సృష్టి అంతా విరాట్ స్వరూపుడైన ఆదినారాయణుడి నుంచి అవతరించినదే. ఆ ఆదినారాయణుడి రూపమే అనేక భగవదావతారాలుగా కూడా ఆవిర్భవించింది. అవతారాలన్నీ అవి నిర్వర్తించాల్సిన పని అయిపోయాక తిరిగి ఆ స్వరూపంలోనే కలిసిపోతుంటాయి. విరాట్ స్వరూపం సూక్ష్మాంశలోనే దేవతలు, పశువులు, పక్షులు, మనుషులు లాంటి సకల సృష్టి పుడుతూ ఉంటుంది.
ఆ ఆదినారాయణ స్వరూపం ప్రధానంగా ఓ ఇరవై రెండు అవతారాలుగా అవతరించిన విషయాన్ని మహాభాగవతం ప్రధమ స్కందం ఇలా వివరిస్తోంది.
విరాట్పురుషుడు తన మొదటి అవతారంలో శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలతో అఖండమైన బ్రహ్మచర్యాన్ని పాటించేందుకు బ్రాహ్మణుడై అవతరించాడు.
రెండో అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆయన లోకకల్యాణం కోసం వరాహ రూపాన్ని ఎత్తి భూమండలాన్ని నీటిలో మునిగిపోకుండా ఉద్ధరించాడు.
మూడో అవతారంలో దేవర్షి నారదుడిగా అయ్యాడు. కర్మ బంధాల నుంచి విముక్తి కలిగించే వైష్ణవ తంత్రాన్ని ఆనాడు ఉపదేశించాడు.
నాలుగో అవతారంలో ధర్ముడికి మూర్తి గర్భాన నరనారాయణులుగా పుట్టారు.
ఐదో అవతారంలో సిద్ధేశ్వరుడైన కపిలుడిగా జన్మించాడు. సాంఖ్యయోగాన్ని ఆనాడు ఉపదేశించాడు.
ఆరో అవతారంలో అత్రి, అనసూయలకు దత్తాత్రేయుడిగా జన్మించాడు. ఈ అవతారంలోనే అలర్కుడికి ఆధ్యాత్మ విద్య నేర్పాడు.
ఏడో అవతారంలో రుచి, అకూతి దంపతులకు యజ్ఞరూపంలో జన్మించాడు.
ఎనిమిదో అవతారంలో నాభి రాజు కుమారుడిగా వృషభుడు అనే పేరున జన్మించాడు. ఆశ్రమ ధర్మాలను, జ్ఞానాన్ని బోధించాడు.
తొమ్మిదో అవతారంలో పృధువు అనే రాజుగా జన్మించి భూమిని గోవుగా చేసి ఓషధులను పితికాడు.
పదో అవతారంలో మత్స్యావతారాన్ని ధరించి వైవస్వత మనువును రక్షించాడు.
పదకొండో అవతారంలో ధన్వంతరిగానూ,
పన్నెండు, పదమూడు అవతారాలలో రాక్షసులను మోహంలో పెట్టేందుకు, దేవతలకు అమృతం పంచేందుకు మోహినిగానూ అవతరించాడు.
పద్నాలుగో అవతారంలో నరసింహుడై అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించాడు.
పదిహేనులో వామనమూర్తి అయి బలిచక్రవర్తిని అణిచాడు.
పదహారులో పరశురాముడిగా అవతరించాడు.
పద్దెనిమిదో అవతారంలో శ్రీరాముడిగా జన్మించి రావణ సంహారం లాంటి అనేక అద్భుత కార్యాలను సాధించాడు.
పందొమ్మిది, ఇరవై అవతారాలలో కృష్ణ బలరాములుగా జన్మించి భూభారాన్ని తగ్గించాడు. ఇరవై ఒకటో అవతారంగా బుద్ధుడై పుట్టాడు.
ఆయన ఇరవై రెండో అవతారమే కల్క్యావతారం.
ఈ ఇరవై రెండింటికీ హంస, హయగ్రీవ అనే మరో రెండు చేర్చి ఆ భగవంతుడి అవతారాలు ఇరవై నాలుగు అని కొందరు అంటుంటారు.
భగవంతుడి అవతారాలు అనంతమని, ధర్మ రక్షణకోసం ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా ఆ స్వామి అవతరిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఆదినారాయణుడి విరాట్ స్వరూపం నుంచి లెక్కలేనన్ని అవతారాలు ఉద్భవిస్తుంటాయి. రుషులు, ప్రజాపతులు, మనుషులు… ఇలా అన్నీ ఆ భగవంతుడి అవతారాలే. ఆ ఆదినారాయణుడినే శ్రీకృష్ణుడని అంటారు. అందుకే ఆ కృష్ణుడిని పరబ్రహ్మ స్వరూపుడని, సకలసృష్టి కర్త అని పండితులు, వేదవిదులు నిత్యం కీర్తిస్తుంటారు. భగవంతుడికి రూపం లేదు. భూమి మీద ధూళి, వాయువుకు రూపం ఉన్నట్లు కనిపించిన తీరులో భ్రమతో భగవంతుడికి దృశ్యత్వాన్ని కల్పిస్తుంటారు. వాస్తవానికి భగవంతుడికి జన్మ, కర్మలు ఉండవు. అయినా ఆ జన్మ కర్మలుంటాయని వర్ణిస్తుంటారు. ఇదంతా వేద రహస్యమని పండితులు విశ్లేషిస్తున్నారు
ఆ ఆదినారాయణ స్వరూపం ప్రధానంగా ఓ ఇరవై రెండు అవతారాలుగా అవతరించిన విషయాన్ని మహాభాగవతం ప్రధమ స్కందం ఇలా వివరిస్తోంది.
విరాట్పురుషుడు తన మొదటి అవతారంలో శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలతో అఖండమైన బ్రహ్మచర్యాన్ని పాటించేందుకు బ్రాహ్మణుడై అవతరించాడు.
రెండో అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆయన లోకకల్యాణం కోసం వరాహ రూపాన్ని ఎత్తి భూమండలాన్ని నీటిలో మునిగిపోకుండా ఉద్ధరించాడు.
మూడో అవతారంలో దేవర్షి నారదుడిగా అయ్యాడు. కర్మ బంధాల నుంచి విముక్తి కలిగించే వైష్ణవ తంత్రాన్ని ఆనాడు ఉపదేశించాడు.
నాలుగో అవతారంలో ధర్ముడికి మూర్తి గర్భాన నరనారాయణులుగా పుట్టారు.
ఐదో అవతారంలో సిద్ధేశ్వరుడైన కపిలుడిగా జన్మించాడు. సాంఖ్యయోగాన్ని ఆనాడు ఉపదేశించాడు.
ఆరో అవతారంలో అత్రి, అనసూయలకు దత్తాత్రేయుడిగా జన్మించాడు. ఈ అవతారంలోనే అలర్కుడికి ఆధ్యాత్మ విద్య నేర్పాడు.
ఏడో అవతారంలో రుచి, అకూతి దంపతులకు యజ్ఞరూపంలో జన్మించాడు.
ఎనిమిదో అవతారంలో నాభి రాజు కుమారుడిగా వృషభుడు అనే పేరున జన్మించాడు. ఆశ్రమ ధర్మాలను, జ్ఞానాన్ని బోధించాడు.
తొమ్మిదో అవతారంలో పృధువు అనే రాజుగా జన్మించి భూమిని గోవుగా చేసి ఓషధులను పితికాడు.
పదో అవతారంలో మత్స్యావతారాన్ని ధరించి వైవస్వత మనువును రక్షించాడు.
పదకొండో అవతారంలో ధన్వంతరిగానూ,
పన్నెండు, పదమూడు అవతారాలలో రాక్షసులను మోహంలో పెట్టేందుకు, దేవతలకు అమృతం పంచేందుకు మోహినిగానూ అవతరించాడు.
పద్నాలుగో అవతారంలో నరసింహుడై అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించాడు.
పదిహేనులో వామనమూర్తి అయి బలిచక్రవర్తిని అణిచాడు.
పదహారులో పరశురాముడిగా అవతరించాడు.
పద్దెనిమిదో అవతారంలో శ్రీరాముడిగా జన్మించి రావణ సంహారం లాంటి అనేక అద్భుత కార్యాలను సాధించాడు.
పందొమ్మిది, ఇరవై అవతారాలలో కృష్ణ బలరాములుగా జన్మించి భూభారాన్ని తగ్గించాడు. ఇరవై ఒకటో అవతారంగా బుద్ధుడై పుట్టాడు.
ఆయన ఇరవై రెండో అవతారమే కల్క్యావతారం.
ఈ ఇరవై రెండింటికీ హంస, హయగ్రీవ అనే మరో రెండు చేర్చి ఆ భగవంతుడి అవతారాలు ఇరవై నాలుగు అని కొందరు అంటుంటారు.
భగవంతుడి అవతారాలు అనంతమని, ధర్మ రక్షణకోసం ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా ఆ స్వామి అవతరిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఆదినారాయణుడి విరాట్ స్వరూపం నుంచి లెక్కలేనన్ని అవతారాలు ఉద్భవిస్తుంటాయి. రుషులు, ప్రజాపతులు, మనుషులు… ఇలా అన్నీ ఆ భగవంతుడి అవతారాలే. ఆ ఆదినారాయణుడినే శ్రీకృష్ణుడని అంటారు. అందుకే ఆ కృష్ణుడిని పరబ్రహ్మ స్వరూపుడని, సకలసృష్టి కర్త అని పండితులు, వేదవిదులు నిత్యం కీర్తిస్తుంటారు. భగవంతుడికి రూపం లేదు. భూమి మీద ధూళి, వాయువుకు రూపం ఉన్నట్లు కనిపించిన తీరులో భ్రమతో భగవంతుడికి దృశ్యత్వాన్ని కల్పిస్తుంటారు. వాస్తవానికి భగవంతుడికి జన్మ, కర్మలు ఉండవు. అయినా ఆ జన్మ కర్మలుంటాయని వర్ణిస్తుంటారు. ఇదంతా వేద రహస్యమని పండితులు విశ్లేషిస్తున్నారు
No comments:
Post a Comment