👆🌹👆*జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు జన్మించిన చోట స్థాపించిన విజయ స్థంభం...!!*
సాంప్రదాయాలు, దైవాలు మరియు ఆచార వ్యవహారాల పేర్లతో వివిధ తెగలుగా విడిపోయి కొట్లాడుకుంటున్న భారతీయులకు - 'అన్ని మతాలు ఒక్క వేదమతంలో నుంచి ఉద్భవించాయని, అందులో భూతద్దం పెట్టి జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమీ లేదని' చెప్పే శక్తి (వ్యక్తి) కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురువులకు పుట్టింది.
ఆ వ్యక్తే ఆది శంకరాచార్యులుగా ఖ్యాతిగడించిన సద్గురువు. సాక్షాత్తు శివ స్వరూపంగా భావించే శంకరుడు దేశమంతా దేవుని పేరుతో కొట్లాడుకుంటున్న వేళ అద్వైత మత ప్రచారమనే ఆయుధాన్ని చేపట్టి భారత దేశం అంతా అవిశ్రాంతంగా కాలినడకన పర్యటించి
జనుల్లో దైవం పట్ల ప్రీతిని కలిగించాడు. కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి 75 కి.మీ. దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉన్నది.
ఇక్కడే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు జన్మించినది.
ఈ గ్రామం పెరియార్ నదికి సమీపంలో ఉన్నది. ఇక్కడి నుండే శంకరాచార్యులు కాలినడకన దేశమంతటా తిరిగి నాలుగు పీఠాలను స్థాపించారు.
🌸కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి 75 కి.మీ. దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉన్నది.
🌿కాలడి గ్రామం దేశవ్యాప్తంగా ఆది శంకరాచార్య మతాన్ని ఆచరించేవారందరికీ మరియు పీఠాధిపతులకు ఒక పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచినది.
🌸 కాలడి అంటే మలయాళంలో అర్థం పాద ముద్ర అని. ఈ గ్రామంలో దేవాలయాలు, ఆశ్రమాలు ఉన్నప్పటికీ ఆది శంకరాచార్యుల జనన స్థలం ప్రముఖంగా చెప్పుకోవాలి.
🌿 ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ప్రపంచమంతా చాటిచెప్పిన ఆ మహనీయుని జన్మ స్థలం చూడాలనుకొనే తపన గల వారికోసం ఈ పిక్ పెట్టడం జరిగింది...
*జయ జయ శంకర హర హర శంకర*

No comments:
Post a Comment