What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 13 April 2014

శ్రీరామనవమి :

శ్రీరామనవమి :

శ్రీరామనవమి నాడు "శ్రీసీతారాముల కళ్యాణం'' చేయడం అనాదినుంచి వస్తున్నా ఆచారం. నిజానికి చైత్రశుద్ధనవమినాడు శ్రీసీతారామ కళ్యాణం జరగలేదు. 
వైవస్వత మన్వంతరంలోని పంచమ త్రేతాయుగమునందలి నాల్గవ పాదంలో 30,000 సంవత్సరాలు అయిన విశంచి నామసంవత్సర చైత్రశుద్ధనవమి, బుధవారం నాడు, పునర్వసూ నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో రవి, గురు, శుక్ర, శని, కుజ గ్రహాలు ఉచ్ఛరాశులలో సంచరిస్తున్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు.
సౌమ్యనామ సంవత్సర ఫాల్గుణ పౌర్ణమి తిథినాడు ఉత్తరానక్షత్రంలో శ్రీసీతారాముల కళ్యాణం జరిగింది.
లోక కళ్యాణం కోసమే శ్రీరామజననం జరిగింది. సీతాకల్యాణంతో రామ అవతార లక్ష్యానికి, రావణసంహారానికి నాంది జరిగింది. అందుకే శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధనవమినాడు సీతారాముల కళ్యాణం జరిపించి ఆనందించడం ఆచారమైంది. అంతేకాదు ....
నూతన సంవత్సరం మనకు ఉగాదితో మొదలవుతుంది. చిత్రశుద్ధ పాడ్యమి నుంచే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో "శ్రీరామాయణాన్ని'' పారాయణ చేస్తారు. రామాయణం కేవలం కథ కాదు. లోక కళ్యాణం కోసం నరునిగా అవతరించిన దేవదేవుని దివ్యగాథ ఆ పుణ్య చరిత్రను బీజాక్షరబద్ధం చేసి తొలికృతిగా తీర్చిదిద్దాడు ఆదికవి వాల్మీకి.
శ్రీమద్రామాయణం రసానందాన్ని కలిగింగే మహాకావ్యం మాత్రమే కాదు ... కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు.
- బాలకాండలోని పుత్రకామేష్టి యాగ ఘట్టాన్ని మండలం [40] రోజులు పారాయణ చేస్తే సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది.
- సీతారామ కళ్యాణ ఘట్టాన్ని నలభైరోజులు పారాయణ చేస్తే వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామితో వివాహం జరుగుతుంది.
- ఇక సర్వకార్యార్థసిద్ధి ప్రదమైన సుందరకాండ పారాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే.

"శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం'' అని కేవలం నోటిమాటగా చెప్పుకోవడం కాదు. ఇందుకు నిదర్శనం రామాయణంలోనే ఉంది.
ఇంద్రజిత్తుతో లక్ష్మణుడు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేస్తున్నాడు. లక్ష్మణుడు తన అస్త్రబలంతో ఇంద్రజిత్తు మాయలను ఛిన్నాభిన్నం చేస్తున్నాడేగానీ అతన్ని సంహరించలేక పోతున్నాడు. చివరకు విసుగు చెందిన లక్ష్మణుడు షరాసంధానం చేసి :

ధర్మోత్మా సత్యసన్దశ్చ రామోదాశరథిర్విది 
పౌరుషే చాప్రతిద్వాన్ద్వః శరైనం జహిరావణిమ్

"దశరధాత్మజుడైన రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, అజేయుడు అయితే ... ఈ శరాఘాతంతో ఇంద్రజిత్తు మరణించుగాక'' అని శరప్రయోగం చేసాడు. ఇంద్రజిత్తు మరణించాడు.
"రామో విగ్రహవాన్ ధర్మః సాధుస్సత్యపరాక్రమః'' అనడానికి ఇంతకన్నా మరో నిదర్శనం అక్కర్లేదు.
ధర్మస్వరూపమైన శ్రీరాముని గురించి ఎంత వ్రాసినా,ఎంత స్మరించినా తనివి తీరదు. రామనామమే ఆపాత మధురం. అది ఒక మహామంత్రం.

శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనమవరాననే

పరమశివుడంతటివాడు పరవశిస్తూ పార్వతికి బోధించిన రామతారక మంత్రమిది. అట్టి పరబ్రహ్మస్వరూపుడు ఆచరించిన అన్ని ధర్మాలు ఆచరించడం సామాన్యులమైన మనకు సాధ్యం కాని పని. కనీసం ఒక ధర్మానికైనా కట్టుబడదాం, ఆచరిద్దాం.శ్రీరాముని జన్మదినాన్ని భక్తిగా జరుపుకుందాం, తృప్తిగా శ్రీసీతారాముల కళ్యాణం చూసి తరిద్దాం.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః
 


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML