సీతమ్మ తల్లి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతతో ఐక్యమైందన్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రదేశం ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. ఆ పవిత్ర స్థలం అలాహాబాద్ వారణాసిలను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో సీతమ్మ భూమాతతో ఐక్యమైన స్థలం ఉంది. రెండవ జాతీయ రహదారి పైన ఉన్న జంగీగంజ్ నుండి 14 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని ‘సీతా సమాహిత్ స్థల్’ అనీ... ‘సీతా మారీ’ అనీ పిలుస్తారు. తమసానది పరిసరాలలో ప్రశాంతమైన వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఇక్కడ ఉంది. ఈ స్మారక నిర్మాణం జరుగక ముందు, ఇక్కడ అమ్మవారి జుత్తుని తలపించేట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడివారు చెబుతారు.
అక్కడ మొలిచిన గడ్డిని పశువులు మేసేవి కావట. స్మారకం నిర్మించినపుడు, సితా కేశ వాటికను పాడు చేయకుండా అలానే ఉంచారు. ఆ ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. పక్కనే , లవకుశు లకు జన్మనిచ్చిన స్థలం అయిన సీతా వట వృక్షం కుడా ఉన్నది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది రెం డతస్తుల నిర్మాణం. పై అంతస్తులో అద్దాల మంటపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉన్నది. క్రింది భాగంలో, జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్న ట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమ, ఎంతటివారికైనా కాస్తో కూస్తో బాధ కలిగించే విధంగా దర్శనమిస్తుంది. వెనుక గోడ మీద ఆ సంఘటనను ప్రతిబింబిస్తున్న సన్నివేశపు శిళా చిత్రం కినిపిస్తుంది.
ఇక ఈ కట్టడం గురించిన వివరాలలో కెళితే, దీన్ని స్వామీ జితేంద్రానంద తీర్థుల వారి నిర్దేశం మేరకు /ట ్కఠ్జ ఔౌడఛీ సంస్థ ప్రమోటర్ అయిన శ్రీ సత్య నారాయణ్ ప్రకాష్ పన్జ్ ఈ పవిత్ర దేవాలయం నిర్మించారు. ఇక్కడ సీతమ్మ తల్లితో పాటు శివుడి విగ్రహం కూడా ఉన్నది. అంతేకా కుండా 20 ఫీట్ల కృత్రిమ రాతిపై నిర్మించిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ రాతి నిర్మాణం క్రింద గుహలో చిన్న హనుమాన్ దేవాలయం కూడా ఉన్నది.
అక్కడ మొలిచిన గడ్డిని పశువులు మేసేవి కావట. స్మారకం నిర్మించినపుడు, సితా కేశ వాటికను పాడు చేయకుండా అలానే ఉంచారు. ఆ ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. పక్కనే , లవకుశు లకు జన్మనిచ్చిన స్థలం అయిన సీతా వట వృక్షం కుడా ఉన్నది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది రెం డతస్తుల నిర్మాణం. పై అంతస్తులో అద్దాల మంటపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉన్నది. క్రింది భాగంలో, జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్న ట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమ, ఎంతటివారికైనా కాస్తో కూస్తో బాధ కలిగించే విధంగా దర్శనమిస్తుంది. వెనుక గోడ మీద ఆ సంఘటనను ప్రతిబింబిస్తున్న సన్నివేశపు శిళా చిత్రం కినిపిస్తుంది.
ఇక ఈ కట్టడం గురించిన వివరాలలో కెళితే, దీన్ని స్వామీ జితేంద్రానంద తీర్థుల వారి నిర్దేశం మేరకు /ట ్కఠ్జ ఔౌడఛీ సంస్థ ప్రమోటర్ అయిన శ్రీ సత్య నారాయణ్ ప్రకాష్ పన్జ్ ఈ పవిత్ర దేవాలయం నిర్మించారు. ఇక్కడ సీతమ్మ తల్లితో పాటు శివుడి విగ్రహం కూడా ఉన్నది. అంతేకా కుండా 20 ఫీట్ల కృత్రిమ రాతిపై నిర్మించిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ రాతి నిర్మాణం క్రింద గుహలో చిన్న హనుమాన్ దేవాలయం కూడా ఉన్నది.
No comments:
Post a Comment