What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 26 September 2014

తొమ్మిది రాత్రులు/తొమ్మిది రోజులు కూడాను వివిధములైన పారాయణ క్రమాలున్నాయి

తొమ్మిది రాత్రులు/తొమ్మిది రోజులు కూడాను వివిధములైన పారాయణ క్రమాలున్నాయి. కేవలం నిత్యం చేసే షోడశార్చనలే కాకుండా పరివార దేవతలను అర్చించడం ఒకటి; పారాయణలొకటి చేస్తారు ఇక్కడ. ఈ పారాయణలు రకరకాలున్నాయి. అమ్మవారియొక్క దివ్య చరిత్రములు ఏవైతే గ్రంథములయందున్నాయో వాటిని పారాయణం చేయడం ఉన్నది. అలా పారాయణ యోగ్యమైన గ్రంథములు రెండు కనబడుతున్నాయి మనకి. ౧. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితోపాఖ్యానం. ఇది ఒక ప్రత్యేకమైన విధి. అయితే ఇది ఎక్కువగా వ్యాప్తిలో లేనప్పటికీ కూడా అనేక చండీ పారాయణలతో సమానము అంటారు. ౨. చండీ పారాయణ. ఇది చాలా ప్రసిద్ధి. భారతదేశం ఆసేతు సీతాచలం కూడా ఈ చండీ సప్తశతి పారాయణ జరుగుతూ ఉంటుంది. దీనిని దుర్గాసప్తశతి అని కూడా అంటారు. దేవీ సప్తశతి అని కూడా అంటారు. దీని పారాయణ చాలా విశేషము. ఇది మొత్తం పదమూడు అధ్యాయాలతో ఉంటుంది. ఇందులో అమ్మవారియొక్క చరిత్రలు మూడు ఉంటాయి. వాటి ప్రకారంగా మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ చరిత్రలు అంటారు. మధుకైటభ సంహారం చేసినటువంటి శక్తి మహాకాళి అయితే మహిషాసురమర్దిని మహాలక్ష్మిగా చెప్పబడుతోంది. శుంభనిశుంభాదులను సంహరించిన తల్లి పేరు మహా సరస్వతి. మహాకాళీ, మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణియైన దుర్గ అని అర్థం. ఈ మూడు రూపాలతోనే దుర్గ ఉన్నదా? నిజానికి. ఎన్నో రూపాలు ధరించినది. దేవీ మహాత్మ్యం చివరిలో ఆ తల్లే భ్రామరీ అని, నందా దేవి అని, భీమాదేవి అని రక్తదంతిక అని, ఇత్యాది పేర్లతో చెప్పబడుతూన్నది. భ్రమరాంబిక కూడా దుర్గయొక్క స్వరూపమే. ఇలా వివిధ రూపములతో అమ్మవారు అసురసంహారం చేశారు. అసురసంహారం అంటేనే దుష్టత్వాన్ని పారద్రోలడం అని దీనియొక్క ప్రధానమైన భావం. బాధించేదే అసురత్వం. ప్రపంచాన్ని బాధించేది అసురత్వం. ఈ బాధాకర శక్తులు రెండు రకాలుగా ఉంటాయి. మనలో మనల్ని బాధించేవి కొన్ని అయితే మనచుట్టూ ఉన్న సమాజాన్ని బాధించేవి కొన్ని. ఈ దుష్టత్వాన్ని ఒక్కొక్కప్పుడు మనం నియంత్రించలేం. మనలో దుష్టత్వం తెలుస్తున్నా మనం నియంత్రించలేం. సమాజంలో దుష్టత్వం కనపడుతూన్నా నియంత్రించలేం. నియంత్రించడానికి ఆ జగదంబను ప్రార్థించవలసిందే. అందుకే దేవతలందరూ కూడా లోకకళ్యాణానికి విఘాతం కలిగినప్పుడు అమ్మవారిని ఆరాధన చేస్తే “దేవానామ్ కార్యసిద్ధ్యర్ధం ఆవిర్భవతి సా యదా” అన్నారిక్కడ. దేవ కార్యముల కోసమే ఆవిడ వివిధ రూపములు ధరించి వచ్చినది. అలా వచ్చి ఆవిడ చేసిన సత్కార్యములన్నీ ఆవిడ కారుణ్య భావ ప్రకటనలే. ఆవిడ లీలలను మననం చేయాలి. నవరాత్రులూ కూడా అమ్మ నామాన్ని స్మరించడమూ, అమ్మ స్తోత్రములు పఠించడమూ, అమ్మ కథను పారాయణ చేసుకోవడమూ ఇలా మనస్సంతా దేవీమయం అయిపోవాలి. అప్పుడు అది సరియైన ఉపాసన అవుతుంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML