What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 26 December 2013

ఆవు వెన్నతో మొలలు మాయం

ఆవు వెన్నతో మొలలు మాయం

గృహ వైద్యము - 2
ఆవు వెన్న

మొలలు లేదా ఆర్ష మొలలు : 
ఎక్కువగా సీట్లో కూర్చుని పనిచేసే వారికి వచ్చే సాధారణ వ్యాధి మొలలు లేదా ఆర్ష మొలలు. ఈ వ్యాధినే 'పైల్స్' అని కూడా అంటారు. ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే .. 
  • ఆవు వెన్న, నువ్వులు సమానంగా కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఒక వారం రోజులపాటు తినాలి. దీంతో మొలల వ్యాధి నశిస్తుంది.  
  • స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక టీ స్పూను తీసుకొని, ఒక గ్లాసు స్వచ్ఛమైన ఆవు పాలలో కలుపుకొని ప్రతిరోజూ త్రాగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే కొన్ని రోజులకు మొలలు రాలిపోతాయి.

అతి దాహం : 
ఒక్కొక్కసారి ఎన్ని నీళ్ళు త్రాగినను దప్పిక తీరని పరిస్థితి ఎందుర్కొంటాము. ఆ స్థితిలో.. 
దనియాలు

  • కొన్ని చలువ మిరియాలను నోటిలో వేసుకొని చప్పరిస్తుంటే అతిదాహం తగ్గుతుంది. 
  • దనియాలను కషాయముగా కాయాలి. ఆ కషాయాన్ని 20 20 20 నుండి 30 మి.లీ. తీసుకొని తగినంత పంచదార కలుపుకొని త్రాగాలి. దానితో అతిదాహం హరిస్తుంది.

అరుచి :  
కొంతమందికి ఎంత రుచికరమైన పదార్థం తిన్నా రుచిగా అనిపించదు. దీనినే అరుచి అంటారు. దానిని అధిగమించడానికి .. 
కరక్కాయ

  • ఉప్పు మరియు అల్లము కలిపి ప్రతిరోజూ భోజనం చేసేముందు తీసుకోవాలి. 
  • ఎండు ద్రాక్ష పండ్లు, కరక్కాయ మరియు కండ శర్కర  తీసుకొని మెత్తగా దంచి పొడి చేసి ఉంచుకోవాలి. ఈ పొడిని 2 నుండి 4 గ్రాముల వరకు గోరువెచ్చని నీళ్ళతో రోజుకు రెండు సార్లు తీసుకొంటూ ఉంటే నోట్లో అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగుతుంది.
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML