What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 31 July 2013

నాటకం పండితపామర జనరంజకం. అసలీ ప్రపంచమే జగన్నాటకం. పరమేశ్వరుడు సూత్రధారి.

నాటకం పండితపామర జనరంజకం. అసలీ ప్రపంచమే జగన్నాటకం. పరమేశ్వరుడు సూత్రధారి.
ప్రపంచవ్యాప్తంగా నాటకానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. మంచినాటకమంటే ఎవరైనా ఆదరిస్తారు. ప్రపంచానికి ప్రతిబింబమే నాటకం.
నాటకం ఆడుతున్నాడంటారు. అంటే చెప్పదలచుకున్నది కళాత్మకంగా చెప్పుతున్నాడని అర్థం.
ప్రపంచనాటకాలలో కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలానిది' అగ్రస్థానం. అసలాయన దానిని భారతకథనుంచి కళా త్మకంగా సృష్టించాడు.
భారతదేశంలో సంస్కృత 'అభిజ్ఞాన శాకుంతలం' ప్రదర్శించే నాటక సంస్థ ఉండాలి. అగ్రనటులతో ఆ నాటకాన్ని చక్కగా తయారుచేయాలి. అపుడు ప్రపంచస్థాయిలో ఆ నాటకానికి అగ్రతాంబూలం అందుతుంది. అట్లాగే సంస్కృతంలో ఉన్న మహానాటకాలను అవసరమైతే రంగస్థల ప్రదర్శనకన ుకూలంగా మలచి తయారుచేయాలి. ఏ సంస్కృత నాటకాన్ని ప్రదర్శించినా భారతీయులకు అంతర్జాతీయ గౌరవం లభిస్తుంది. దీనికి కేంద్ర నాటక అకాడమీ, ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం.
అలాగే మన తెలుగు నాటకాలలో కూడా చిరకాలంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ పేరెన్నికగన్న నాటకాలు చాలా ఉన్నవి. సంప్రదాయనాటకాలుగా ప్రసిద్ధిచెందినవి.
హరిశ్చంద్ర, గయోపాఖ్యానం, పాదుకాపట్టాభిషేకం, పాండవోద్యోగం, పాండవవిజయం, ప్రతాపరుద్రుడు, వర విక్రయం, కల్యాశుల్కం, రాధాకృష్ణ కంఠాభరనం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీరామాంజనేయయుద్ధం, రామదాసు, తుకారం, పోతన మొదలైన నాటకాలు అనాదిగా ఈ తెలుగునాట ఆదరణ పొందుతూ వచ్చినవి.
అయితే ప్రజాదరణ ఎంత ఉన్నా ఆర్థిక వనరుల లోపం వల్ల సర్వాంగసుందరంగా, సర్వజనామోదకరంగా, సంప్ర దాయానికి ప్రతీకగా ప్రదర్శించే అవకాశాలు అంతగా లేవు.
నాటకాలకు నంది బహుమతుల పేరుతో, అవార్డుల పేరుతో లక్షలరూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తున్నది. గొప్ప విషయం, రంగస్థల సంబంధం ఉన్న అందరూ హర్షించదగ్గ విషయమే.
కాని రంగస్థలం నూతనోత్తేజాన్ని పొందాలి. యువతకు అది స్ఫూర్తికావాలి. ప్రదర్శన వారికి అందుబాటులో ఉంటే చూసిన వారిలో నూటికొకరయినా రాగలుగుతారు ఈ రంగానికి.
మన వరకు వస్తే తెలుగునాటక స్వరూప స్వభావాలు, అందులో పండినవారు, రాటుదేలిన నటీనటులు, ప్రయో క్తలు, భాషా పండితులు కలసి తెలుగునాటకాన్ని రూపొం దించాలి ఈనాటి ప్రదర్శన కోసం.
ప్రతి మండలంలోను ఆరుబయట రంగస్థలాలు ఏర్పడాలి. అన్ని ప్రాంతాలవారు వచ్చి అక్కడ ప్రదర్శనలివ్వాలి. ఆ ఇచ్చే ప్రదర్శనలు ప్రభుత్వ పక్షాన నిపుణులైన వారిచే తర్ఫీదు చేయించి ఒక స్థాయిన, ఆమోదస్థాయికి చేరుకున్న ప్పుడు ప్రదర్శనలివ్వాలి. అప్పుడు మండలస్థాయిలో, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలి. అవి నంది నాటకోత్సవ స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరు తనకున్న వ్యవధిలో అభిమానమున్నవారు ఎక్కువకాలం వెచ్చిస్తే తప్ప నాట కానికి న్యాయం చేయలేరు. ఏరకంగా నైతేనేం నాటక కళ కళ కళలాడాలి. ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, నాటక అకాడమీని కలుపుకున్న తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు లో కనీసం ప్రసిద్ధమైన నాటకాలనైనా సేకరించాలి.
నిపుణు లైన ఒక నటుడికి, ఒక తెలుగు పండితుని ఇచ్చి ఆనాటకాన్ని రంగస్థల ప్రదర్శనయోగ్యంగా తీర్చిదిద్ది ప్రదర్శన యోగ్యమైన విభావాన్ని అచ్చు వేయించి నాటక సమాజాలను అందుబాటులో ఉంచాలి. కొన్ని నాటకాలలో తప్పులు కోకొల్లలు అవి సరిచేయాలి. మండల స్థాయి అధికారులకు గ్రామాలలో అందుబాటులో ఉన్న నాటక ప్రతులను సేకరించమని చెప్పాలి. పాతకాలంనాటి ఫొటోలు, కరపత్రాలు, గ్రామఫోన్‌ రికార్డులు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం భద్రపరచాలి.
తెలుగువారు తెలుగునాటకాన్ని సమగ్రంగా అన్ని హంగులతో సిద్ధపరిచినాడు ఆ నాటకం కనీసం తెలుగునాట అంతా ప్రదర్శించవచ్చు.
నాటకాలు ఎంతో మంది వ్రాస్తున్నారు, వ్రాశారు అవి ఆనాటివి ఈనాటివి అన్నీ ప్రదర్శనకు నోచుకోలేదు. కారణాలు అనేకం.
నూరేళ్ల పైబడి కొన్ని నాటకాలే నిలచినాయి. వాటికి ఈనాడు ఆదరణ ఉంది. నాటకాలు, పద్యనాటకాలు, వచన నాటకాలు అని విడదీసి చెప్పనక్కరలేదు. సంప్రదాయ నాటకం అంటే చాలు. నటులు పద్యాన్ని పాడనక్కరలేదు. బళ్లారి రాఘవ, యడవల్లి సంగీత ప్రధానమైన రామదాసు, సారంగధర పోటీపడి నటించారు. ఇద్దరూ దుర్యోధనులు వేశారు. రాఘవ యముడు వేస్తే యడవల్లి సత్యవంతుడు వేశారు.
హావభావాలతోపాటు పద్యాలు పాటగా చక్కగా అన్నారు.
అట్లాగే గోవిందరాజుల సుబ్బారావు, నెల్లూరు నగరాజారావు మొదలైనవారు పాడకపోయినా మహానటులైనవారు. స్థానం నరసింహారావు అలవోకగా పద్యాన్ని పాడి మహానటులై తనకుతానే సాటి అనిపించుకున్నారు.
స్త్రీ పాత్రలో 'మీరజాల గలడా' అనే పాట శ్రీకృష్ణతులా భారంలో వ్రాసి తాను సత్యభామగా పాడి నేటికీ అందరినోట పలికించారు.
బందా, సి.యస్‌.ఆర్‌.వైవిధ్యంగల నటనతో పాటు పద్యా లలో తెలుగునాటకాన్ని సుసంపన్నం చేశారు.
దైతా గోపాలం, జొన్నవిత్తుల శేషగిరిరావు, తుంగల చలపతి రావు, ఉప్పులూరి సంజీవరావు, కపిలవాయి రామనాథ శాస్త్రి, రఘురామయ్య అత్యుద్భుతంగా పాడి ప్రేక్షకులను రసాంబుధిలో ముంచెత్తారు.
దొమ్మేటి సూర్యనారాయణ, వేమూరి గగ్గయ్య, గురజ నాయుడు, మద్దాలి శేషగిరిరావు, మాధవపెద్ది వేంకట్రా మయ్య తమ నటనతో మాటతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధు లను చేశారు.
బలిజేపల్లి లక్ష్మీకాంతం, పానుగంటి లక్ష్మీనరసింహారావు, కాళ్లకూరి నారాయణరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం కొప్ప రపు సుబ్బారావు, ఆత్రేయ, కొర్రపాటి మొదలగు మహా రచయితలు నాటకాలు ఉత్తమస్థాయిలో రచించారు.
మైలవరం కంపెనీ, మోతేవారి కంపెనీ, ఇమ్మానేని వారి కంపెనీ, ఆంధ్ర ఆర్టిస్టు అసోసియేషన్‌, అరుణోదయా నాట్య మండలి కంపెనీవారు, ఆంధ్రనాటక కళా పరిషత్‌ నందినాట కోత్సవాలు, ఎన్నో గొప్ప నాటకాలు ప్రదర్శించటానికి కారణ భూతులయ్యాయి.
ఎన్ని ఉన్నా 'శ్రీకృష్ణ రాయబారం' పేరుతో తిరుపతి వెంకటకవులు పాండ వోద్యోగం, కాళ్లకూరి నారాయణరావు చింతా మణి, బలిజేపల్లి లక్ష్మీకాంతం 'హరిశ్చంద్ర' నేటికీ అఖండమైన ప్రాచుర్యాన్ని పొందు తున్నాయి.
జాతి, భాష కళవల్ల జీవిస్తుంది.
కళదేశ సౌభాగ్యం

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML