What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 26 December 2013

కీళ్ళ నొప్పులు మటుమాయం

కీళ్ళ నొప్పులు మటుమాయం

గృహ వైద్యము - 5
కాలిన గాయాలు :  
  •  కలబంద రసమును కలిన భాగముపై ఆలస్యము లేకుండా వెంటనే లేపనం చేస్తే గాయము మానుతుంది.
  • నేరేడు ఆకులను ముద్దగా నూరి 100 గ్రాముల ముద్దను, 500 గ్రాముల ఆవాల నూనెలో వేయించాలి. ఆ నూనెను కాలిన పుండ్లపై రాస్తూ ఉంటే అవి క్రమంగా సులభంగా మానిపోవును.
  • అవిశె గింజల నూనె 3 భాగములు, ఒక భాగము సున్నపు తేట కలిపి చిక్కగా గిలకొట్టాలి. ఆ మిశ్రమమును కాలిన గాయాలపై లేపనము చేసిన మంట తగ్గడమే కాక క్రమంగా పుండ్లు మానిపోవును.
కాలి పగుళ్ళు : 
చాలామంది కాలి పాదాలు పగిలి, వాటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వీటినే కాలి పగుళ్ళు అంటారు. ఇవి తగ్గాలంటే... 
  
  • మర్రిచెట్టు పాలు పగుళ్లపై నిత్యం లేపనం చేస్తూ ఉంటే కాలిపగుళ్ళు మానిపోవును.
  • మామిడి జిగురు లేక బంకను నీళ్ళలో అరగదీసి పగుళ్లపై లేపనము చేసిన అవి క్రమంగా మానిపోవును.
కీళ్ళనొప్పులు - కీళ్ళ వాతము : 
అనేకమంది కీళ్ళ మధ్య నొప్పులతో బాధపడుతూ ఉంటారు. దీనికి కీళ్ళవాతము కారణం. ఈ కీళ్ళ వాతం తగ్గాలంటే.. 

  • నువ్వుల నూనె మరియు నిమ్మరసము సమభాగములుగా కలిపి కీళ్ళపై మర్దన చేసినచో కీళ్లవాతం తగ్గి క్రమంగా నొప్పులు తగ్గిపోవును.
  • వావిలి వేరు చూర్ణము ఒక గ్రాము, రెండు గ్రాముల నువ్వుల నూనెలో కలిపి రోజుకు రెండు సార్లు తిన్నచో కీళ్ళవాతము, నడుము నొప్పి కూడా తగ్గును.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML