What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

విశ్లేషణ :: క్రైస్తవ మిషనరీల ప్రజాసేవ స్వార్థపూరితమైనదనే విమర్శ ముందునుండీ ఉంది.

క్రైస్తవ మిషనరీల ప్రజాసేవ స్వార్థపూరితమైనదనే విమర్శ ముందునుండీ ఉంది. చదువు చెబుతున్నామని, వైద్యం చేస్తున్నామని సేవల ముసుగేసుకుని మత ప్రచారాలు జరుపుతారు. రగ్గులిచ్చి, దుప్పట్లిచ్చి మత మార్పిడులు నిర్వహించిన చరిత్ర వారికుంది. సేవాసంస్థల ముసుగులో కోట్లాది రూపాయల డబ్బులు బయటి దేశాల నుండి పొందవచ్చనే దుర్బుద్ధితో మతం మార్చుకున్నవారున్నారు. అలా లబ్ది పొంది కోటీశ్వరులు అయినవారు, ఆనక రాజకీయాల్లోకి ప్రవేశించిన వారినీ మనమెరుగుదుము.

క్రైస్తవ స్వస్థత కూటములు జరుగుతూ ఉంటాయి, గమనించే ఉంటారు. (ఈ మధ్య ఇవి విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి వాటిని గమనించకుండా ఉండడం కష్టమే!) ఈ కూటముల పేరుతో గిరిజనులను సాంస్కృతికంగా దోచుకుంటున్న విషయం రాసారీ ఆంధ్రజ్యోతి వ్యాసంలో. అది చదివితే విస్తుపోతాం, ఈ మిషనరీల సృజనాత్మకతకు. గిరిజనుల కట్టూ, బొట్టూ, ఆహారపు టలవాట్లను కూడా మార్చారట. వీరి కారణంగా గిరిజనుల మధ్య అంతర్గత కలహాలు కూడా వచ్చాయట.

తిరుపతిలో ప్రభుత్వ ఆసుపత్రిలో క్రైస్తవ ప్రచారకులు రోగుల చేత ప్రార్థనలు చేయించిన విషయం మనకు తెలిసిందే. హిందువుల పుణ్యక్షేత్రాలైన తిరుమల, సింహాచలం వంటి వాటిని కూడా వదిలిపెట్ట లేదు. ఈ రెండు చోట్లా క్రైస్తవ మత ప్రచారాలు చేస్తున్న వారిని ప్రజలే పట్టుకుని దేహశుద్ధి చేసారు కూడాను.
మత మార్పిడుల రగడ ఎక్కువైపోయిందీ మధ్య. సాక్షాత్తూ పోపు కూడా మతమార్పిడులను అడ్డుకోరాదని మనకో ఉచితసలహా పారేసిన విషయం మనకు తెలుసు. ఇతర మతస్తుల వద్ద తమ మతాన్ని ప్రచారం చేసుకోవడంపై వీరికింత యావ ఎందుకు? హిందువులను గబగబా మతం మార్చెయ్యాలని ఎందుకో వీరికీ తహతహ?

ఈ మత ప్రచారాన్నీ మత మార్పిడులను ఆపాలి. వీటిని నిషేధిస్తూ చట్టం చెయ్యాల్సిన సమయం వచ్చింది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML