నవ రాత్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ, ఇందులో నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగం. నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు మరియు పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
దసర (విజయ దశమి) గురించి చిన్న కథ:
ఒకానొకప్పుడు, మహారాజైన ధృవసింధు వేటకు వెళ్ళినపుడు ఆయనను సింహం చంపివేసింది. యువరాజు సుదర్శనుడికి రాజ్యాభిషేకం చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ, మహారాణి లీలావతికి తండ్రి, ఉజ్జాయినీ రాజ్యానికి రాజయిన యుధజిత్తు, మరియు మహారాణి మనోరమకు తండ్రి, కళింగ రాజ్యానికి రాజయిన వీరసేనుడు తమ తమ మనవళ్ళ కోసం కోసల రాజ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కోరిక కలిగి ఉన్నారు. వాళ్ళు ఒకరితో మరొకరు యుధ్ధం చేసారు. యుధ్ధంలో రాజు వీరసేనుడు మృతి చెందాడు. మనోరమ యువరాజు సుదర్శనుడినీ, ఒక నపుంసకుడినీ తోడు తీసుకుని అడవిలోకి పారిపోయింది. వాళ్ళు ఋషి భరద్వాజుని ఆశ్రమంలో తలదాచుకున్నారు.
విజితుడయిన రాజు యుధజిత్తు, అప్పుడు కోసల రాజధాని అయిన అయోధ్యలో, తన మనుమడయిన శత్రుజిత్తుని పట్టాభిషిక్తుని చేసాడు. అతను ఆ తరువాత, మనోరమను ఆమె కొడుకునూ వెతుక్కుంటూ బయలుదేరాడు. తనను రక్షణ కోరిన వారిని అప్పగించనని ఋషి సెలవిచ్చాడు. యుధజిత్తు కోపోద్రిక్తుడయ్యాడు. అతను ఋషిపై దాడి చేద్దామని అనుకున్నాడు. కానీ, అతని మంత్రి అతనికి ఋషి యొక్క వ్యాఖ్యకు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. యుధజిత్తు రాజధానికి వెనుదిరిగాడు.
యువరాజు సుదర్శనుడిని అదృష్టదేవత వరించింది. తపస్వి కుమారుడు ఒక రోజు వచ్చి, నపుంసకుడిని తన సంస్కృత నామమయిన క్లీబ అన్న పేరుతో పిలిచాడు. యువరాజు మొదటి శబ్దమయిన క్లిను పట్టుకుని దానిని క్లీం అని సంబోధించడం మొదలు పెట్టాడు. ఆ అక్షరం చాలా శక్తిమంతమయిన, పవిత్రమయిన మంత్రం. అది దేవీ మాతకు బీజాక్షరం (మూల అక్షరం). యువరాజు ఈ అక్షరాన్ని మాటిమాటికీ పలకడం వలన అతనికి మనశ్శాంతి, దేవి మాత యొక్క అనుగ్రహం కలిగింది. దేవి అతనికి దర్శనం ఇచ్చి, ఆశీర్వదించి, అతనికి దైవికమైన ఆయుధాలను మరియు ఎప్పటికీ తరిగిపోని అంబులపొదినీ వరంగా ఇచ్చింది.
వారణాసి యొక్క రాజదూతలు ఋషి ఆశ్రమం గుండా పయనించినపుడు ఉదాత్తమైన యువరాజు సుదర్శనుడిని చూసి, అతనిని వారణాసి రాజు కుమార్తె అయిన యువరాణి శశికళకు వరుడిగా ప్రతిపాదించారు.
యువరాణి తన వరుడిని ఎన్నుకునే స్వయంవరం ఏర్పాటు చెయ్యబడింది. శశికళ వెంటనే సుదర్శనుడిని వరించింది. వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. ఆ పెళ్ళిలోనే ఉన్న రాజు యుధజిత్తు, వారణాసి రాజుతో యుధ్ధం చేయడం మొదలు పెట్టాడు. దేవీ మాత సుదర్శనుడునీ అతని మామనీ రక్షించింది. యుధజిత్తు ఆమెను హేళన చేసాడు, దానితో వెనువెంటనే దేవీ మాత అతనినీ అతని సైన్యాన్ని బూడిదగా మార్చింది.
అప్పుడు సుదర్శనుడు, తన భార్య మరియు మామతో కలిసి దేవిని స్తుతించాడు. దేవి అతి ప్రసన్నురాలై, వారికి తనని హోమంతో ఇతర సాధనాలతో వసంత నవరాత్రులపుడు పూజించమని ఆదేశించింది. తరువాత ఆమె మాయమయ్యింది.
యువరాజు సుదర్శనుడు మరియు శశికళ ఋషి భరద్వాజుని ఆశ్రమానికి వెనుదిరిగి వచ్చారు. ఋషిపుంగవుడు వారిని ఆశీర్వదించి సుదర్శనుడిని కోసల రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు. సుదర్శనుడు మరియు శశికళ ఇంకా ఆమె తండ్రి అయిన వారణాసి రాజు తుచ తప్పకుండా దేవి మాత యొక్క ఆదేశాలను పాటించి ఆమెకు వసంత నవరాత్రులలో అద్భుతరీతిలో పూజలు జరిపారు.
సుదర్శనుడి వారసులయిన, శ్రీ రామ లక్ష్మణులు కూడా శరన్నవరాత్రులలో, దేవిని పూజించి, ఆమె సహాయంతో సీతను తిరిగి తేగలిగారు.
శ్రీ దుర్గా మాత అలంకారాలు
క్ర.సం థితి అలంకారం అలంకార ప్రాముఖ్యత చిత్రపటము
1) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి రోజు శ్రీ చక్రం లో మొదటి దేవత అయిన శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారం.
శ్రీ బాలా దేవి పవిత్ర శ్రీ చక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత.
శ్రీ బాలా మంత్రం సమస్త దేవి మంత్రాలన్నింటిలోకి మహిమాన్వితమైనది.
శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిని ధ్యానిస్తే దుర్గామాత సంతోషిస్తుంది.
శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి
2) ఆశ్వయుజ శుద్ద విదియ రోజు సకల మంత్రాలకి మూల శక్తి, వేద మాత గాయత్రి అలంకారం
ముక్తా విద్రుమ హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది.
సంధ్యావందన అధి దేవత
గాయత్రి మంత్రం రెండు రకాలు
లఘు గాయత్రి మంత్ర్తం
బృహద్గాయత్రి మంత్రం
ప్రతీ రోజు త్రిసంధ్యా సమయాల్లో వేయి సార్లు గాయత్రి మంత్రమ్ ని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది.
శ్రీ గాయత్రీ దేవి
3) ఆశ్వయుజ శుద్ద తదియ రోజు మంగళ ప్రద దేవత శ్రీ మహా లక్ష్మి దేవి అలంకారం
అష్ట రూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత
రెండు చేతులలో కమలాలని దరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తు, పద్మాసనిగా దర్శనమిస్తుంది.
ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలు దరించింది. అ ఆదిపరాశక్తి రూపంగానే మహ లక్ష్మి అలంకారం.
శ్రీ మహా లక్ష్మీ దేవి
4) ఆశ్వయుజ శుద్ద చవితి నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
అన్నం జీవుల మనుగడకు ఆదారం.
జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధి నాయకుడు విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది.
శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి
5) ఆశ్వయుజ శుద్ద పంచమి రోజు త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం.
త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలవబడుతుంది.
శ్రీ చక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత.
ఆది శంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్థించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా "చండీదేవి" గా పిలవడేది
ఆది శంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్థించాక పరమశాంత రూపిణిగా లలితా దేవి గా పిలవబడుతుంది.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
6 ఆశ్వయుజ శుద్ద సప్తమి రోజు చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం
త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వ్తతీ దేవి
సరస్వతీ దేవి సప్త రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది.
అవి:
చింతామణి సరస్వతి
జ్ఞాన సరస్వతి
నిల సరస్వతి
ఘట సరస్వతి
కిణి సరస్వతి
అంతరిక్ష సరస్వతి
మరియు
మహా సరస్వతి.
మహా సరస్వతి దేవి శుంభనిశుంభులనే రాక్షసులను వధించింది.
శ్రీ మహా సరస్వతీ దేవి
7 ఆశ్వయుజ శుద్ద అష్టమి రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం
రురుకుమారుడైన "దుర్గముడు" అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని "దుర్గా" అని పిలిస్తారు.
శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు, దుర్గా సహస్ర నామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలు తో పూజిస్తారు. ఎందుకంటే లలితా రూపం పరమ శాంత రూపం కనుక.
శ్రీ దుర్గా దేవి
8 ఆశ్వయుజ శుద్ద నవమి (మహర్ణవమి) రోజు మహాదుష్ట సంహారిణి శ్రీ మహిషా సుర మర్థినీ దేవి అలంకారం
మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇదే.
సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు.
సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది.
శ్రీ మహిషాసుర మర్థిని దేవి
9) ఆశ్వయుజ శుద్ద దశమి రోజు. శ్రీ చక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం
అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను "అపరాజిత" అంటారు.
ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి "విజయ" అని కూడా అంటారు.
శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకము పై ఆసీనురాలై ఉంటుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment