03/04/2014, న్యూయార్క్ : న్యూయార్క్ నగరములో నిర్వహించబడే ప్రతిష్టాత్మక " ది మెట్రోపాలిటన్ మ్యుజియం ఆఫ్ ఆర్ట్ " ఈ సంవత్సరం ఏప్రిల్ 14 నుండి జులై 27 వరకు కొనసాగనుంది, విభిన్న రూపాలలో ఉన్న హిందూ దేవి - దేవతా విగ్రహాలను ప్రదర్శనకు పెట్టడం ఈ సంవత్సరం విశేషం.
ప్రస్తుతానికి అందుబాటులో సమాచరం మేరకు ఐదవ శతాబ్దానికి చెందిన కొన్ని అపురూప శిల్పాలను ప్రదర్శనకు ఉంచుతునట్లు తెలిసింది వాటిలో దక్షిణ కొలంబియ కు చెందిన గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీ కృష్ణుని విగ్రహం, మధ్య వియత్నాం నుండి సన్యాస గణేశుని విగ్రహం, బ్రహ్మ విగ్రహం, విష్ణు విగ్రహం, శివుడు, సూర్య విగ్రహం, గరుడ విగ్రహం, మన బుషుల విగ్రహాలు, కల్కి అవతార విగ్రహం, హరిహరుల విగ్రహం, దేవి విగ్రహం, గరుత్మంతుడిపై కూర్చున్న విష్ణు భగవానుడి విగ్రహం, శివ లింగం, త్రిశులము, శివుని పాద ముద్రికలు తదితర హిందూ ఆరాధ్య శిల్పాలు ఉన్నాయి.
No comments:
Post a Comment