లక్ష్మి దేవికి "దక్షిణావర్త శంఖం" అంటే ఎందుకు ఇష్టం?
ఈ శంఖం కడుపు ఊదేవారి కుడివైపునకు తెరుచుకుని ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని 'దక్షిణావర్తి శంఖం' అంటారు.
దీనికి వ్యతిరేక దిశలో తెరుచుకుని ఉండేవి వామావర్తి శంఖమని పేరు. అసలు లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు ఇష్టమంటే, లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. శంఖం కూడా మనకు సముద్రంలో దొరికేవే. మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖాలే.
అయితే, దక్షిణావర్తి శంఖాలు దొరకడం కష్టసాధ్యమే. ఈ శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరిగా వర్ణిస్తారు. రామేశ్వరం, కన్యాకుమారిలలో ఈ శంఖాలు విస్తారంగా దొరుకుతాయి.
దక్షిణావర్తి శంఖం మోగదు, కానే మోగేది దొరికితే పూజామందిరంలో పెట్టుకుని పూజించాలి.
దోషాలున్న శంఖాలు పూజకు పనికిరావు. పగిలినది, విరిగినది, పలచనిపొర, గరుకైన ముక్కు, రంధ్రాలు ఉన్నవి పూజకు పనికిరావు.
ఈ శంఖం ఉన్న ఇంటిలో అష్టైశ్వర్యాలతో, ఆనందంతో నిండుగా ఉంటుంది.
No comments:
Post a Comment