What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 26 September 2014

పూర్వం ఘూర్జర దేశంలో సౌరాష్ట్రికమనే పురాన్ని ఖడ్గబాహువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు

పూర్వం ఘూర్జర దేశంలో సౌరాష్ట్రికమనే పురాన్ని ఖడ్గబాహువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన వద్ద అరిమర్దనం అనే పేరు గల ఒక మహాశక్తివంతమైన ఏనుగు ఉండేది. ఒకనాడు ఆ ఏనుగు గొలుసులు తెంపుకొని, ఊరుమీద పడింది. ఊరి జనమంతా భయంతో కకావికలురై, పరుగులు తీశారు. మావటి కానీ, సైనికులు కానీ, రాజు కానీ దాన్ని నిలువరించలేకపోయారు.
అంతలో సరసుడు అనే బ్రాహ్మణుడు సరస్సులో స్నానం చేసి, గీతా శ్లోకాలను పఠిస్తూ అదే దారిలో వెళుతుండగా జనులంతా వద్దని వారించారు. కానీ అతడు వారి మాటలు వినిపించుకోకుండా, అలాగే శ్లోకాలు పఠిస్తూ, ధైర్యంగా ఆ మదగజాన్ని సమీపించి దాని శరీరాన్ని నిమరసాగాడు. వెంటనే ఆ ఏనుగు చిత్త విభ్రమం అంతా నశించి, ప్రశాంతంగా నిలబడి ఏదో ఆనందానుభూతిని పొందింది. ప్రజలంతా భయం వీడి ఆశ్చర్యచకితులయ్యారు. మావటి మామూలు పద్ధతిలో దానిని కట్టగలిగాడు.
ఇదంతా చూసిన రాజు, ఆ విప్రుని వద్దకు వెళ్ళి నమస్కరించి, ’మహానుభావా! మా ప్రజల ప్రాణాలు కాపాడారు. మీకు మేము సదా కృతజ్ఞులం. మహాత్మా! మీకు ఇంతటి అలౌకిక శక్తి ఎలా లభించిందో చెప్ప’మని అడిగాడు. అప్పుడు అతడు రాజుతో…
గీతాయాష్షోడశోధ్యాయ శ్లోకాన్కతిపయానహమ్!
జపామి ప్రత్యహం భూపతేనైతా స్సర్వ సిద్ధయః!!
“నేను ప్రతిదినం క్రమం తప్పకుండా భగవద్గీత పదునారవ అధ్యాయం పఠిస్తాను. ఆ శ్లోక పఠనం వల్ల నాకీ సిద్ధులు కలిగా’యని చెప్పాడు. అప్పుడు రాజు ఆ బ్రాహ్మణుణ్ణి అనేక విధాల సేవించి సత్కరించాడు. ఆయన వద్ద గీత షోడశాధ్యాయ ఉపదేశం పొందాడు. దాని ప్రభావంతో ఆ బ్రాహ్మణుడు పొందిన సిద్ధులన్నీ క్రమంగా రాజు కూడా పొందాడు. ఎంతటి కఠిన సమస్యనైనా పరిష్కరించగల ధైర్య సాహసాలను పెంచుకొని, భక్తి విశ్వాసాలతో గీతాపఠనం చేస్తూ పరమాత్మ పథం చేరుకున్నాడు.
పదహారవ అధ్యాయ (దైవాసుర సంపద్విభాగయోగం) పారాయణ వల్ల ధైర్య సాహసాలు లభించడమే కాక మోక్షపదం కూడా చేరవచ్చని తెలుస్తోంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML