శ్రీ రామావతార కాలములో ఋషులు, మునులు, జ్ఞానులు శ్రీ రాముని సాంగత్యము, సాన్నిహిత్యము కోరి, కృష్ణావతార సమయములో గోపికలుగా జన్మించారు. వారి కోరిక ప్రకారమే వారికి ఆయన దర్శన, స్పర్శ, ధ్యాన, భౌతిక సామీప్యములు లభించినవి. అందువలన వారి గత జన్మ విజ్ఞానమంతటిని వారు విడువవలసి వచ్చినది. అందువలన వారు పాండిత్యము, విద్యలేని సామాన్య స్త్రీలుగా జన్మించారు. వారు తమ సంసార బాధ్యతలలో మునిగి ఉన్నారు. వారి విషయములో అవిద్య, అమాయకత్వము, పారదర్శకత్వము మొదలగు గుణములే వారికి మహోన్నత గుణములైనవి.
శ్రీ శుకుని ద్వారా భాగవతము వినే సమయములో పరీక్షిత్ మహరాజుకు ఒక సందేహం వచ్చినది. "కృష్ణస్తు భగవాన్ స్వయమ్ అనే విషయము మనకు భాగవతములో వ్యాసుడు చెప్పినప్పుడు కదా తెలిసినది. గోపికలకు ఆ విషయము తెలియదు. కేవలం కృష్ణునిపై వారికిగల మోహభావం వారి ముక్తికి హేతువౌతుందా?" అని శ్రీశుకుని ప్రశ్నించాడు.దానికి శుకుడు శిశుపాల కంసాదులుకూడా ద్వేషము, భయము, క్రోధము వంటి భావములచేత కూడా తరించారు. ఎవరైతే పరమాత్మను అనన్యచింతతో అహర్నిశలూ అతనియందే ద్వేషము చేతగాని, భయము చేతగాని, క్రోధము చేతగాని, ప్రేమ చేతగాని, మోహముచేతగాని తమ మనో బుద్ధి చిత్తములను లయము చేయ గలిగితే వారు తరించగలరని శుకుడు సమాధానం ఇస్తాడు.
మోహముతో గోపికలు చేరిన ముక్త స్థితి యౌగిక దృక్పథములో విశ్లేషించవచ్చును. మనలను ఈ లోకానికి బంధించేది మనస్సు. మనస్సు వామనాడియైన ఇడానాడి అధీనములో ఉన్నది. దానిని ఆధారముగా చేసుకునికూడా పైకి వెళ్ళవచ్చును. లోకములో అనేక వస్తువులపై పెంచుకునే మోహమును పరమేశ్వరునియందే పెంచుకొనవచ్చును. అన్నికోరికలు తీరుటకు ఆయననే ఆరాధింపవచ్చును. మధురమైన పాయసమును త్రాగితే కలిగే సంతృప్తిని ఆయనే ఈయగలడు. ఆయన చూపించేది ముక్తి మార్గమే అవుతుంది. విష్ణువు ధరించే కౌస్తుభమణియే హృదయాకాశములో ఉండే చింతామణి. నారాయణ తీర్థుల లీలా తరంగిణి అంతా గోపికలను దృష్టిలో పెట్టుకొని రచించిన శ్రంగార కావ్యమే. గోపికల వలె జీవించమని ఆయన భావము.యోగ సాధనలో మణిపూరక చక్ర రహస్యాలు లీలా తరంగిణిలో పొందుపరచబడి ఉన్నాయి. అజ్ఞానులైన గోపికలు మోహభావముతో జగన్మోహనుడైన శ్రీకృష్ణునిచేరారు. ఆయన నిర్గుణ తత్త్వముకాని, జగత్తుకు మూలకారణ తత్త్వముకాని వారికి తెలియదు. కేవలము మోహ బుద్ధితో మణిపూరకాన్ని అధిగమించి వెళ్ళారు. ఈ గాఢ మోహ స్థితిలో తమ సంసారమును, పిల్లలను, భర్తలను, పాడి ఆవులను, ఇండ్లను వదలి చిత్తమంతా కృష్ణునితో నింపుకొని వెళ్ళారు. వారిది సామాన్య మోహము కాదు. జ్ఞానమసలే కాదు. శుద్ధజ్ఞాన స్వరూపుని యందు మోహము. విద్య, అవిద్య కలసియుంటే అది సంపూర్ణ మోహము కాదు. వారి సంపూర్ణ మోహమే వారిని ఉత్తీర్ణులను చేసింది. యోగశాస్త్రములో మణిపూరకము స్వాధిష్టానమునకు పైన అనాహతమునకు దిగువ ఉన్నది. విద్య, అవిద్యల మిశ్రమములో జీవించే సామాన్యునికి పంకమువలె ఉన్న ఈ మణిపూరకమును దాటుట సంభవము కాదు.
కృష్ణుడు తన అవతార సమయములో చేసిన లీలలన్నిటినీ యోగ సిద్ధులని కొందరు చెబుతారు. ఆయనను మహాయోగి, యోగేశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు అంటారు. అన్నియోగములు ఆయన యందే పుట్టినవి. ఆయన చేసినలీలలకు ఆయనకు యోగశక్తులు, సిద్ధులు అవసరములేదు. సంకల్పమాత్రముననే అవి జరిగినవి. యోగములన్నీ ఆయనను జేరుకునే మార్గములు. యోగులకు లభించే యోగశక్తులు ఆయన శక్తికి అనుకరణములు (simulation of divinity).

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment