What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 26 September 2014

విజయవాడ లో అమ్మవారు మూడవ రోజున గాయత్రి దేవిగా దర్శనము ఇస్తుంది.



ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైస్తీక్ష్ణైః
ర్యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్!
గాయత్రీం వరదాభయాం కుశకశాః శుభ్రం కపాలంగదాం
శంఖం చక్ర మధారవింయుగళం హస్తైర్వహన్తీం భజే!!

విజయవాడ లో అమ్మవారు మూడవ రోజున గాయత్రి దేవిగా దర్శనము ఇస్తుంది.....ఒకే దేవి కి ఇన్ని రూపాలు.....ఇన్ని రూపాలు ఆ జగదంబవే,,,,,అనే భావన కలగడానికి ఎర్పాటు చేసిన విధానం ఈ దేవి నవరాత్రులు... సకల వేద స్వరూపం గాయత్రి దేవి ! భారత దేశములో వేద కాలం నుండి ఆసేతు హిమాచల పర్యంతం, ఉపాశ్యా దైవం శ్రీ గాయత్రి పరదేవత. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి ! ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, గద, అంకుశం ధరించి దర్శన్మిస్తుంది. ఆది శంకరులు గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపిణి గా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగాను, మధ్యాన్న కాలంలో సావిత్రి గాను ఈమే ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ఈమే వేదాలకు తల్లి కనుక వేదమాత అని, జగదంబికా అని, సర్వజనులకు సృష్టి, స్తిథి , సమ్హార కర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గాయత్రి పరదేవతకు అవయవాలుగా వర్ణించారు. శృతి గాయత్రి స్వరూపాన్ని " అగ్నిర్ముఖం, బ్రహ్మ శిరః, విష్ణు హృదయం, రుద్రశికః" అని చిత్రించింది. ముఖం లో అగ్ని, శిరశ్శు లో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.ఇట్టి మహిమాన్వితమైన , సర్వొత్కృష్టమైన దైవతమును బ్రహ్మాది దేవతా శ్రేష్టులు, వేదాధిష్ఠాన దేవతలైన పురుషులను, ఈ అమ్మను త్రికాల సంధ్యలలో భక్తి తో ఉపాసిస్తు ఉంటారు అని చెప్తోంది దేవి భాగవతం. గాయత్రి...అంటే ....ప్రాణ శక్తిని రక్షించేది... లలిత సహశ్రనామం లో.."గాయత్రి వ్యాహౄతి సంధ్యా నిజబృంద నిషేవితా..." గాయత్రి అనగానే అందరు గాయత్రి మంత్రము అని అనుకుంటారు కాని అది శాస్త్రము పైన ఎక్కువ అవగాహన లేని వారి మాట... అస్సలు గాయత్రి అంటే...సంధ్యా సమయములో ఆరధించే శక్తి పేరు గాయత్రి.....శాస్త్రం ప్రకారం సంధ్యా సమయములో మనము ఆరాధించే శక్తి పేరు గాయత్రి..ఇది ఇక్కడ ప్రధానము...శాస్త్రము ప్రతిపాదించిన జగదంబ శక్తిని త్రిసంధ్యలలో ఉపాసన చేస్తే అదే గాయత్రి ! అస్సలు మనము సంధ్యా సమయములో ఏ మంత్రము పఠిస్తే అదే గాయత్రి అవుతుంది...మంత్రోపదేశం జరిగిన వారు సంధ్యవేళలో ఆ మంత్రాన్ని జపిస్తే అదే గాయత్రి...మంత్రోపదేశం జరగని వారు....ఎదైన స్తోత్రము లలితా సహస్రనామం అలాంటివి చదివినా గాయత్రి అవుతుంది..అలాగ త్రిసంధ్యలలో చెయ్యాలి...అలాగే ఉపనయనం అయిన వారు తప్పనసరిగా గాయత్రి జపం త్రిసంధ్యలలో చేసి తీరాలి... ప్రతి నిత్యము ఓంకారం స్మరించటము వలన , కీర్తించడం వలన, ఆలకించడం వలన, జపించడం వలన జనులు పరబ్రహ్మమును పొందుతున్నారు ఓం అనే శబ్దానికి అక్షర రూపం 'అ కార +' ఉ కార + 'ం కారము . ఓఒ అనే అక్షరం త్రిమూర్త్యతమకం. సృష్టి, స్తిథి ,లయలకు సంకేతం ఓంకారంలోని మూడు అక్షరాలతో సరిసమానమైనది గాయత్రి మంత్రము. ఈ గాయత్రి మంత్రము మూడుపాదాలకు కలదై , ఇరవై నాలుగు అక్షరాలతో, ఇరవై నాలుగు తత్వాలకు సంకేతముగా భాసిస్తు జపధ్యానాదులతో తనని స్మరించే వారిని రక్షిస్తోంది. గాయత్రి మంత్రంలోని మొదటి పాదం ఋగ్వేదం నుండి, రెండో పాదం యజుఋవేదం నుండి, మూడవ పాదం సామవేదం నుండి గ్రహించబడి ' ఓం ' కారంలోని అకార, ఉకార, మకారములకు ప్రతిరూపముగా భాసిస్తున్నాయి. గాయత్రి అంటే ఙ్ఞానస్వరూపిణి....ఆవిడ వేద మాత.......విద్ అనే ధాతువు నుండి వేదము అనే శబ్దము వచ్చింది...అంటే ఙ్ఞానరూపిణి అయిన అమ్మవారిని ఆరధన చేస్తాము..గాయత్రి ఉపాసన లో ...మన శ్వాస తో ఆ మంత్రాన్ని ఉపాసించడం...అంటే మనలోని ప్రాణ శక్తిని ఉపాసన చెయ్యడము...సూర్యుడి మండలం లో శక్తిని ధ్యానిస్తు సాధన చెయ్యాలి..అదే గాయత్రి అవుతుంది..మౌనముగా జపించుకోవాలి ఇలాంటి మంత్రాలు...సబ్ద మంత్రాన్ని మౌనముగా జపిస్తేనె దాని ఫలితము... ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది . సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ ఙ్ఞానము కలుగుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజొవంతం అవుతుంది. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారయణ ఫలితాన్ని ఇస్తుంది.ఈ మంత్రాన్ని కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారు మాత్రమే చేయాలి. గాయత్రి స్వరూపముగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML