజయంతి..🙏

 గాయత్రీమాతజయంతి..🙏


హిందూ పురాణాల ప్రకారం.. 'గాయత్రి మాత' జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున జన్మించింది. గాయత్రీ జయంతిని ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశిని 'నిర్జల ఏకాదశి' అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశులలో ఉత్తమమైనది. గాయంత్రీ జయంతి రోజున.. గాయత్రి మాతను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. 


#గాయత్రీ జయంతి పూజ విధానం:

గాయత్రీ జయంతి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఇంట్లో దీపం వెలిగించి.. గంగాజలంతో అన్ని దేవతలకు అభిషేకం చేయాలి. ఆపై గాయత్రి మాతని ధ్యానిస్తూ..  గాయత్రీ మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పూలు సమర్పిస్తూ గాయత్రీ తల్లిని ఆరాధించాలి. అమ్మకు సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలి.


#గాయత్రీ మంత్రం:

ఓం భూర్భువ: స్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధ్యో యో న: ప్రచోదయాత్


గొప్ప మంత్రం #గాయత్రీ మంత్రం:

హిందూ మతం ప్రకారం.. అన్ని మంత్రాలలో గొప్ప మంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రాన్ని పఠించే వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉంటాడు. 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రంలోని ప్రతి పదానికి ప్రత్యేక అర్థం ఉంది

Read More

శనిత్రయోదశి,కర్కాటక సంక్రమణం మరియు మాస శివరాత్రి,

శనిత్రయోదశి,కర్కాటక సంక్రమణం మరియు మాస శివరాత్రి, *దక్షిణాయన ప్రారంభము *ఆషాఢ అమావాస్య (సోమవారం + అమావాస్య)వంటి అతి గొప్ప రోజులలో నవ ఛండీ హోమ‌సహిత మహారుద్ర యాగము మూడు రోజుల పాటు (త్రయాహ్నిక దీక్ష) జరుగనున్నది.



మహారుద్ర, అతి రుద్ర యాగములు అతి ప్రాచీనమైన వైదిక క్రతువులు.


శీఘ్రంగా పరమేశ్వర కటాక్షమునకు ఇవి దోహదపడతాయి.ఇటువంటి యాగములు జరిగినపుడు చూసిననూ చాలా పుణ్యము.

Read More

పితృయజ్ఞరహస్యాలు

 పితృయజ్ఞరహస్యాలు 


మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు

పెడుతుంటారు. 


 మాసికాలు ఎందుకు పెట్టాలి? 


అన్నిమాసికాలుపెట్టాలా?

కొన్నిమానేయవచ్చా?


వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 


అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.


కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. 


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.


దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.


మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. 


ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది.


ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.


ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.


నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. 


కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.


యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.


ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.


దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.


అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.


సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.


దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.


వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.


దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.


మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు). 


నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.


ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 


ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.


ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది. 


ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.


తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 


పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.


ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. 


ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

 

నిజానికి మొత్తం 16 పిండాలు  సంవత్సర కాలంలో ఇస్తారు.


వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.


అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.


ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.


కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.


ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. 


మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.


మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. 


తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.


కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.


ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   


ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.


ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.


ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.


పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 


నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. 


అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 


గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.


 వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  


వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 

  తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. మాసికాలు అన్ని బ్రాహ్మణ కులానికి సంబంధించినవి! మరి  మిగతా కులాల సంగతి ఏమిటి అని చాలామందికి సందేహం వస్తుంది మిగతా కులాల వారు ఆమ శ్రాధ్ధం అంటే స్వయంపాక దానం చేయాలి. అది ఉదయం 12లోపు చేయాలి .బ్రాహ్మణ కులం వారు 12 తర్వాత. అపరాహ్ణ కాలంలోనే భోక్తలకు భోజనం పెట్టాలి.మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు పెడుతుంటారు 

 మాసికాలుఎందుకుపెట్టాలి?*

అన్నిమాసికాలుపెట్టాలా?

కొన్నిమానేయవచ్చా?


వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 


అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.


కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. 


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.


దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.


మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. 


ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది.


ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.


ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.


నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. 


కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.


యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.


ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.


దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.


అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.


సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.


దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.


వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.


దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.


మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు). 


నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.


ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 


ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.


ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది. 


ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.


తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 


పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.


ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. 


ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

 

నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.


వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.


అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.


ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.


కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.


ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. 


మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.


మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. 


తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.


కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.


ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   


ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.


ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.


ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.


పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 


నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. 


అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 


గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.


వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  

వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 


తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు. ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. మాసికాలు అన్ని బ్రాహ్మణ కులానికి సంబంధించినవి! మరి  మిగతా కులాల సంగతి ఏమిటి అని చాలామందికి సందేహం వస్తుంది మిగతా కులాల వారు ఆమ శ్రాధ్ధం అంటే స్వయంపాక దానం చేయాలి. అది ఉదయం 12లోపు చేయాలి .బ్రాహ్మణ కులం వారు 12 తర్వాత. అపరాహ్ణ కాలంలోనే భోక్తలకు భోజనం పెట్టాలి.


శివార్పణం


 ఓం నమః శివాయ. శివాయ గురవే నమః

Read More

దశావతారాల నుండి మనం నేర్చుకోవలసిన అంతరార్ధము:-

 దశావతారాల నుండి మనం నేర్చుకోవలసిన అంతరార్ధము:-

🕉🌞🌏🌙🌟🚩


1. మత్స్యావతారం - చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ  ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి.


*2. కూర్మావతారం - తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, 

అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి 'ధ్యానం' చేయాలి.*


*3. వరాహావతారం - వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో,  

అలాగే 'ఇంటి బాధ్యత'లను మొయ్యాలి.*


4. నరసింహావతారం - మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెందడాలి.


*5. వామనావతారం - మొదటి అడుగు భౌతికంగానూ, రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ;  

మరి మూడవ అడుగును మనలోని 'అహంకారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి.*


 6. పరశురామావతారం - 'లక్ష్యం' కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.


7. రామావతారం - 'ధర్మ'యుతంగా జీవించాలి.


8. కృష్ణావతారం - ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఆనందం'గా ఉండాలి.


9. బుద్ధావతారం - 'జ్ఞానాన్ని' పంచాలి.


10. కల్కి అవతారం - సకల మానవాళి 'అజ్ఞానాన్ని తీసివేయాలి'..

Read More

🎻🌹🙏గోవర్ధనగిరికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏమిటి...??

🎻🌹🙏గోవర్ధనగిరికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏమిటి...??


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿 సముద్రానికి వారధి ఏర్పడిన తర్వాత ఉత్తర సరిహద్దుల నుండి ఒక పర్వతమును తీసుకుని హనుమంతుడు వస్తుంటాడు. ఇంద్రప్రస్థం నుండి కొద్ది దూరము వచ్చేసరికి సేతు నిర్మాణము పూర్తయిపోయిందని తెలుస్తుంది.


🌸అప్పుడు హనుమంతుడు " ఇక పర్వతము తీసుకొని వెళ్ళుటవలన ప్రయోజనమేమి " అని అనుకుంటూ హనుమంతుడు ఆ పర్వతమును అక్కడే విడచిపెతాడు. కానీ, అది సాధారణ పర్వతము కాదు.


🌿దాని ఆత్మ ప్రకటితమై “భక్త రాజా! నేను చేసిన అపరాధమేమి, మీ కరకమలముల స్పర్శను పొంది కూడా నేను భగవత్సేవా వంచితుడ నగుచున్నానే, నన్నిక్కడ విడువ వద్దు. భగవత్సమీపమునకు తీసుకుని వెళ్లి వారి శ్రీ చరణారవిందముల చెంత నుంచుము. 


🌸లేదా నన్ను సముద్రగర్భములో పారవేయుము.

భగవత్సేవకుపయోగింపని 

జీవితమువలన ప్రయోజనమేమి” అని హనుమంతుడిని వేడుకుంటుంది.


🌿ఆ పర్వతం వేడుకలోని నిజం గ్రహించిన హనుమంతుడు “గిరిరాజా! నీవు వాస్తవమునకు గిరిరాజువే. నీ అంచంచల నిష్టను చూచుచుండ నిన్ను భగవత్సమీపమునకు తీసుకొని వెళ్ళవలె ననియె యున్నది. కానీ ఇక 

ఏ పర్వతమునూ తీసుకొని రావద్దని రామచంద్ర ప్రభువు ఆవాదేశించారు.


🌸 అయిననూ నీ కొరకు భగవానుని ప్రార్థించెదను. వారి యాదేశానుసారము చేసెదను” అని చెప్పాడు.


🌿అందుకు ఆ పర్వతం సంతోషిస్తుంది.

ఆలస్యం చేయకుండా అక్కడి నుండి హనుమంతుడు రాముడు దగ్గరికి వెళ్లి, పర్వతం వేడుక గురించి వివరిస్తాడు.


🌸అది విన్న రాముడు " హనుమంతా! ఆ పర్వతము నాకు అత్యంత ప్రేమపాత్రమైనది.నీవు దానిని ఉద్ధరించినావు. ద్వాపర యుగములో నేను కృష్ణరూపములో దానిని ఉపయోగించు కొనెదనని చెప్పుము.


🌿 ఏడురోజులపాటు దానిని నా వేలిమీద ఉంచుకొని ప్రజలను రక్షించెదను అని చెప్పు " అని హనుమంతుడికి చెప్తాడు.


🌸ఆ మాట విన్న హనుమంతుడు సంతోషంగా పర్వతం దగ్గరికి చేరుకొని, రాముడు చెప్పింది చెప్పినట్టుగా వినిపిస్తాడు. 


🌿అలా హనుమంతుడు వలన గోవర్ధనము భగవానునికి పరమ కృపాపాత్రమై, నిత్యలీలా పరికరమాయెను అని మనకు పురాణం తెలియజేస్తుంది...స్వస్తీ..🚩🌞🙏🌹🎻 


Read More

🚩శనీశ్వరుడి జయంతి , శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం మీ వెంటే..!🚩

 🚩శనీశ్వరుడి  జయంతి , శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం మీ వెంటే..!🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శనీశ్వరుడి  జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు.  ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.

 

శనీశ్వరుడి జయంతి


దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు.  హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం.


ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.


చేయవలసిన పూజలు


శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి.

అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి.

దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి.

తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి.

ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.


అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి.

శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు.


నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.


శని దేవుడి ప్రాముఖ్యత


సూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు.  వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.


🌹శని శాంతి మంత్ర స్తుతి🌹


ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

 

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార

వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ

కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ

శుద్ధబుద్ధి ప్రదాయనే

య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్

మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

 

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి , తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

 

శన్యారిష్టే తు సంప్రాప్తే

శనిపూజాంచ కారయేత్

శనిధ్యానం ప్రవక్ష్యామి

ప్రాణి పీడోపశాంతయే

 

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.

ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.


Read More

Powered By Blogger | Template Created By Lord HTML