What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

విశ్లేషణ:: గాడ్సే గాంధిని ఎందుకు చంపాడు?

గాడ్సే గాంధిని ఎందుకు చంపాడు?

దేశవిభజనకు అంగీకరించాడని, తమ
సిద్ధాంతాలను హిందువులపై మాత్రమే బలవంతంగా
రుద్దాడని గాడ్సే అభిప్రాయం. అనేక సందర్భాలలో
ముస్లింలను సంతృప్తి పరచడానికి,
బుజ్జగించడానికి గాంధీజీ ప్రయత్నించాడే కాని
హిందువుల ప్రయోజనాలను పట్టించుకోలేదని,
గాంధీజీ హిందువులకు ద్రోహం చేశాడని, దీని
ఫలితమే దేశ విభజన అని గాడ్సే అభిప్రాయం.
మనకు రక్తపాత రహితంగా
స్వాతంత్య్రం లభించిందన్నది అవాస్తవమని,
గాంధీజీ అహింసావాదం సంపూర్ణంగా
విఫ లమైందని, అందుకు బెంగల్నుంచి కరాచి
వరకు ప్రవహించిన హిందువుల రక్తమే
సాక్ష్యమని గాడ్సే అన్నాడు. గాంధీజీ వల్లనే
'అఖండ భారత్' అనే స్వప్నం భగ్నమైందని గాడ్సే
భావించాడు. గాడ్సే తన కేసును తానే
వాదించుకున్నాడు. హత్య చేయడానికి
కారణాలను సోదాహరణంగా వివరిస్తూ ఆంగ్లంలో
రాసుకొన్న సుదీర్ఘ ప్రతివాదాన్ని
(వాంగ్మూలాన్ని) న్యాయస్థానంలో చదివి
వినిపించాడు. 'మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్'
పేరుతోగల ఆ వాంగ్మూలాన్ని నాడు నిషేధించారు.
గోపాల్ గాడ్స్, తాను జైలు నుండి విడుదలైన తర్వాత
ఆ వాంగ్మూలాన్ని పుస్తక రూపంలో
ప్రచురించాడు.
1948 జనవరి 29వ తేదీన హిందూ శరణార్థ
శిబిరంలో యాదృచ్ఛికంగా పరిచయమైన ఒక
ఆయుధాల వ్యాపారినుండి తుపాకీ
కొనుగోలు చేసేవరకు గాంధీని హత్య చేయాలని
అనుకోలేదని గాడ్సే అన్నాడు. ఈ హత్యలో
మరెవ్వరి ప్రేరణగాని, ప్రమేయం కాని లేదని గాడ్సే
పేర్కొన్నాడు.

పాకిస్థాన్ వాటా అయిన 55 కోట్ల
రూపాయలను తక్షణం మంజూరు చేయాలని
పట్టుపడుతూ, గాంధీ ఉపవాస
దీక్షకు పూనుకున్ రూ

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML