What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 24 December 2013

హైందవధర్మం నశిస్తుంది... భారతీయసంప్రదాయం నాశనమౌతుంది..

హైందవధర్మం నశిస్తుంది...
భారతీయసంప్రదాయం నాశనమౌతుంది..

హిందూ సమాజం సాధారణంగా నాలుగు వర్ణాలుగా విభజింపబడి ఉంది.
బ్రాహ్మణులు..ఆచార్యులు మరియు పూజారులు. క్షత్రియులు..యోధులు, రాజులు, మరియు ఉన్నత వంశానికి చెందిన వారు. వైశ్యులు...వ్యాపారస్థులు మరియు వాణిజ్యవేత్తలు. శూద్రులు...కూలివారు మరియు పై మూడు వర్ణాలకు సేవకులు. ఈ వర్ణ వ్యవస్థ, ఒకనాడు హిందూసామాజిక వ్యవస్థలో అంతర్భాగమే. నేడది కాలం చెల్లిన సామాజిక సాంప్రదాయమేకాక శూద్రులుగా ముద్రవేయబడిన వారు నేటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఇది మానవహక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన, సామాజిక అన్యాయంగా గుర్తించి, హైందవ సమాజంపై తిరుగుబాటు ఉద్యమాలు చేస్తున్నారు. ఆత్మగౌరవ ఉద్యమాలు చేశారు. అధిక సంఖ్యాకులపై అల్పసంఖ్యాకుల దాడిగా, సామాజిక వివక్షతగా పరిగణించబడింది. కాబట్టి వర్ణవ్యవస్థ, దాని పర్యవసానంగా అమల్లోకి వచ్చిన కులవ్యవస్థ నేడు కాలంచెల్లిన సామాజిక సాంప్రదాయమే...అంతేకాదు కొందిమందికి పూజ్యస్థానం..ఎంతోమందికి హీనస్థాయిని కల్పించిన ఈ సామాజిక సంప్రదాయాన్ని సమసామాజిక సంప్రదాయంగా చట్టాలకు, ప్రజాస్వామిక వ్యవస్థకు అనుకూలంగా మార్చాలి, నిర్వచించాలి. లేదంటే హైందవధర్మం నశిస్తుంది. భారతీయసంప్రదాయం నాశనమౌతుంది..@ బహుజనబంధు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML