గురు సేవతో సర్వదేవతా దర్శనం చేసుకున్న దీపకుడు.
దీపకుడు నైష్టిక బ్రహ్మచారి. అతడొకనాడు శాస్త్రాధ్యయనం చేస్తూండగా అందులో ఈ వాక్యాలు చదివాడు. "పతివ్రతా స్త్రీకి తన భర్తయే దైవం. పుత్రుడికి తన తల్లి దండ్రులే దేవతలు. శిష్యుడికి గురువు పరబ్రహ్మ స్వరూపం. గురుసేవకు మించిన తీర్థాలూ, వ్రతాలూ, ఉపవాసాలు ఏవీ లేవు."
అప్పటి నుంచి దీపకుని మనస్సులో గురువు నాశ్రయించి సేవా శుశ్రూషలు చేసి విద్య నేర్వాలనే కోరిక కలిగింది. గోదావరీ నదీ తీరాన ఆస్రమ౦లొ నివసిస్తున్న వేద ధర్ముడనే ఋషి వద్దకు వచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి 'అయ్యా! దయచేసి నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి" అని ప్రార్థించాడు". దీపకుని వినయ వచనాలకు సంతుష్టుడైన వేదధర్ముడు అతనిని శిష్యునిగా పరిగ్రహించాడు. దీపకుడు అనతి కాలంలోనే సకల శాస్త్రాలు ఆపోసనం పట్టి నిరంతరం గురుసేవలో నిమగ్నుడయ్యాడు.
ఆధ్యాత్మిక విద్యా తేజస్సుతో అలరారుతున్న దీపకుని చూచి సంతోషాతిశయముతో ఒకనాడు వేదధర్ముడు ఇలా అన్నాడు. "వత్సా!పూర్వజన్మలో నేను చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేశాను.ఇంకా రెండు పాపాలుమిగిలి ఉన్నాయి. అవి చాలా భయంకరమైనవి. కాశీకి వెళ్ళి వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. రెండింతలు సత్ఫలితాన్ని ఇవ్వగలదు. అయితే అప్పుడు నాకు కుష్ఠురోగం వస్తుంది. రక్తం చీము అంధత్వం కూడా సంభవిస్తుంది. సాధుత్వం నశిస్తుంది. కోపిష్టినవుతాను. అతి కఠోర౦గా వ్యవహరిస్తాను. ఈ దురవస్థలో నీవు నాకు సేవ చేయగలవా?"
అపార గురుసేవా దురంధరుడైన దీపకుడు సంతోషంతో ఇలా అన్నాడు "గురువర్యా! ఆ పాపాలను ఆవహి౦ప చేసికొని, ప్రాయశ్చిత్త దూపమైన అందత్వముతో కూడిన ఆ కుష్ఠు రోగాన్ని నేనే అనుభవిస్తాను" అని చెప్పాడు.
"నాయనా!ఎవరు చేసిన పాప కర్మలకు వారే బాధ్యులు. పాపాల్నిఅనుభవించడం అంత కష్టం కాదు.కానీ పాపపీడితునికి సేవ చేయడం ఉందే అది చాలా దుర్భరమైనది. సహనం మెండుగా ఉండాలి."అ న్నాడు గురువు. హర్షంతో అంగీకరించాడు దీపకుడు.
గురుశిష్యు లిద్దరూ కాశీకి వెళ్ళారు. మణికర్ణికా ఘాట్ కు ఉత్తరంగా కమలేశ్వర మహాదేవ మందిర సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. జగన్నాథుదిన విశ్వనాథునికీ, జగన్మాత అన్నపూర్ణాదేవికీ పూజార్చనలు చేసి పూర్వజన్మలో చేసిన ఆ రెండు పాపాలను ఆవాహన చేసుకున్నాడు దేవధర్ముడు. తత్ఫలితంగా కుష్ఠు రోగం, అంధత్వం వచ్చాయి. శిష్యుని పట్ల ఉండే వాత్సల్యం, అనురాగం. ఆప్యాయత నశించిపోయాయి. అసహనంతో చీటికీ మాటికీ చిటపట మాటలే వినవస్తాయి. గురువుగారి దైన్యాన్ని చూసి దీపకునికి ఏడుపు వచ్చింది. రక్తం చీము కారుతుంటే అసహ్యించుకోకుండా అంకితభావంతో సేవ చేస్తుండేవాడు. మలమూత్రాలను సైతం కడిగి ఉతికిన బట్టలను ధరింప చేసేవాడు. ప్రతి పూటా భిక్షాటనం చేసి గురువుకి పెట్టేవాడు. తెచ్చిన అన్నాన్నంతా మిగల్చకుండా తినేసి ఇంకా తెచ్చి పెట్టు అని గదమాయించేవాడు గురువు.
గురువు ఎంత తిట్టినా కోపం వచ్చేది కాదు. ధర్మ నిష్ఠతో విసుగు విరామం లేకుండా బ్రహ్మచర్య వ్రతంతో గురువుకు పరిచర్య చేయడం, విశ్వనాథ భగవానుని తపశ్చర్య అని భావన చేసి తన దినచర్యను కొనసాగించాడు దీపకుడు.
ఇదిలా ఉండగా ఒకరోజు గురువుగారు నిద్రిస్తున్నారు. ఉక్కపోతగా ఉంటే దీపకుడు ఆయనకు విసురుతున్నాడు. అప్పుడు దీపకుని సేవా తత్పరతకు సంతోషించిన పరమేశ్వరుడు ఒకరోజు ప్రత్యక్షమై 'వత్సా! నీ గురుసేవ అపారమైనది. ఏ వరం కావాలో కోరుకో" అన్నాడు. భగవంతుని దర్శనంతో ఆనందాశ్రువులు రాలాయి.
"సర్వేశ్వరా! ఈ ప్రపంచంలో నాకు ఒక్క గురువు తప్ప మరేమీ తెలియదు వారేమి ఆజ్ఞ ఇస్తే అదే చేస్తా. వారిప్పుడు నిద్రిస్తున్నారు. మేల్కొనగానే ఆయన్నదిగి వారు ఏం చెబుతారో దాన్ని కోరుకుంటాను" అన్నాడు దీపకుడు. విశ్వనాథుడు అంతర్ధానమయ్యాడు.
గురువుగారు మేల్కొనగానే జరిగినదంతా చెప్పి దీపకుడు "నేను శివుని వద్దకెళ్ళి మీకు స్వస్థత చేకూర్చమని వరం అడుగుతా" అన్నాడు. అందుకు వేదధర్ముడు ఒప్పుకోలేదు. ఇలా అన్నాడు. "చూడు నాయనా! చేసిన పాపకర్మలు వారు అనుభవిస్తేనే తీరుతాయి. అదే ప్రాయశ్చిత్తం అవుతుంది. అందులోనే తృప్తి ఉంది కనుక నా రోగ నివారణకై భగవంతుని వరం కోరవద్దు".
గురువుగారి ఆదేశం మేరకు దీపకుడు విశ్వనాథుని వరం కోరలేదు. విశ్వనాథుడు దీపకుని ఉన్నతమైన గురుభక్తి ప్రపత్తులకు మెచ్చుకొని పార్వతీ సమేతంగా శ్రీమన్నారాయణుడు, సమస్త బ్రహ్మాది దేవతలా సమేతంగా దీపకుడు ఉన్న చోటుకు వచ్చారు. దీపకుని గురుభక్తిని, సేవానిరతిని కొనియాడారు. నారాయణుడు "వత్సా! నీ మనోభీష్టం నెరవేరుస్తాం. వరం కోరుకో" అన్నాడు. దీపకుడు సాష్టాంగ వందనం చేసి గద్గద స్వరంతో "దేవదేవా! నేనెప్పుడూ మిమ్ములను స్మరించలేదు. అయినా నా పట్ల దయకలిగి సంతుష్టులై వరం కోరుకోమంటున్నారు." అన్నాడు.
"ఔను నాయనా! గురువు సమస్త దేవతా స్వరూపుడు. గురుభక్తి కలిగి ఉన్నవాడిపై దేవతలందరూ సహజంగా ప్రసన్నులవుతారు. కనుక ఏం వరం కావాలో కోరుకో" అని నారాయణుడు సెలవిచ్చాడు.
"అయితే, మహానుభావా! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించండి. అదే కదా! అన్ని దేవతార్చనలకు మూలము" అని ప్రార్థించాడు. దీపకుడు. "తథాస్తు" అన్నాడు నారాయణుడు.
గురువును భక్తితో సేవిస్తే సమస్త దేవతలను పూజించినట్లే.
అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు
దీపకుడు నైష్టిక బ్రహ్మచారి. అతడొకనాడు శాస్త్రాధ్యయనం చేస్తూండగా అందులో ఈ వాక్యాలు చదివాడు. "పతివ్రతా స్త్రీకి తన భర్తయే దైవం. పుత్రుడికి తన తల్లి దండ్రులే దేవతలు. శిష్యుడికి గురువు పరబ్రహ్మ స్వరూపం. గురుసేవకు మించిన తీర్థాలూ, వ్రతాలూ, ఉపవాసాలు ఏవీ లేవు."
అప్పటి నుంచి దీపకుని మనస్సులో గురువు నాశ్రయించి సేవా శుశ్రూషలు చేసి విద్య నేర్వాలనే కోరిక కలిగింది. గోదావరీ నదీ తీరాన ఆస్రమ౦లొ నివసిస్తున్న వేద ధర్ముడనే ఋషి వద్దకు వచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి 'అయ్యా! దయచేసి నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి" అని ప్రార్థించాడు". దీపకుని వినయ వచనాలకు సంతుష్టుడైన వేదధర్ముడు అతనిని శిష్యునిగా పరిగ్రహించాడు. దీపకుడు అనతి కాలంలోనే సకల శాస్త్రాలు ఆపోసనం పట్టి నిరంతరం గురుసేవలో నిమగ్నుడయ్యాడు.
ఆధ్యాత్మిక విద్యా తేజస్సుతో అలరారుతున్న దీపకుని చూచి సంతోషాతిశయముతో ఒకనాడు వేదధర్ముడు ఇలా అన్నాడు. "వత్సా!పూర్వజన్మలో నేను చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేశాను.ఇంకా రెండు పాపాలుమిగిలి ఉన్నాయి. అవి చాలా భయంకరమైనవి. కాశీకి వెళ్ళి వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. రెండింతలు సత్ఫలితాన్ని ఇవ్వగలదు. అయితే అప్పుడు నాకు కుష్ఠురోగం వస్తుంది. రక్తం చీము అంధత్వం కూడా సంభవిస్తుంది. సాధుత్వం నశిస్తుంది. కోపిష్టినవుతాను. అతి కఠోర౦గా వ్యవహరిస్తాను. ఈ దురవస్థలో నీవు నాకు సేవ చేయగలవా?"
అపార గురుసేవా దురంధరుడైన దీపకుడు సంతోషంతో ఇలా అన్నాడు "గురువర్యా! ఆ పాపాలను ఆవహి౦ప చేసికొని, ప్రాయశ్చిత్త దూపమైన అందత్వముతో కూడిన ఆ కుష్ఠు రోగాన్ని నేనే అనుభవిస్తాను" అని చెప్పాడు.
"నాయనా!ఎవరు చేసిన పాప కర్మలకు వారే బాధ్యులు. పాపాల్నిఅనుభవించడం అంత కష్టం కాదు.కానీ పాపపీడితునికి సేవ చేయడం ఉందే అది చాలా దుర్భరమైనది. సహనం మెండుగా ఉండాలి."అ న్నాడు గురువు. హర్షంతో అంగీకరించాడు దీపకుడు.
గురుశిష్యు లిద్దరూ కాశీకి వెళ్ళారు. మణికర్ణికా ఘాట్ కు ఉత్తరంగా కమలేశ్వర మహాదేవ మందిర సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. జగన్నాథుదిన విశ్వనాథునికీ, జగన్మాత అన్నపూర్ణాదేవికీ పూజార్చనలు చేసి పూర్వజన్మలో చేసిన ఆ రెండు పాపాలను ఆవాహన చేసుకున్నాడు దేవధర్ముడు. తత్ఫలితంగా కుష్ఠు రోగం, అంధత్వం వచ్చాయి. శిష్యుని పట్ల ఉండే వాత్సల్యం, అనురాగం. ఆప్యాయత నశించిపోయాయి. అసహనంతో చీటికీ మాటికీ చిటపట మాటలే వినవస్తాయి. గురువుగారి దైన్యాన్ని చూసి దీపకునికి ఏడుపు వచ్చింది. రక్తం చీము కారుతుంటే అసహ్యించుకోకుండా అంకితభావంతో సేవ చేస్తుండేవాడు. మలమూత్రాలను సైతం కడిగి ఉతికిన బట్టలను ధరింప చేసేవాడు. ప్రతి పూటా భిక్షాటనం చేసి గురువుకి పెట్టేవాడు. తెచ్చిన అన్నాన్నంతా మిగల్చకుండా తినేసి ఇంకా తెచ్చి పెట్టు అని గదమాయించేవాడు గురువు.
గురువు ఎంత తిట్టినా కోపం వచ్చేది కాదు. ధర్మ నిష్ఠతో విసుగు విరామం లేకుండా బ్రహ్మచర్య వ్రతంతో గురువుకు పరిచర్య చేయడం, విశ్వనాథ భగవానుని తపశ్చర్య అని భావన చేసి తన దినచర్యను కొనసాగించాడు దీపకుడు.
ఇదిలా ఉండగా ఒకరోజు గురువుగారు నిద్రిస్తున్నారు. ఉక్కపోతగా ఉంటే దీపకుడు ఆయనకు విసురుతున్నాడు. అప్పుడు దీపకుని సేవా తత్పరతకు సంతోషించిన పరమేశ్వరుడు ఒకరోజు ప్రత్యక్షమై 'వత్సా! నీ గురుసేవ అపారమైనది. ఏ వరం కావాలో కోరుకో" అన్నాడు. భగవంతుని దర్శనంతో ఆనందాశ్రువులు రాలాయి.
"సర్వేశ్వరా! ఈ ప్రపంచంలో నాకు ఒక్క గురువు తప్ప మరేమీ తెలియదు వారేమి ఆజ్ఞ ఇస్తే అదే చేస్తా. వారిప్పుడు నిద్రిస్తున్నారు. మేల్కొనగానే ఆయన్నదిగి వారు ఏం చెబుతారో దాన్ని కోరుకుంటాను" అన్నాడు దీపకుడు. విశ్వనాథుడు అంతర్ధానమయ్యాడు.
గురువుగారు మేల్కొనగానే జరిగినదంతా చెప్పి దీపకుడు "నేను శివుని వద్దకెళ్ళి మీకు స్వస్థత చేకూర్చమని వరం అడుగుతా" అన్నాడు. అందుకు వేదధర్ముడు ఒప్పుకోలేదు. ఇలా అన్నాడు. "చూడు నాయనా! చేసిన పాపకర్మలు వారు అనుభవిస్తేనే తీరుతాయి. అదే ప్రాయశ్చిత్తం అవుతుంది. అందులోనే తృప్తి ఉంది కనుక నా రోగ నివారణకై భగవంతుని వరం కోరవద్దు".
గురువుగారి ఆదేశం మేరకు దీపకుడు విశ్వనాథుని వరం కోరలేదు. విశ్వనాథుడు దీపకుని ఉన్నతమైన గురుభక్తి ప్రపత్తులకు మెచ్చుకొని పార్వతీ సమేతంగా శ్రీమన్నారాయణుడు, సమస్త బ్రహ్మాది దేవతలా సమేతంగా దీపకుడు ఉన్న చోటుకు వచ్చారు. దీపకుని గురుభక్తిని, సేవానిరతిని కొనియాడారు. నారాయణుడు "వత్సా! నీ మనోభీష్టం నెరవేరుస్తాం. వరం కోరుకో" అన్నాడు. దీపకుడు సాష్టాంగ వందనం చేసి గద్గద స్వరంతో "దేవదేవా! నేనెప్పుడూ మిమ్ములను స్మరించలేదు. అయినా నా పట్ల దయకలిగి సంతుష్టులై వరం కోరుకోమంటున్నారు." అన్నాడు.
"ఔను నాయనా! గురువు సమస్త దేవతా స్వరూపుడు. గురుభక్తి కలిగి ఉన్నవాడిపై దేవతలందరూ సహజంగా ప్రసన్నులవుతారు. కనుక ఏం వరం కావాలో కోరుకో" అని నారాయణుడు సెలవిచ్చాడు.
"అయితే, మహానుభావా! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించండి. అదే కదా! అన్ని దేవతార్చనలకు మూలము" అని ప్రార్థించాడు. దీపకుడు. "తథాస్తు" అన్నాడు నారాయణుడు.
గురువును భక్తితో సేవిస్తే సమస్త దేవతలను పూజించినట్లే.
అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు
No comments:
Post a Comment