జయహో హిందూ ...!!
మన వీర నారి ఝాన్సీ లక్ష్మి భాయి గురుంచి తెలుసుకుందాం :
బ్రిటిష్ భారతీయులు పూర్తిగా స్వేచ్ఛను కోల్పోరుున రోజులవి. బానిస సంకెళ్ళు లో అడుగు వేయడం భారంగా తోచిన కాలం అది. 1857 సిపారుుల తిరుగుబాటుతో బ్రిటిష్ వారికి తొలిదెబ్బ పడింది. సిపారుుల తిరుగుబాటు భారతీయులలో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. ఈ తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు ఝాన్సీ లక్ష్మిభారుు.
ఝాన్సీ లక్ష్మిభాయి:
భారతదేశంలో ఉత్తరభాగంలో ఉన్న నాటి ఝాన్సీ రాజ్యానికి మహారాణి లక్ష్మిభాయి. బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం ఆమె పోరాడి తొలి మహిళా స్వాతంత్య్ర సమర యోద్ధురాలిగా ప్రసిద్ధి చెందారు. పూర్తిగా పురుషుడిలా దుస్తులు ధరించే లక్ష్మీ భాయి తమ సైన్యాన్ని బ్రిటిష్వారిపై దాడికి సిద్ధం చేశారు.కత్తిసాము, గుర్రపు స్వారీలో మంచి పట్టు ఉన్న ఆమె ఎంతో ధైర్యంతో పోరాడి శత్రువులను మట్టికరిపించే వారు.చివరికి బ్రిటిష్వారు లొంగి పొమ్మన్నా చివరి శ్వాసవరకు పోరాడారు.
1857 నాటి స్వాతంత్ర్య సంగ్రామాన్ని గుర్తు చేసుకున్నపుడు వీరత్వము, దేశ భక్తి, వీరనారి ఝాన్సీ రానీ పోరాట పటిమ గుర్తుకు వస్తాయి. అంతే కాని సంగ్రామ సమాచారం తక్కువ మంది ప్రజలకే తెలిసిందని, సెక్యులర్ చరిత్ర కారులు సత్యాన్ని మరిచారని శ్రీ మదన్దాస్ అన్నారు. వీరాన్గన ఝాన్సీ రానీ సమాధి పై ఏర్పాటు చేసిన ఈ అమరజ్యోతి, ప్రజలకు దేశ భక్తిని ప్రేరేపించగలదని, దేశం కోసం సర్వస్వం ధార పోసేందుకు ప్రేరణ ఇస్తుందని అన్నారు.
శ్రీ శివరాజ్ చౌహాన్ మాట్లాడుతూ వీరవ్రతుల వీరత్వము, త్యాగ ధనులు బలిదాన కథలను ప్రతి మనిషి వద్దకు చేరేలా చేస్తామన్నారు. త్యాగధనుల స్వప్నాలను నిజం చేయగలిగినప్పుడే దేశ ప్రజల సమగ్ర వికాసం సాధించగలమన్నారు.
No comments:
Post a Comment