What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

హిందు ధర్మ గొప్పతనము మరియు శాస్త్రీయ విఘ్నానము.

ఒక గ్రాము ఆవు నెయ్యి హోమం చేస్తే 1000
సి.సి. ప్రాణవాయువు ఉత్పన్నం అవుతుంది.
(యజ్ఙయాగాలు చేయుట వల్ల కలిగే ఫలితాల్లో
ఇదొకటి)
మొగల్ సామ్రాజ్య స్ధాపకుడు బాబర్ తన
కుమారుడు హుమాయూన్ కు వ్రాసిన తెఖ
సారాంశము
"ఓ పుత్రుడా..మన హిందూ రాజ్యములో వివిధ
ధర్మావలంబులు నివసించుచున్నారు.
భగవంతుడు రాజ్య
శాసనము చేయు అధకారమును నీ కొసంగెను.
నీవు న్యాయముగా పరిపాలన
చేయుచూ ముఖ్యముగా
గోహత్య జరగకుండా జాగ్రత్త వహింపుము.
అందుచే హిందువులకు ప్రీతి పాత్రుడగుదువు. నీ
శాసనముచే వారు తృప్తిలగుదురు"
హుమయూన్ తండ్రి మాటను జవదాటకు గోరక్షణ
చేసెను. బాబరు నౌకరును పంపి ఆహారమును
తెప్పించుకొమగా ఆహారమును విసరివేసి,ఒక
గ్లాసు ఆవు పాలు త్రాగి నిద్రించి, మరునాటి
నుండి సామాన్య శాకాహారమును భుజించెనని
తెలిసింది
గాంధీ గారు గోరక్షణ గురించి.......
నా సర్వప్రయత్నముల
లక్ష్యము గోవధను ఆపుచేయటమే.
ఆవును రక్షించడానికి తన ప్రాణాలను
సమర్పించలేని సంసిద్దుడు గాని వాడు నిజమైన
మనిషిగా ఎలా కాగలడు....
హిందూ దేశంలో గోవధ చేయుట
హిందువులను చంపుటతో సమానము. ఖురాన్ లో
ఇరుగుపొరుగు వారిని హత్య చేసిన వారికి
స్వర్గప్రాప్తి లేదని అందు లిఖింపబడినది...
ఆయుర్వేదాచార్యుడైన చరకుడు చరక సంహిత
గ్రంధంలో పాలు బలసంపన్నతకు, జ్ఙాపకశక్తికి,
నిస్సత్తువ
తొలగించుటకు, దీర్ఘాయుష్షునకు
దివ్యౌషధము అని పేర్కొనెను
జర్మనీ శాస్త్రవేత్త జీసిన్ వెల్డ్ వ్రాసిన
పుస్తకంలో భరతదేశంలో
ఆవు ఎందుకు పూజించబడుతుందని
భారతదేశంలోని గ్రామాల్లో పర్యటించి
ఆవులు ఎంతో దుర్భలత్వంగా కనిపించును. కానీ
ఆర్ధికపరంగా
మానవులకు ఎంత సహకరిస్తూన్నాయి
మరియు గ్రామాల్లో గోసంపద లేకపోతే సుమారు 11
నుండి 20 కోట్ల జనాభా
పట్టణాలకు తరలిపోవులకు సిధ్దమగుదురని
వ్రాసిరి....(ప్రస్తుత రోజుల్లో ఆయన చెప్పిన
విధంగానే మన దేశంలో గ్రామాల నుండి
పట్టణాలకు వలసలు పెరుగుతున్న
విషయం మనందరికీ తెల్సిందే)
రష్యాదేశపు వైజ్ఙానికుడు డాక్టర్
శిరోవిచ్...........పరిశోధనల ఫలితం
ఆవు పేడతో అలికిన ప్రాంతమునకు రేడియో
ధార్మిక శక్తిని నిరోధించునని, ఆవు నేతిని అగ్నిలో
వేసినచో దాని పొగ(యజ్ఙవాయువు) వలన
వాయు మండలములోని రేడియేషన్ యొక్క
ప్రభావము తగ్గిపోవుట జరిగిందని తెలిపిరి.
ఆవు యొక్క పంచగవ్యముల వలన అనేక
చర్మవ్యాధులు, క్యాన్సర్
రోగములు నయమగుచున్నవని, ఆ రోగముల
భారిన పడకుండా కాపాడబడుచున్నారని,
ఆరోగ్యవంతులై దీర్ఘజీవనము పొందగలరని
చెప్పుచున్నారు......
అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ ఇ.వి. మెగాలమ్ వారి
పరిశోధనల ఫలితం....
ఆవు పాలు, ఆవు నెయ్యి ని
ఉపయోగించు దేశవాసులు భౌతిక, విజ్ఙాన, బౌధ్దిక
క్షేత్రములలో ఎల్లప్పుడూ
ముందుగా యుండుట నిస్సంశయము అనిరి.
మహర్షి దయానంద సరస్వతి తన గోకరుణనిధి
అనే లఘు గ్రంధమున ఒక్క ఆవు తనపాలతో, తన
జీవిత
కాలములో 25,478మందికి ఒకమాటు ఆకలి తీర్చి,
తృప్తి పరచునని లెక్కలతో సహా
ఆధారాలను చూపుతూ వివరించిరి...
ఇక మన వేదాలు, పురాణాలు ఆవులకు ఇచ్చిన
ప్రాధాన్యత మనందరికీ తెల్సినదే..., మన
వేదాలు కేవలం ఆవులకే కాదు.....పాములు,
పక్షులు, పందులు, సింహాలు, ఏనుగులు, ఇంకా
అనేక కీటకాలను గురించి చెప్తూ...వాటిని హింసించ
రాదని, వాటిని కూడా సాటి జీవులుగా
గౌరవిస్తూ మెలగాలని చెప్తూ వాటిని సమున్నత
గౌరవాన్ని అందించాయి
ఈనాడు జీవ వైవిధ్యం అని అంతర్జాతీయ
సదస్సులు,
కార్యక్రమాలు వేలకోట్లు ఖర్చు పెట్టి
నిర్వహించే ఈ
ప్రభుత్వాలు మన సంస్కృతిని పట్టించుకుని
ఉంటే ఈనాడు ఇలా జీవజాతులు అంతరించి
పోతున్నాయి అని
ప్రచారం చేసుకోవాల్సిన అవసరం వచ్చివుండేదికాదు
3028Like · 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML