ద్వాదశ జ్యోతిర్లింగాలు 11. కేదారేశ్వర జ్యోతిర్లింగము (కేదార్నాథ్, ఉత్తర ప్రదేశ్)
శ్లో.
మహాద్రి పార్శ్వేచ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగొద్యై, కేదారమీశం శివమేక మీదే ||
గొప్పదైన హిమవత్పర్వతము ప్రక్కన కొండ చరియ సమీపమున ఎల్లప్పుడు మునులచేత, దేవతలచేత, రాక్షసులు, యక్షులు, నాగులు మొదలగు వారిచేత పూజింపపడుచున్న మంగళ (శివం) కరుడగు కేదారేశ్వరుని పొగడుచున్నాను.
ఇక్కడి అమ్మవారి పేరు కేదారగౌరి.
పురాణగాధ ::
శ్రీ మహావిష్ణువు అంశలు (అవతారములు) గా నరనారాయణులు ధర్మదేవతకు కుమారులుగా జన్మించి హిమాలయ పర్వతం మీద ఉన్న అత్యంత శోభాయమానమైన కేదారశిఖరమున బదరికాశ్రమములో నివసిస్తూ లోక కళ్యాణార్థమై శివుని గురించి తపస్సు చేసారు. వేకువనే పుణ్య అందియైన మందాకినిలో స్నానముచేసి, పార్థివ లింగమును నిర్మించుకొని, మందాకిని జలములతో, పవిత్రమైన బిల్వ పత్రితో, వికసించిన తామరపూలతో మిక్కి శ్రద్ధతో శివుని పూజిస్తూ ఉండేవారు. వారి భక్తికి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమనగా, వారు "దేవా! మానవ కళ్యాణం కోసం మరియు శుభంకరం కోసం నివెల్లప్పుడు ఇక్కడనే ఉందు, నిన్ను దర్శించి, పూజించు భక్తులకు అక్షయప్రాప్తి కలిగేటట్లు వరమివ్వమని ప్రార్థించారు." అందుకనుగుణంగా పరమేశ్వరుడు, అక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగముగా వెలిశాడు.
ఈ లింగమును దర్శించి పూజించుటవలన అభీష్టములు సిద్ధించి, అచంచల శివభక్తి, మోక్షము లభిస్తాయి. కేదారేశ్వరుని భక్తులు కేదారమార్గమున మరణించిన ముక్తులగుడురని పురాణములు చెబుతున్నవి.
ఈ నరనారాయణుల తండ్రి 'ధర్ముడు' అను ధర్మమూర్తి, తల్లి దాక్షాయణి (దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకరు). వీరు శివుని గురించి తప్పస్సు చేస్తున్నప్పుడు, ఇంద్రుడు వారి తపమును భంగపరచ దలచి, అప్సరసలను పంప, నిష్ఠాపరులు, సత్త్వ సంపన్నులైన వారు, ఆ అప్సరసలను శపింపక, వారి అజ్ఞానమును తొలగించుటకు, నారాయణుడు తన తొడకొట్టి వారికంటే అందమైన 'మేనక' అను ఒక అప్సరసను సృష్ఠించి వారిని లజ్జితులను చేసి పంపారు.
చరిత్ర మరియు విశేషము ::
పురాణాలలో, ఇతిహాసాలలో ఈ క్షేత్రం గురుంచి వర్ణించబడింది. ఈ క్షేత్రము హిమ ప్రదేశములో ఉండుటవలన, మే నెలనుండి అక్టోబర్ నెల వరకు మాత్రమే ఈ ఆలయం తెరువబడియుంటుంది. అయితే అక్టోబర్ చివరలో గుడి తలుపులు మూసివేసే సమయంలో ఆ కేదారనధుని ముందు వెలిగించిన జ్యోతులు తిరిగి మే నెలలో తలుపు తెరిచేవరకు ఆరిపోకుండా జ్వలిస్తూనే ఉంటాయి. జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుని అస్తిత్వ ప్రభావమునకు ఇదొక మచ్చుతునక.
చుట్టుప్రక్కల చూడదగిన స్థలములు - ప్రయాణ మార్గములు ::
కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ నుండి మొదలవుతుంది. హరిద్వార్ లో కన్ఖల్, చండీదేవి, మానసాదేవి, భారతమాత మందిర్, సప్తర్షి మందిరం/ఆశ్రమం, హరికిపౌడి, ఇంకా ఎన్నో దేవాలయాలు మరియు ఆశ్రమములు. ఇక ఋషికేశ్ లో ఉన్న త్రివేణీఘాట్, లక్ష్మణ ఝూల, రాం ఝూల, రామ మందిరం, లక్ష్మణ మందిరం, భరత మందిరం, శత్రుఘ్న మందిరము, ఇంకా ఎన్నో పురాతన మందిరములు, ఆంధ్రా ఆశ్రమము, కైలాస ఆశ్రమము, శివానంద ఆశ్రమము, దయానంద ఆశ్రమము, టి.టి.డి. వసతి గృహము, దానికి ఇరుప్రక్కల వెంకటేశ్వర స్వామి మరియు మల్లికార్జున ఆలయాలు, చిన్న జీయర్ స్వామి ఆశ్రమం, వశిష్ట గుహ, అరుంధతి గుహ, ఓంకారేశ్వర ఆశ్రమము, ఇంకా ఎన్నో. ఇక బదరీనాథ్, ప్రక్కనే బ్రహ్మకపాలం, బ్రహ్మ కుడం, భీమగోదా, అల్మోర, తెహ్రీ గడ్వాల్ మరియు పౌడీ గడ్వాల్, దేవ ప్రయాగ, రుద్ర ప్రయాగ, కర్ణ ప్రయాగ, విష్ణు ప్రయాగ, గుప్త కాశి, తుంగనథ్, త్రిజోగి-నారాయణం, బదరికాశ్రమము, గౌరీ కుండము, బాల గణేష్, వ్యాస గుహ, గణేష్ గుహ, భీమ్ పుల్, సరస్వతి నది, యమునోత్రి, గంగోత్రి, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో.
అది శంకరాచార్య అంతర్ధానమయ్యింది ఇక్కడే. ఇప్పటికి ఆ గుహ ఉన్నది. ఆలయం వెనకాల మందాకిని నది జలపాతాలు, పాండవుల మరియు ద్రౌపది పాద చిహ్నాలు దర్శనీయములు.
హరిద్వార్-ఋషికేశ్ ల మధ్య రైలు, బస్సులు, వ్యాన్సు, టాక్సీలు, ఇంకా ఇతర రవాణా సదుపాయాలు చాలా కలవు.
ఋషీకేశ్ నుండి కేదార్నాథ్ కు సుమారు 250 కి.మీ. దూరం. మారగమధ్యములో పైన చెప్పిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. గౌరీకుండం నుంది కేదార్నాథ్ దూరం 14 కి.మీ.లు. ఇక్కడ నడక కాని, పోనీ (గుర్రం) కాని, లేల డోలీలలో గాని ప్రయాణం చేయవచ్చు. గౌరీకుండమ్ మరియు కేదార్నాథ్ మధ్యలో రామవాడి అనుకోట టీ, ఫలహారాలు దొరుకుతాయి. కేదార్ నాథ్ సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తున ఉంది. కేదార్ నాథ్ లో పూజా సామాగ్రి అమ్ము షాపులు, ధర్మశాలలు, కాటేజీలు, హోటల్సు, మొ. నవి కలవు. మొన్న వచ్చిన ఉప్పెనకు చాలమటుకు కొట్టుకు పోగా, వాటిని ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు. పూజారులు / పండ్ల తో స్వామిని తాకి పూజ / అభిషేకము ఏయించుకోవచ్చు.
రైలు మార్గము ::
హైదరాబాదు / చెన్నై / విజయవాడ - వరంగల్ - నాగపూర్ - ఇటార్సి - భోపాల్ - ఝాన్సీ - గ్వాలియర్ - ఆగ్రా - మథుర - డిల్లీ - మీరట్ - ముజఫర్ నగర్ - సహరన్ పూర్ - లక్సర్ - హరిద్వార్ - ఋషీకేశ్ - దేవ ప్రయాగ - రుద్ర ప్రయాగ - గుప్త కాశి - సోన్ ప్రయాగ్ - గౌరీకుండ్ - కేదార్ నాథ్.
సమీప విమానాశ్రమము :: డెహ్రాడూన్.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment