శ్రీరాముని గొప్పతనము
శ్రీరాముని గొప్పతనము
విజేతవ్యా లంకా, చరణ తరణీయో జలనిధిః
విపక్షః పౌలస్త్యః, రణభువి సహాయాశ్చ కపయహః |
పదాతిర్మర్త్యో 2 సౌ, సకలమవధీద్రాక్షసకులమ్
క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణైః ||
భావము :- తాను జయించవలసినది ఏదో సామాన్యమైన పట్టణాన్ని కాదు. లంకానగరాన్ని.
అది నూరుయోజనాల సముద్రానికి అవతల ఉంది. శత్రుదుర్భేద్యమైనది.
గెలవడంమాటఅటుంచి అసలు అక్కడకు చేరుకోవడమే అసాధ్యమైనపని.
సముద్రాన్ని దాటడానికి తనవద్ద ఎటువంటి ఉపకరణములు , అంటే
విమానములు , నౌకలు లేవు.పాదాలే శరణ్యం. ఒకవేళ చేరుకున్నా ,
శత్రువు సామాన్యుడు కాడు. రావణబ్రహ్మ. అత్యంత బలవంతుడు.
ప్రకృతినే శాసించినవాడు, తపోసంపన్నుడు,వరసంపన్నుడు,
అష్టదిక్పాలకులను అదుపులో పెట్టుకున్నవాడు. త్రిమూర్తులలో
ఇద్దరికి అత్యంత ప్రియమైనవాడు. బ్రహ్మగారికి స్వయానా మనుమడు.
శివుడికి అత్యంత ప్రియభక్తుడు,బ్రాహ్మణుడు, ప్రతిరోజూ 9 కోట్ల శివలింగాలకు
స్వయంగా అభిషేకంచేసేవాడు, వేదపండితుడు, 'ఘన' కు సృష్టికర్త. ఇతన్ని
యుద్ధరంగంలో జయించాలి. మామూలువాణ్ణికాదు. పోనీ తనకేమైనా యుద్ధరంగంలో
సహాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళాఅంటే, చంచలస్వభావంకల కోతులు.
పోనీ తనపరిస్థితి చూస్తే, 14 సం. నుండి సరైన నిద్రాహారములు లేనివాడు.
మామూలు రాజకుమారులకుండే అన్ని సౌకర్యములకు దూరమైనవాడు.
పినతల్లి వల్ల కలిగిన అవమానభారంతో, భార్యావియోగంతో మానసికంగా
గడ్డుస్థితిని ఎదుర్కొంటున్నవాడు. తనలాంటివాడే తమ్ముడు.
అయోధ్యనుండి ఎలాంటి సైనికసహకారం లేదు. ఇటువంటిస్థితిలో ఉన్న శ్రీరామచంద్రుడు,
ఈభూమిమీద రాక్షసుడనేవాడిని మిగల్చకుండా చంపేసాడు.
కాబట్టి మహాత్ములు తమ లక్ష్యాన్ని సాధించాలంటే, ఇతరుల సహాయంగాని,
ఉపకరణముల అవసరంగాని అవసరంలేదు. వాళ్ళు స్వయంగానే సాధించగలరు.
అందుకే శ్రీరామచంద్రుడు భగవంతుడయ్యాడు.
ఈ దృష్టితోనే మన పేరులో ఏదోఒకరకంగా 'రామ' అని చేరుస్తారు మన పెద్దవాళ్ళు.
ఈ శ్లోకం భోజరాజు సభలో ఒకపండితుడు ఆశువుగా చెప్పినది
No comments:
Post a Comment