What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 31 July 2014

కర్ణుని రథంపైనున్న ధ్వజం గుర్తు ఏమిటి?

కర్ణుని రథంపైనున్న ధ్వజం గుర్తు ఏమిటి? ’ఉత్తర గోగ్రహణం’లోని పద్యంలో - "లలితకంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు" అని ఉంది. కర్ణ పర్వంలో "కపికేతనము, హస్తి కక్ష్యము’ అని ఉంది. ఈ రెండూ సమన్వయం చేసుకోలేకపోతున్నాం. సరియైన భావాన్ని తెలియ జేయగలరు.
జ: ఉత్తర గోగ్రహణ సందర్భంలో "కాంచనమయ వేదికా..." అనే సీసపద్యంలో ద్రోణ, అశ్వత్థామ, కృప, కర్ణ, దుర్యోధన, భీష్ముల రథ ధ్వజాల గురించి చెబుతూ - "లలితకంబుప్రభాకలిత" అనేపాదం కర్ణ రథధ్వజం గురించి చెప్పారు (తిక్కనగారి ’ఆంధ్రమహాభారతం’)
’కంబు’ అంటే శంఖం. వర్ణిస్తున్న అర్జునునికి దూరానికి ఆ పతకపు రంగు (వెలుగు) గోచరించింది. అది లలితమైన శంఖమువంటి వెల్గుతోనున్నదని వర్ణించాడు. కానీ ఆ రంగుగల కేతనం (జెండా)పై చిహ్నం ఐరావతం. అదీ తెల్లని ఏనుగే. ఆ తెల్లదనాన్నే శంఖంతో పోల్చి చెప్పారు.
ఈ విషయం కర్ణ పర్వంలో స్పష్టం చేశారు. "కపికేతనము హస్తిక్ష్యయు నమ్మహాబలు లిద్దరును" అనే సీసపద్యంలో - "కపి (హనుమంతుడు) అర్జునుని రథ ధ్వజ చిహ్నం. హతి- కర్ణుని రథ ధ్వజంపై గుర్తు." - అని స్పష్టమై ఉంది




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML