What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 13 April 2014

!! గాయత్రీ మంత్రము !!

!! గాయత్రీ మంత్రము !!

" ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ "
ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు. ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా...

1. తత్ – గణేశ్వరుడు 2. స - నృసింహ భగవానుడు 3. వి – విష్ణుదేవుడు
4. తుః – శివదేవుడు 5. వ - కృష్ణ భగవానుడు 6. దే - రాథా దేవి
7. ణ్యం – లక్ష్మీదేవి 8. భ – అగ్నిదేవుడు 9. ర్గః – ఇంద్రదేవుడు
10. దే – సరస్వతి 11. వ – దుర్గాదేవి 12. స్య – హనుమంతుడు
13. ధీ – పృధ్వీదేవి 14. మ – సూర్యదేవుడు 15. హి - శ్రీరాముడు
16. ధి – సీతామాత 17. యో – చంద్రదేవుడు 18. యో – యమదేవుడు
19. నః – బ్రహ్మదేవుడు 20. ప్ర – వరుణదేవుడు 21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు 23. యా – హంసదేవత 24. త్ - తులసీదేవి

మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి. ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML