మలి మూడు రోజులు : లక్ష్మి పూజ
దుర్గాదేవి ఆరాధనతో మలినమైన వాసనలు, చెడుస్వభావాలు, పాత అలవాట్లు లాంటి వ్యతిరేక గుణాలను నిర్మూలించే ప్రయత్నంలో సఫలీకృతుడవు కాగానే... నాశనం అయిన ఆ అసురగుణాల స్థానంలో సకారాత్మక గుణాలను, ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం నీ తక్షణ కర్తవ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టీకరించిన దైవీ సంపదలను ఆర్జించుకోవాలి. జ్ఞానరత్నమనే అపూర్వమైన మణిని, ఆధ్యాత్మిక సంపదను సముపార్జన చేయాలి. శ్రద్ధాసక్తులతో ప్రతిపక్ష భావనను అలవరచుకునే ప్రయత్నం చేయని పక్షంలో పూర్వపు అసురీ గుణాలు మళ్లీ మళ్లీ తలెత్తుతాయి. అందుకే సాధకుడి అభ్యాసదశలో పూర్వ దశ ఎంత విలువైనదో, ఈ దశకూడా అంతే విలక్షణమైంది. తొలిదశ మలిదశల మధ్య ముఖ్యమైన తేడా వుంది. తొలిదశలో మలినమైన, అహంకార పూరిత హీనస్వభావాలను నిరంకుశంగా, నిశ్చయాత్మక బుద్దితో నిర్మూలన చేస్తే, మలిదశలో క్రమబద్ధంగా, కృత నిశ్చయంతో, దృఢంగా, ప్రశాంతంగా, పవిత్రమైన నిర్మలత్వాన్ని వృద్ధి చేసుకోవడం, మహాలక్ష్మి ఆరాధన ద్వారా సాధకుడి, సాధనలో వుండే ఆనందమయ దశ వ్యక్తీకరణ జరుగుతుంది. మహాలక్ష్మి తన భక్తులకు అనంతమైన దైవీ సంపదలను ప్రసాదిస్తుంది. సంపదలను ప్రసాదించే బ్రహ్మస్వరూపమే మహాలక్ష్మి. ఆమె అత్యంత నిర్మలం. రెండవ దశలో మూడు రోజులపాటు లక్ష్మి ఆరాధన జరుగుతుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment