What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 19 April 2026

🔅 కుంతీ మాధవ స్వామి దేవాలయం : పిఠాపురం

 🕉 


🔅 తూ.గో జిల్లా :  పిఠాపురం


🔅 కుంతీ మాధవ స్వామి దేవాలయం :  పిఠాపురం

👉 శ్రీ కుంతీ మాధవ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఇది పురాతన వైష్ణవ దేవాలయాలలో ఒకటి మరియు పంచ మాధవ దివ్య క్షేత్రం. ఇది పిఠాపురంలోని ప్రసిద్ధ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. 


👉ఇంద్రుడు వృత్తాసురుని చంపాక ఆ బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తి పొందడం కోసం దేశంలోని ఐదు ప్రాంతాల్లో వైష్ణవాలయాలను నిర్మించి ఆరాదించాడని పురాణాలు చెబుతున్నాయి. 


👉వాటిని పంచ మాధవ క్షేత్రాలుంటారు. 

వాటిలో మొదటిది కాశీలోని భిందుమాధవ స్వామి ఆలయం, 

రెండోది ప్రయాగలోని వేణుమాధవ స్వామి గుడి. 

మూడోది పిఠాపురంలోని కుంతీ మాధవ క్షేత్రం. నాలుగోది రామేశ్వరంలో సేతుమాధవుని ఆలయం, 

ఐదవది అనంతపద్మనాభంలో సుందరమాధవ క్షేత్రం. 


👉కుంతీమాధవస్వామిని పిఠాపురం క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తారు. భిందుమాధవుని దర్శించనిదే కాశీయాత్ర సఫలం కానట్టు కుంతీమాదవుని దర్శనం చేసుకోనిదే పిఠాపుర క్షేత్ర సందర్శన ఫలించదని పండితులు చెబుతారు. 


👉ఇక గర్బాలయంలో చతుర్భుజాలతో కుంతీమాధవస్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి వారి కంఠహారం 24 సాలగ్రామములతో ఉంటుంది. 

ఈ స్వామివారు శంఖు, చక్ర, గద, కిరీటం తిరునామాలను ధరించి ఉంటాడు. 

ఇంకా ముఖమండపంలో శ్రీదేవి – భూదేవి సమేతంగా కుంతి మాధవుడు, మహాలక్ష్మి, గోదాదేవి మొదలగు ఉత్సవ మూర్తులు ఉన్నాయి.


👉ఈ పిఠాపురం క్షేత్రం స్కంద పురాణంలోని భీమ ఖండంలో బాగా ప్రస్తావించబడింది. 

ఈ ప్రదేశంలో శ్రీ కుకుటీశ్వర్ స్వామి మరియు శ్రీ కుంతీ మాధవ స్వామికి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ కారణంగానే పిఠాపురం క్షేత్రం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 

అతని చేతులలో పద్మం, చక్రము, శంఖము మరియు కుంతము  అనే గద ,  మోహనాకర రూపంలో కనిపిస్తూ, శ్రీ కుంతీ మాధవ స్వామిగా ఆరాధించబడ్డాడు.


🔅 " కుంతము అనే అని గద ధరిస్తాడు కనుక కుంతి మాధవ స్వామి అని స్వామివారికి పేరు. 

కుంతిదేవి పూజించినందుకు స్వామివారికి ఆ పేరు రాలేదు...అందరూ గమనించగలరు " 


👉చరిత్రలోని శాసనాల ప్రకారం, చంద్ర గుప్త మౌర్య రాజవంశం ఈ ప్రాంతాన్ని పాలించింది. తరువాత పల్లవులు క్రీ.శ. 3వ శతాబ్దంలో బాధ్యతలు స్వీకరించారు, మళ్లీ 6వ శతాబ్దంలో చాళుక్యులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


👉ఈ ఆలయం కూడా ముస్లిం పాలకుల దాడికి గురైంది, వారు ఈ ఆలయ నిధిపై దాడి చేసి దోచుకున్నారు. ఈ ఆలయం 17వ శతాబ్దంలో పద్మనాయక పాలకులచే పునర్నిర్మించబడింది.


👉ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసం నందు 7 రోజులపాటు స్వామివారికి కల్యాణోత్సవాలు జరుగుతుంటాయి. 

ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML