పరబ్రహ్మమైన భగవంతుడు ఒక్కడే
నిరాకారుడు,
నిర్గుణుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు, అనంతుడు, సర్వాంతర్యామి, సర్వ
శక్తిమంతుడు, సర్వ సమర్ధుడు, పరమాత్ముడు, పరబ్రహ్మమైన భగవంతుడు ఒక్కడే.
కొన్ని కోట్ల సంవత్సరాల నుండి వేర్వేరు కాలాల్లో ఋషులకు, సిద్ధులకు,
యోగులకు, జ్ఞానులకు, ఉపాసకులకు, భక్తులు మొదలైన వివిధరకాల వ్యక్తులకు
వారివారి ఉపాసన స్థాయిని అనుసరించి భగవంతుడు అనేక రూపాల్లో దర్శనమిచ్చాడు.
ఇంకా వివరంగా చెప్పాలంటే వారి మనసు ఏ విధమైన రూపం మీద నిలబడుతుందో, వారి
మనసు ఏ విధమైన రూపాన్ని సులువుగా పట్టుకుంటుందో, వారు పరమాత్ముడిని ఏ
విధంగా ఊహించుకున్నారో ఆ విధమైన రూపంలోనే కనిపించాడు.
ఇలా మన
సంస్కృతిలో అనేక సంవత్సరాలుగా అనేక మంది ఒక భగవంతుడి యొక్క అనేక రూపాలను
దర్శించారు. మనకు ఉన్నది ఒక్కడే భగవంతుడు. "ఏకో విశ్వస్య భువనశ్చ
రాజాః"-ఋగ్వేదం 6.36.4 - ఈ సమస్త జగత్తుకు ఉన్న రాకు ఒక్కడే అని అర్దం.
మనకు కనిపించే ఈ దేవతలంతా ఈ భగవంతుడి యొక్క ప్రతి రూపాలు, ప్రతి బింబాలు.
అలా అని ఈ ప్రతి బొంబాలనే జీవితాంతం పూజిస్తూ ఉండమని సనాతన ధర్మం
చెప్పలేదు. ఈ ప్రతిబింబాలైన సగుణ సాకార రూపాల మీద మనసు నిలిపి సాధనతో
సర్వాతీతమైన నిరాకర రూపాన్ని దర్శించమని చెప్పింది.
సైకాలజీ
ప్రకారం మనకు ఏదైనా ఒక వస్తువు యొక్క రూపం గురించి కొంచం కూడా అవగాహన
లేకపోతే మన మనసు దాన్ని మీద నిలబడదు. అసలు దాని గురించి ఊహించుకోవడం కూడా
అసాధయం. అందుకే ముందు మన మనసు ఒక చిన్న రూపం మీద నిలబడితే, అప్పుడు సాధాన
ద్వారా పరుధుల్లేని పరమాత్ముడిని చేరుకోవచ్చు. అందరి ఇష్టాఇష్టాలు ఒకే
రకంగా ఉండవు కనుక ఒక్కొక్కరి మనసు ఒక్కో రూపాన్ని హత్తుకుంటుంది. అందుకే
మనకు వివిధ రూపాల్లో పరమాత్ముడు దర్శనమిస్తున్నాడు. అంటే మనం ఉన్నతమైన
స్థానాన్ని చేరుకోవడం కోసం దేవుడిని కూడా ఒక ఉపకరణంగా వాడుకుంటున్నాం. ఏ
రూపాన్ని పూజించినా అన్ని ఒక్కడికే చేరుతాయి.
No comments:
Post a Comment