కీళ్ళ నొప్పులు మటుమాయం
గృహ వైద్యము - 5

కాలిన గాయాలు :

- కలబంద రసమును కలిన భాగముపై ఆలస్యము లేకుండా వెంటనే లేపనం చేస్తే గాయము మానుతుంది.
- నేరేడు ఆకులను ముద్దగా నూరి 100 గ్రాముల ముద్దను, 500 గ్రాముల ఆవాల నూనెలో వేయించాలి. ఆ నూనెను కాలిన పుండ్లపై రాస్తూ ఉంటే అవి క్రమంగా సులభంగా మానిపోవును.
- అవిశె గింజల నూనె 3 భాగములు, ఒక భాగము సున్నపు తేట కలిపి చిక్కగా గిలకొట్టాలి. ఆ మిశ్రమమును కాలిన గాయాలపై లేపనము చేసిన మంట తగ్గడమే కాక క్రమంగా పుండ్లు మానిపోవును.
కాలి పగుళ్ళు :

చాలామంది కాలి పాదాలు పగిలి, వాటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వీటినే కాలి పగుళ్ళు అంటారు. ఇవి తగ్గాలంటే...

- మర్రిచెట్టు పాలు పగుళ్లపై నిత్యం లేపనం చేస్తూ ఉంటే కాలిపగుళ్ళు మానిపోవును.
- మామిడి జిగురు లేక బంకను నీళ్ళలో అరగదీసి పగుళ్లపై లేపనము చేసిన అవి క్రమంగా మానిపోవును.
కీళ్ళనొప్పులు - కీళ్ళ వాతము :
అనేకమంది కీళ్ళ మధ్య నొప్పులతో బాధపడుతూ ఉంటారు. దీనికి కీళ్ళవాతము కారణం. ఈ కీళ్ళ వాతం తగ్గాలంటే..

- నువ్వుల నూనె మరియు నిమ్మరసము సమభాగములుగా కలిపి కీళ్ళపై మర్దన చేసినచో కీళ్లవాతం తగ్గి క్రమంగా నొప్పులు తగ్గిపోవును.
- వావిలి వేరు చూర్ణము ఒక గ్రాము, రెండు గ్రాముల నువ్వుల నూనెలో కలిపి రోజుకు రెండు సార్లు తిన్నచో కీళ్ళవాతము, నడుము నొప్పి కూడా తగ్గును.
No comments:
Post a Comment