ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమైయెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణంబెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ఒకపరి జగముల వెలినిడి, యొకపరి లొపలికిఁ గొనుచు నుభయుముఁ దానైసకలార్థ సాక్షియగు న, య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్లోకంబులు లోకేశులు, లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెంజీఁకటి కవ్వల నెవ్వఁడు, నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్
పోతన గారు చెప్పిన ఈ పద్యంలో సర్వాంతర్యామి అయిన నిరాకార
పరబ్రహ్మను గూర్చి తెలియజేశాడు
పరమదైవం శ్రీమన్నారాయణుడే అని...
ఆ ఆదినారాయణుడే కలియుగంలో
శ్రీవెంకటేశ్వరస్వామిలా ఆ ఏడుకొండలపై మనకు దర్శనమిస్తున్నాడు..
ఓం నమో వేంకటేశాయ
జై శ్రీమన్నారాయణ....
మీ.....వల్లూరి రామకృష్ణాచార్యులు.
No comments:
Post a Comment