కర్ణుని రథంపైనున్న ధ్వజం గుర్తు ఏమిటి? ’ఉత్తర గోగ్రహణం’లోని పద్యంలో - "లలితకంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు" అని ఉంది. కర్ణ పర్వంలో "కపికేతనము, హస్తి కక్ష్యము’ అని ఉంది. ఈ రెండూ సమన్వయం చేసుకోలేకపోతున్నాం. సరియైన భావాన్ని తెలియ జేయగలరు.
జ: ఉత్తర గోగ్రహణ సందర్భంలో "కాంచనమయ వేదికా..." అనే సీసపద్యంలో ద్రోణ, అశ్వత్థామ, కృప, కర్ణ, దుర్యోధన, భీష్ముల రథ ధ్వజాల గురించి చెబుతూ - "లలితకంబుప్రభాకలిత" అనేపాదం కర్ణ రథధ్వజం గురించి చెప్పారు (తిక్కనగారి ’ఆంధ్రమహాభారతం’)
’కంబు’ అంటే శంఖం. వర్ణిస్తున్న అర్జునునికి దూరానికి ఆ పతకపు రంగు (వెలుగు) గోచరించింది. అది లలితమైన శంఖమువంటి వెల్గుతోనున్నదని వర్ణించాడు. కానీ ఆ రంగుగల కేతనం (జెండా)పై చిహ్నం ఐరావతం. అదీ తెల్లని ఏనుగే. ఆ తెల్లదనాన్నే శంఖంతో పోల్చి చెప్పారు.
ఈ విషయం కర్ణ పర్వంలో స్పష్టం చేశారు. "కపికేతనము హస్తిక్ష్యయు నమ్మహాబలు లిద్దరును" అనే సీసపద్యంలో - "కపి (హనుమంతుడు) అర్జునుని రథ ధ్వజ చిహ్నం. హతి- కర్ణుని రథ ధ్వజంపై గుర్తు." - అని స్పష్టమై ఉంది

జ: ఉత్తర గోగ్రహణ సందర్భంలో "కాంచనమయ వేదికా..." అనే సీసపద్యంలో ద్రోణ, అశ్వత్థామ, కృప, కర్ణ, దుర్యోధన, భీష్ముల రథ ధ్వజాల గురించి చెబుతూ - "లలితకంబుప్రభాకలిత" అనేపాదం కర్ణ రథధ్వజం గురించి చెప్పారు (తిక్కనగారి ’ఆంధ్రమహాభారతం’)
’కంబు’ అంటే శంఖం. వర్ణిస్తున్న అర్జునునికి దూరానికి ఆ పతకపు రంగు (వెలుగు) గోచరించింది. అది లలితమైన శంఖమువంటి వెల్గుతోనున్నదని వర్ణించాడు. కానీ ఆ రంగుగల కేతనం (జెండా)పై చిహ్నం ఐరావతం. అదీ తెల్లని ఏనుగే. ఆ తెల్లదనాన్నే శంఖంతో పోల్చి చెప్పారు.
ఈ విషయం కర్ణ పర్వంలో స్పష్టం చేశారు. "కపికేతనము హస్తిక్ష్యయు నమ్మహాబలు లిద్దరును" అనే సీసపద్యంలో - "కపి (హనుమంతుడు) అర్జునుని రథ ధ్వజ చిహ్నం. హతి- కర్ణుని రథ ధ్వజంపై గుర్తు." - అని స్పష్టమై ఉంది

No comments:
Post a Comment