కార్య సాధనలో ఉత్సాహంగా పయనిస్తున్న ఆంజనేయుణ్ణి సింహిక అనే రాక్షసి బయటకు కనపడకుండా సముద్రంలోనుంచి తనవైపు లాింది. అందువల్ల త్వరితగతిన వెళుతున్న ఆంజనేయుని వేగం మందగించింది. అప్రమత్తంగా ఉన్న ఆంజనేయుడు వెంటనే తనకు కలిగే ఆపదను గ్రహించి సింహికను సంహరించాడు.
కర్తవ్యపాలనలో దృఢచిత్తంలో వెళుతున్న మన వేగాన్ని మందగింపజేసేది మనలో అదృశ్యంగా ఉన్న ’అసూయ’యే సింహిక. ఎవరైనా మనకన్నా అభివృద్ధి సాధించి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదిస్తే మనలో తెలియకుండానే వారిపట్ల అసూయ కలుగుతుంది. అసూయాగ్నితో దహించుకుపోతున్న మనసు ఆలోచనా శక్తి కోల్పోయి మన అభివృద్ధిని మందగింప జేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండి అసూయ అనే సింహికను ఎదుర్కోవాలి. ఎన్నో విఘ్నాలను ఎదుర్కొని చివరికి లంకలో ప్రవేశిస్తున్న ఆంజనేయునికి మరొక అవరోధం ఏర్పడింది. సింహద్వారం వద్ద లంకిణి ఆంజనేయుణ్ణి అడ్డుకొని ’నేను ఈ లంకా నగరాన్ని రక్షిస్తున్నాను. నన్ను ఎదిరించిన వారే లోపలికి ప్రవేశించాలి.’ అని అహంకారంతో గర్జించింది. అహంకార పూరితురాలైన లంకిణిని ఒకే ఒక ముష్తిఘాతంతో అంతమొందించాడు హనుమంతుడు.
చేపట్టిన కార్యంలో అభివృద్ధిని సాధిస్తున్నప్పుడు మనలాంటి ధీరులూ, ధీమంతులూ ఇంకెవరూ లేరనే అహంకారం పెరుగుతుంది మనలో పర్వతాకారంలో ఎదిగిన అహంకారమే లంకిణి. అహంకారపూరితులు ఎదుటి వ్యక్తిలోని గొప్పతనాన్ని గుర్తించలేరు. అనంతశక్తిమంతుడైన ఆంజనేయుణ్ణి ఒక సాధారణ వానరమని తప్పుగా, తక్కువగా అంచనావేసి తన వినాశనానికి తానే కారకురాలైంది లంకిణి. కాబట్టి అహంకారంతో వ్యవహరించేవారికి వినాశనం తప్పదు. ఎలాగైతే ఆంజనేయుడు అహంకార రూపిణి అయిన లంకిణిని జయించి లంకానగరంలో ప్రవేశించాడో అలాగే మనలోని అహంకారాన్ని జయిస్తేనే విజయ సామ్రాజ్యంలోనికి ప్రవేశించడం సాధ్యమవుతుంది.

కర్తవ్యపాలనలో దృఢచిత్తంలో వెళుతున్న మన వేగాన్ని మందగింపజేసేది మనలో అదృశ్యంగా ఉన్న ’అసూయ’యే సింహిక. ఎవరైనా మనకన్నా అభివృద్ధి సాధించి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదిస్తే మనలో తెలియకుండానే వారిపట్ల అసూయ కలుగుతుంది. అసూయాగ్నితో దహించుకుపోతున్న మనసు ఆలోచనా శక్తి కోల్పోయి మన అభివృద్ధిని మందగింప జేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండి అసూయ అనే సింహికను ఎదుర్కోవాలి. ఎన్నో విఘ్నాలను ఎదుర్కొని చివరికి లంకలో ప్రవేశిస్తున్న ఆంజనేయునికి మరొక అవరోధం ఏర్పడింది. సింహద్వారం వద్ద లంకిణి ఆంజనేయుణ్ణి అడ్డుకొని ’నేను ఈ లంకా నగరాన్ని రక్షిస్తున్నాను. నన్ను ఎదిరించిన వారే లోపలికి ప్రవేశించాలి.’ అని అహంకారంతో గర్జించింది. అహంకార పూరితురాలైన లంకిణిని ఒకే ఒక ముష్తిఘాతంతో అంతమొందించాడు హనుమంతుడు.
చేపట్టిన కార్యంలో అభివృద్ధిని సాధిస్తున్నప్పుడు మనలాంటి ధీరులూ, ధీమంతులూ ఇంకెవరూ లేరనే అహంకారం పెరుగుతుంది మనలో పర్వతాకారంలో ఎదిగిన అహంకారమే లంకిణి. అహంకారపూరితులు ఎదుటి వ్యక్తిలోని గొప్పతనాన్ని గుర్తించలేరు. అనంతశక్తిమంతుడైన ఆంజనేయుణ్ణి ఒక సాధారణ వానరమని తప్పుగా, తక్కువగా అంచనావేసి తన వినాశనానికి తానే కారకురాలైంది లంకిణి. కాబట్టి అహంకారంతో వ్యవహరించేవారికి వినాశనం తప్పదు. ఎలాగైతే ఆంజనేయుడు అహంకార రూపిణి అయిన లంకిణిని జయించి లంకానగరంలో ప్రవేశించాడో అలాగే మనలోని అహంకారాన్ని జయిస్తేనే విజయ సామ్రాజ్యంలోనికి ప్రవేశించడం సాధ్యమవుతుంది.

No comments:
Post a Comment