What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 28 September 2014

దేవీ భాగవతాన్ని వ్యాసుడు పరీక్షిత్తు కుమారుడైన జనమేజయునకు తొమ్మిది రోజులలో వివరించాడు.

దేవీ భాగవతాన్ని వ్యాసుడు పరీక్షిత్తు కుమారుడైన జనమేజయునకు తొమ్మిది రోజులలో వివరించాడు. ఇది పూర్తిగా అమ్మవారి చరిత్ర. శ్రీ దేవీ భాగవతానికి వచన రూపంలో ఎన్నో అనువాదాలు వచ్చాయి, కానీ సులభంగా అర్థమయ్యే తేటతెలుగు పద్యాలలో రచయిత ఆంధ్రీకరించారు. ఇది పన్నెండు స్కంధాల గ్రంథం. ఇందులో హయగ్రీవ చరిత్ర, మధు కైటభుల కథ, నవరాత్రుల పూజా విధానం, ముఖ్యంగా మహిషాసుర సంహారం చక్కగా వర్ణింపబడ్డాయి. ఈ గ్రంథంలో కలియుగంలో జరిగే విశేషాలను గురించి తొమ్మిదవ స్కందంలో వర్ణించడం జరిగింది. పదకొండవ స్కంధంలో సదాచార లక్షణాలు, రుద్రాక్షలు ధరించడం వలన కలిగే ఉపయోగాలు వివరించడం జరిగింది. పన్నెండవ స్కంధంలో అమ్మవారి నివాసమైన మణిద్వీప వర్ణన దండక రూపంలో వ్రాయడం జరిగింది. నూతన గృహాలలో ఈ దండకం చదివితే వాస్తు దోషాల నివారణ జరుగుతుంది.

ఇందులోని సరళమైన తేట తెలుగు పద్యాలు కొన్ని:
భోగ మున్న మోక్షానికి పొందు లేదు
ముక్తి నొందిన భోగ విముక్తి యగును
దేవి పాదాలు సేవించు దివ్యుల కిల
భోగ మోక్షాలు రెండు పెంపొందు గాదె

తల్లి పద పంకజములపై తనరు భక్తి
లేశ లేశము లేశము లేశ మైన
చాలు సుఖ శాంతు లొసగగ జాలునదియు
చాలు ముక్తి నొసంగ గజాల నదియ

మోహమున జన్మ - జన్మచే మోహ మగును
చక్ర భ్రమణంబు వలె, మృతి జన్మ గలుగు
మాయచే మోహ వశుడగు, మాయదాటి
ముక్తి నొందగ దేవియే శక్తి నొసగు

ఆకట్టుకునే పద్యాలు ఇలాంటివెన్నో ఇందులో ఉన్నాయి. చదవండి శ్రీ దేవీ భాగవతము.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML