ఆవు వెన్నతో మొలలు మాయం
ఎక్కువగా సీట్లో కూర్చుని పనిచేసే వారికి వచ్చే సాధారణ వ్యాధి మొలలు లేదా ఆర్ష మొలలు. ఈ వ్యాధినే 'పైల్స్' అని కూడా అంటారు. ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే ..
- ఆవు వెన్న, నువ్వులు సమానంగా కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఒక వారం రోజులపాటు తినాలి. దీంతో మొలల వ్యాధి నశిస్తుంది.
- స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక టీ స్పూను తీసుకొని, ఒక గ్లాసు స్వచ్ఛమైన ఆవు పాలలో కలుపుకొని ప్రతిరోజూ త్రాగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే కొన్ని రోజులకు మొలలు రాలిపోతాయి.
అతి దాహం :
ఒక్కొక్కసారి ఎన్ని నీళ్ళు త్రాగినను దప్పిక తీరని పరిస్థితి ఎందుర్కొంటాము. ఆ స్థితిలో..
![]() |
దనియాలు |
- కొన్ని చలువ మిరియాలను నోటిలో వేసుకొని చప్పరిస్తుంటే అతిదాహం తగ్గుతుంది.
- దనియాలను కషాయముగా కాయాలి. ఆ కషాయాన్ని 20 20 20 నుండి 30 మి.లీ. తీసుకొని తగినంత పంచదార కలుపుకొని త్రాగాలి. దానితో అతిదాహం హరిస్తుంది.
అరుచి :
కొంతమందికి ఎంత రుచికరమైన పదార్థం తిన్నా రుచిగా అనిపించదు. దీనినే అరుచి అంటారు. దానిని అధిగమించడానికి ..
![]() |
కరక్కాయ |
- ఉప్పు మరియు అల్లము కలిపి ప్రతిరోజూ భోజనం చేసేముందు తీసుకోవాలి.
- ఎండు ద్రాక్ష పండ్లు, కరక్కాయ మరియు కండ శర్కర తీసుకొని మెత్తగా దంచి పొడి చేసి ఉంచుకోవాలి. ఈ పొడిని 2 నుండి 4 గ్రాముల వరకు గోరువెచ్చని నీళ్ళతో రోజుకు రెండు సార్లు తీసుకొంటూ ఉంటే నోట్లో అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగుతుంది.
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..
No comments:
Post a Comment