దైవానికున్న అనేక నామాలలో ఒకటి " త్రిగుణాతీతుడు" ....అంటే మూడు గుణాలు లేనివాడు. ఆ మూడు గుణాల గురించి భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గుణత్రయ విభాయోగంలో, మోక్ష సన్న్యాస యోగంలో వివరించాడు.
అవి వరుసగా తామస గుణం, రజోగుణం, సత్త్వగుణం ..ఈ మూడు గుణాలు ప్రతి జీవితో తప్పనిసరిగా ఏదో నిష్పత్తిలో ఉంటాయి.
నతదంతి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః
సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్స్యాత్త్రి భిర్గూణైః
ప్రకృతి ( మాయ) నుండి పుట్టి ఈ మూడు గుణాలు లేనివారు దేవతల్లో కాని, మనుషుల్లో కాని, ఇతర జీవుల్లోకాని ఉండరు. ఉన్నది సాక్షాత్తు పరమాత్మఒక్కడే.
సాధారణముగా ఈ త్రిగుణాల్లో ఒకటి అధికంగా, మిగిలిన రెండు మొదటి దానికన్నా తక్కువ పాళ్ళల్లో మనుషుల్లో ఉంటాయి. అంటే ఒకరిలో తామసగుణం ఆరింట నాలుగుపాళ్ళు, రజోగుణం ఒక పాలు, సత్త్వగుణం ఒకపాలు ఉండవచ్చు. మనిషి మనిషికీ వారిలో ఉన్న ఆ గుణాల సాంద్రతని బట్టి ఈ నిష్పత్తిమారుతూ ఉంటుంది.
ఈ మూడు గుణాలని ఈ జన్మలోనే వదిలించుకో గలిగితే మనిషి జీవన్ముక్తుడవుతాడు. ఈ మూడిట్లో తామస గుణం అధమం. రజో గుణం మధ్యమం. సత్త్వ గుణం ఉత్తమం. కాబట్టి అధమం అయిన తామసగుణం కలవారు దాన్ని వదిలించుకుని మధ్యం అయిన రజోగుణం వైపు ఎదగాలి. అలాగే మధ్యమం అయిన రజోగుణం కలవారు దాన్ని వదిలించుకుని ఉత్తమం అయిన సాత్విక గుణం వైపు ఎదగాలి.
సాత్త్వికగుణం కలవారు శుద్ధసాత్త్విక గుణంవైపు ఎదగాలి. మనిషి గుణ పరిమాణం ఈ క్రమంలోనే సాగుతుంది అని శాస్త్రం చెప్తోంది.

అవి వరుసగా తామస గుణం, రజోగుణం, సత్త్వగుణం ..ఈ మూడు గుణాలు ప్రతి జీవితో తప్పనిసరిగా ఏదో నిష్పత్తిలో ఉంటాయి.
నతదంతి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః
సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్స్యాత్త్రి భిర్గూణైః
ప్రకృతి ( మాయ) నుండి పుట్టి ఈ మూడు గుణాలు లేనివారు దేవతల్లో కాని, మనుషుల్లో కాని, ఇతర జీవుల్లోకాని ఉండరు. ఉన్నది సాక్షాత్తు పరమాత్మఒక్కడే.
సాధారణముగా ఈ త్రిగుణాల్లో ఒకటి అధికంగా, మిగిలిన రెండు మొదటి దానికన్నా తక్కువ పాళ్ళల్లో మనుషుల్లో ఉంటాయి. అంటే ఒకరిలో తామసగుణం ఆరింట నాలుగుపాళ్ళు, రజోగుణం ఒక పాలు, సత్త్వగుణం ఒకపాలు ఉండవచ్చు. మనిషి మనిషికీ వారిలో ఉన్న ఆ గుణాల సాంద్రతని బట్టి ఈ నిష్పత్తిమారుతూ ఉంటుంది.
ఈ మూడు గుణాలని ఈ జన్మలోనే వదిలించుకో గలిగితే మనిషి జీవన్ముక్తుడవుతాడు. ఈ మూడిట్లో తామస గుణం అధమం. రజో గుణం మధ్యమం. సత్త్వ గుణం ఉత్తమం. కాబట్టి అధమం అయిన తామసగుణం కలవారు దాన్ని వదిలించుకుని మధ్యం అయిన రజోగుణం వైపు ఎదగాలి. అలాగే మధ్యమం అయిన రజోగుణం కలవారు దాన్ని వదిలించుకుని ఉత్తమం అయిన సాత్విక గుణం వైపు ఎదగాలి.
సాత్త్వికగుణం కలవారు శుద్ధసాత్త్విక గుణంవైపు ఎదగాలి. మనిషి గుణ పరిమాణం ఈ క్రమంలోనే సాగుతుంది అని శాస్త్రం చెప్తోంది.

No comments:
Post a Comment