ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం.
ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం.
సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం భక్తీ ప్రదానాయ
కృపావతీర్థం టం సోమనాథం శరణం ప్రపద్యే శ్రీశైల శృంగే విబూధాతింసంగే
తులాద్రితుంగే పి ముదావసంతం త మర్దునం మల్లికా పూర్వమేకం నమామి సంసార
సముద్ర సేతుం అవంతికాయం విహాతావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల
మృత్యో: పరిరక్షణానార్థం వందే మహాకాల మహాసురేశం కావెరికా నర్మదాయో: పవిత్రే
సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపరే వసంతమోంకార మీశం శివమేకమీడే
పూర్వోత్తరే ప్రజ్ఞ్వలైకా నిదానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురాధిత
పాదపద్మం శ్రీవైద్యనాథం టం మహం నమామి యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి
తాంగం వివిధైశ్చభోగై: సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం
ప్రపద్యే మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై:
సురాసురైర్యక్ష మహోరగాద్వై: కేదారమీశం శివమేకమీడే సహ్యాద్రిశీర్షే విమలే
వసంతం గోదావరీతీర పవిత్ర దేశే యద్దర్శనా
త్పాటకమశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే సుతాష్రపర్ణీ జలరాశియోగే
నిబధ్యసేతుం విషఖై రాసంఖ్యై: శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం
నియతం నమామి యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ సదైవ
భీమాది పడ ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి పానంద మానంద వనే వసంత
మాననందకందం హతపాపబృందం వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం
ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే జ్యోతిర్మయ ద్వాదశాలింగకానం శివాత్మనాం
ప్రోక్తమిదం క్రమేణ స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫ్లం తదాలోక్య నిజం
భాజేచ్ఛ జ్యోతిస్వరూపుడైన మహేశుడు
ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల
జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని
నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి .సముద్రపు ఒడ్డున రెండు
(బంగాళాఖాత తీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత
శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు,
సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన
ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర
లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన
త్రయంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన
విశ్వేశ్వరుడు), ఇలా మొత్తం పెన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ
లింగాలుపరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం
కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుటే కాలలింగము.
తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1 బ్రహ్మ, 2 మాయ, 3 జీవుడు, 4 మనస్సు, 5
బుద్ధి, 6 చిత్తము, 7 అహంకారము, 8 పృథ్వి, 9 జలము, 10 తేజస్సు, 11 వాయువు,
12 ఆకాశం ... ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ
ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథ లింగం ఈ
పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క
జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ వుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను
దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి.
పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు, కనీసం ఒక్క లింగాన్నైనా
దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దల వాక్కు.
No comments:
Post a Comment