“నేను భారతదేశం మొత్తం తిరిగాను.. నాకు ఎక్కడా ఒక దొంగ గానీ బిక్షగాడు కానీ కనపడలేదు.. ప్రజలలోని నైతికవిలువలు, శక్తి సామర్థ్యాలు చాలా గొప్పగాఉన్నవి.. ఇటువంటి దేశాన్నా మనం ప్రస్తుతం పాలిస్తోన్నది... అనిపిస్తోంది
వీరిని మనం ఎక్కువ కాలం పరిపాలించాలంటే .. ఆయువుపట్టైన సంస్కృతిని, అధ్యాత్మిక విజ్ఞానాన్ని కొల్లగొట్టాలి..
ఇలా చేయాలంటే వారి సనాతన విద్యావిధానన్ని దెబ్బతీయడం ఒక్కటే మార్గం... అందుకే నేటినుండి ఇంగ్లీషు భాషను అధికార భాషగా పరిగణించేలా చర్య తీసుకోండి.. అన్ని భాషలలోకెల్లా ఇంగ్లీషు భాషే గొప్పది అయ్యేలా చర్యలు తీసుకోండి అప్పుడే మనం పూర్తిగా రాజ్యాన్ని అధికారంలో తీసుకోవచ్చు... ""
తను అప్పుడు చేసిన ప్రసంగం దాదాపు భారతదేశం మొత్తం అధికార భాష ఇంగ్లీష్ అయ్యేలా చేసింది.. నేటికీ మన పిల్లలు ఈ మాధ్యమాన్నే అనుసరిస్తున్నారు.. మన గురు - శిష్య ఆశ్రమ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది... గురుకులాలు అంతరించాయి... చిన్నగా స్కూళ్ళ రూపంలో ఇంకొన్ని సేవల రూపంలో అడుగు పెట్టి వారి మతాన్ని పెంపొందించుకోవడంలో కృత కృత్యులయ్యారు.. బిక్షగాళ్ళే లేని దేశంలో అడుగడుగునా భిక్షగాళ్ళను తయారు చేసారు...
దురదృష్టవశాత్తూ ఒక పత్రికలోని క్లిప్పింగు తప్ప మెకాలే ప్రసంగానికి ఏ ఆధారమూ దీనికి లేదు.. ఇంటర్నెట్, మెయిల్, మైక్రోసాప్ట్, మీడియా చివరికి ఫేస్ బుక్ కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి.. మరి విషయం బయటకు ఎలా వస్తుంది.. ఎప్పటికీ రాదు...
మనకు భాష మీద మమకారం ఉండడం లేదు... ఇప్పటికైనా విద్యావిధానం మార్చి.. ఆంద్రప్రదేశ్ లో తెలుగు మీడియంను అధికార మీడియంగా ప్రకటిస్తే రాబోయే తరాల్లోనైనా తెలుగు అంతరించి పోకుండా ఉంటుంది...
No comments:
Post a Comment