అయిదే రోజుల్లో రామసేతు నిర్మాణం
ప్రేమకు నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు.సీతా స్వయంవరంలో శివ ధనస్సును విరిచి ఆమెను గెలుచుకున్న అప్పటి నుంచి రాముడు ఆ ప్రేమకే బద్ధుడు. ఏకపత్నీవ్రతునిగాను ఆదర్శప్రాయుడయ్యాడు. తనపై పగతో అర్ధాంగి మహాసాధ్వి సీతమ్మను రావణుడు అపహరించుకు పోగా శ్రీరామచంద్రుడు ఆ రాక్షస రాజ్యంపైకి దండెత్తాల్సి వచ్చింది. అలా లంకను చేరేందుకు వానరసేన సహాయంతో నిర్మించిందే రామసేతు.ఇది పురాణం.. నిజమేననేందుకు లభించిన ఆధారాలే ససాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటి తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంకకు మధ్యగల సముద్రంపై సుమారు 18 లక్షల ఏళ్ల క్రితం ఈ సేతు నిర్మితమైందట. పోటెత్తే సాగర జలాలపై ఓ సరళరేఖను గీసిన మాదిరిగా ఈ వారధి నిర్మితమయిందంటున్నారు.పెద్ద పెద్ద బండ రాళ్లు,వెదురు,గడ్డి,తదితర సామగ్రితోనే రామసేతును వానర సైన్యం నిర్మించింది.అదీ కేవలం అయిదే రోజుల్లో ఇంత పెద్ద వంతెన నిర్మాణం పూర్తయిందంటే ఆశ్చరమే.

No comments:
Post a Comment