What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 28 September 2014

ద్వాదశ జ్యోతిర్లింగాలు – 10. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము (నాసిక్ కు 30 కి.మీ.లో త్రయంబకేశ్వరం - మహారాష్ట్ర)

ద్వాదశ జ్యోతిర్లింగాలు – 10. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము (నాసిక్ కు 30 కి.మీ.లో త్రయంబకేశ్వరం - మహారాష్ట్ర)

శ్లో.
సహ్యాద్రిశీర్షే విమలే వసం తం, గోదావరీ తీర పవిత్ర దేశే |
యద్దర్శనాత్ పాతకమాశు నాశం, ప్రయాతి తం త్ర్యంబకమీశ మీడే ||

నిర్మలమైన సహ్యపర్వత శిఖరం మీద, గోదావరి తీర ప్రదేశంలో నివసిస్తూ, దర్శన మాత్రము చేతనే పాపములను పోగొట్టే త్ర్యంబకేశ్వరుని పొగుడుచున్నాను.

ఇక్కడి అమ్మవారి పేరు త్ర్యంబకేశ్వరి.

సప్తర్షులలో (గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అత్రి, విశిష్ఠుడు, కశ్యపుడు, జమదగ్ని) ఒకడైన గౌతమ మహర్షి తన భార్యతో అహల్యతో కలిసి సహ్య పరవతముపై గల బ్రహ్మగిరిపై తపస్సుచేసుకొంటు ఉండేవాడు. ఒకప్పుడు దేశమున భయంకరమైన కరవు పరిస్థితి ఏర్పడింది. ప్రజలు, పశుపక్ష్యాదులు త్రాగటానికి కూడ నీరులేక, పంటలులేక నానా బాధలు పడుతుండేవారు. తినడానికి లేనివారు యజ్ఞయాగాదులు ఏమిచేయగలరు? అందువలన హవిస్సులు అందని దేవతలు కూడ ఇబ్బంది పాలయ్యారు. ఆ పరిస్థితిని దయార్ద్ర హృదయుడైన గౌతముడు చూసి బాధపడి వర్షములు కొరకై వరుణదేవుని గూర్చి తపస్సుచేసి, వరుణదేవుని నుండి తాను త్రవ్విన గోతిలో ఆక్షయముగా నీరుండునట్లు వరంపొందాడు. గౌతముడు మూరెడు లోతున ఒక కుండమును త్రవ్వాడు. వరుణుని వారము వలన అది నీటితో నిండి, ఎంత వాడినను తరగకుండ నీరు నిలిచినది. అది తెలిసిన ఋషిగణములు భార్యా పిల్లలతో గౌతమ ఆశ్రమ స్థలమును చేరి పర్ణశాలలను నిర్మించుకొని తపస్సు, యజ్ఞ-యాగాదులతో కాలం వెళ్ళబుచ్చసాగారు.

గౌతముని గాయత్రీ మంత్ర ప్రభావముతో సద్యోజాత ఫలితముగా విత్తనము వేసిన వెంటనే మొక్క మొలచి కాపు కాచేవి. అందువలన, తన దగ్గర చేరినవారందరికి కరువు బారిన పడనీయకుండా కాపాడేవాడు మరియు దేవతలకు క్రమం తప్పకుండా హవిస్సులు అందుతూ ఉండేవి. దేవతలు గౌతముని దయార్ద్రభావానికి, తపోప్రభావానికి మెచ్చుకొనుట తోటివారు అసూయచెంది, గౌతముని ఎలాగైన కించపరచాలని యెంచి, ఒక అవును సృష్టించి గౌతముడు వేసిన పంటపొలము పైకి పంపగా, అది పంటను తినుట చూసి, గౌతముడు ఒక దర్భ (గడ్డి) పుల్లతో ఆ అవును బయటకు తోలుటకు అదిలింప ప్రయత్నింప ఆ ఆవు చనిపోయింది. దాంతో వారు గౌతమునికి గోహత్య పాపమంటినదనీ, దానిని నివారించుకొనుటకు గిరిప్రదక్షణములు చేయుచు, ఇష్వరునికై తపస్సు చేసి, ఆ ప్రదేశమునందు ఒక నది ప్రవహించునటుల జేసిన ప్రాయశ్చిత్తముగునని చెప్పిరి. వారి మోసమును గ్రహించిన గౌతముడు, ఆ సహ్యాద్రి పర్వతమునకు ప్రదక్షిణములు చేయుచు, ఈశ్వరునిఐ తపమాచరించెను. నిస్వార్థపూరితమైన గౌతముని తపస్సుకు మెచ్చి, తనక్కడ జ్యోతిర్లింగమై వెలిసాడు మరియు దివ్యగంగ నదిగా ఇక్కడ ప్రవహిస్తుంది, ఇంకా అది గౌతమి అను పేరుతో పిలువబదుతుందని, గోహత్య నివారణకు తపస్సు చేయుటవలన, గోదావరి అను పేరున కూడా పిలువబడుతుందని వరములిచ్చాడు. తనని మోసముచేసిన వారిని శిక్షిస్తానని శివుడు అనగా, వారిని క్షమించమని గౌతముడు కోర, అతని విశాల మరియు ఔదార్య బుద్ధిని మెచ్చుకొని, గౌతముడు సప్తర్షులలో ఒకనిగా వెలుగొందుదువని ఆశీర్వదించుతాడు. అప్పుడు, గౌతముడు, తనని పలు కష్టముల పాలుజేసిన వారిని పిలిచి శపించబోగా, వారు తమ తప్పు తెలిసికొని, శరణు వేడగా, గౌతముడు జాలిపడి, ప్రతి నిత్యమూ తమ తమ విధులను క్రమం తప్పకుండా నెరవేర్చుమని, గాయత్రని ఉపాసించమని బోధించి, వారిని ఊరడించి, వదిలివేసెను. నాటినుండి గౌతముడు తపస్సుచేసిన ప్రాంతమున వెలిసిన జీవునికి త్రయంబకేశ జ్యోతిర్లింగమని, అక్కడినుంచి ప్రారంభమైన నదికి గొదావర లేక గౌతమి అను పేర్లు వచ్చాయి.

ఇక్కడికి దగ్గరలో గల పంచవటియందు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనవాసమునకు వచ్చి నివసించినట్లు చెబుతారు. ఇక్కడనే రామ కుండము, లక్ష్మణకుండమను పేర్లతో రెండు కుండములు ఉన్నాయి. సీతాకుందమను పేరుతోకూడా మరొక కుండము కలదు. దీనినే అహల్యాకుండమని, శారంగపాణి కుండమని కూడా వ్యవహరిస్తారు. సీతమ్మ తల్లిని రావణుడు ఇక్కడినుండియా అపహరించాడని, రామాయణం - పంచబటిలో వరుణానది ఒడ్డునగల ఇంద్రకుండములో స్నానము చేయుటచేత గౌతముని శాపమువలన ఇంద్రుని శరీరమున ఏర్పడిన వేలదిక్షిద్రముల (కన్నముల) వలన ఇంద్రుడు పూతాత్ముడయ్యెనని పురాణగాధ. ఇక్కడ గల అంచజాద్రి శిఖరమున ఆంజనేయుడు పుట్టాడని పురజనుల నమ్మకం.

చరిత్ర ::

త్ర్యంబక క్షేత్రమును గూర్చి చెప్పుకోవలసినంతటి విశేషాలేమీ లేవు. మరాఠా రాజ్యాన్ని పరిపాలించిన అనేకమంది రాజులు ఈ క్షేత్రాభివ్రుద్ధికి పాటుపడ్డారు. పీష్వా బాలాజీ బాజీరావు అనే రాజు త్ర్యంబకేశ్వరునికి ఆలయం కట్టించి ఈ క్షేత్రాభివృద్ధికి ఎంతో కృషి చేసాడు.

దర్శనీయ స్థలాలు ::

1. బ్రహ్మగిరిపై త్రిమూర్త్యాత్మకమనుటకు గుర్తుగా మూడు కునులతోనున్నా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము
2. గంగా ద్వారము
3. పావన కుండము
4. గౌతమ మహర్షి, అహల్యల పూజలందుకొన్న 108 శివలింగములున్న గుహ
5. సీతా-రామ-లక్ష్మణ ధనుష్కుండములు
6. సూర్య-చంద్ర-అశ్వనీ-హనుమత్కుండములు
7. పేష్వా కుండమున్న స్థలమున గోదావరి నదిలో వరుణ, సరస్వతి, గాయత్రి, సావిత్రి మరియు శ్రద్ధా అను అయిదు నదులు కలియుట.
8. ఖండోబా కుండము.
9. ఒక కుండము.
10. వైశంపాయన కుండము.
11. ఇంద్ర కుండము.
12. ముక్తేశ్వర కుండము. 13. మెదాతిథి
14. కోటి-అహల్య సంగమ తీర్థములు.

మందిరములు ::

15. గోదావరి మందిరము (గోదావరి పుష్కర సమయమున 12 సం.ల కొకసారి మాత్రమే తెరువబడి ఒక సంవత్సరం పాటు పూజలు నిర్వహింపబడతాయి).
16. బాణేశ్వర లింగము.
17. గణేశుడు.
18. శివుడు.
19. దేవి.
20. సూర్యుడు
21. విష్ణువు
22. శ్రీ కపాలేశ్వర మందిరం.
23. సంగమేశ్వరుడు
24. కనకేశ్వరుడు
25. కపోతేశ్వరుడు
26. త్రిభువనేశ్వరుడు
27. శ్రీవిసంధ్యా దేవి
28. కృష్ణ మందిరము.
ఊరిలోపల
29. లక్ష్మీ నారాయణ
30. శ్రీ రామ
31. పరశురామ
32. ఇంద్రేశ్వర
33. త్రిసంధేశ్వర
34. కాంచనేశ్వర
35. జలేశ్వర
36. బల్లాలేశ్వర
37. గౌతమేశ్వర
38. రామేశ్వర
39. ముకుందేశ్వర
40. కాశీ విశ్వేశ్వర
41. భువనేశ్వరీ త్రిభువనేశ్వర
42. గాయత్రీ
43. నీలాంబికా దేవి (పరశురాముని తల్లియగు రేణుకాదేవి అని చెబుతారు)
44. నీలకంఠేశ్వర
45. వరాహగుహ (సీతా-రామ-లక్ష్మణుల విగ్రహములు ఉన్నవి)
46. శ్రీ గోరఖ్ నాధుడు
భక్త జ్ఞానేశ్వరుని పెద్ద సోదరుడు శ్రీని వ్రుత్తినాధుడు ఈ క్షేత్రమున తపస్సు చేశాడట.

ఈ క్షేత్రమున ఆలయములకు దగ్గరలో వివిధ అంగడులు, ధర్మశాలలు, హోటళ్ళు ఉన్నాయి. అన్ని సదుపాయములు, వాహనము సౌకర్యములు లభిస్తాయి.

రైలు మార్గము:

చెన్నై / విజయవాడ - వరంగల్ - వాడి - షోలాపూర్ - పూనా - ముంబై - కళ్యాణ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
హైదరాబద్ - ఖాజీపేట్ - వాడి - షోలాపూర్ - పూనా - ముంబై - కళ్యాణ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
ఢిల్లీ - ఇటార్సీ - భూసవాల్ - జల్గాన్ - మన్మాడ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
విజయవాడ - రాజమండ్రి - విశాఖపట్నం - విజయనగరం - రాయపూర్ - నాగ్పూర్ - అకోలా - భూసవాల్ - జల్గాన్ - మన్మాడ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.

సమీప విమానాశ్రయము - ఓఝూడ్

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML