నిత్య పూజా విధానం: ప్రాతః కాలమందు (సూర్యోదయం లోపు)నిద్రలేచి కాలకృత్యములు, స్నాన సంధ్యాదులు పూర్తిచేసుకొని దీపారాధన చేసుకొని అగర్బత్తీలు వెలిగించి, కొంచెం పూలు అలంకారం చేసి మీకు నచ్చిన స్తోత్రం లేక శ్లోకం పాడుకొని హారతి ఇవ్వండి.(ఇదంతా సూర్యోదయం లోపు పూర్తి అయిపోవాలి) తరువాత వంట చేసుకుని చేసిన వంటని దేవునికి నైవేద్యం(అన్నం, కూర, అయన ముందు పెట్టి వీటిలోనుండి కొంచెంచిన్న పళ్ళెంలో పెట్టి స్వామివారికి సమర్పించి తరువాత మీరు వీలైనప్పుడు భోజనం చేయండి. భోజనం చేసే ముందు మొదటి ముద్దని పితృదేవతలకి సమర్పించండి. (ఒక ముద్ద ప్లేట్లో కాని చిన్న ఆకులో గాని పెట్టి మీ ఇంటి ప్రహరి గోడ మీద పెట్టి భోజనం చేయండి. సూర్యాస్తమయం అవ్వగానే మరలా దీపరధాన చేయండి. వీలయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా దీపారాధన చెప్పండి.
అలాగే సూర్యోదయం(5:00 - 5:45) వేళలో గాని, మధ్యాహ్నం వేళలో(12:00 - 12:45) సూర్యాస్తమయం సమయంలో (5:00 - 5:45) పొరపాటున కూడా నిద్రించకూడదు. ఆహారం స్వీకరించకూడదు.
సంధ్యా సమయం రుద్రుడు ముల్లోకాలు తిరుగుతాడు. ఆ సమయంలో నిద్రించకూడదు. ఆహారం స్వీకరించాకుడదు, పొరపాటున కూడా సంభోగం చేయకూడదు. దీనివలన రాక్షశాంసతో పిల్లలు జన్మిస్తారు. అలా చేసినందువలనే కశ్యప్రజాపతికి, ధితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మించారు.
అలాగే సూర్యోదయం(5:00 - 5:45) వేళలో గాని, మధ్యాహ్నం వేళలో(12:00 - 12:45) సూర్యాస్తమయం సమయంలో (5:00 - 5:45) పొరపాటున కూడా నిద్రించకూడదు. ఆహారం స్వీకరించకూడదు.
సంధ్యా సమయం రుద్రుడు ముల్లోకాలు తిరుగుతాడు. ఆ సమయంలో నిద్రించకూడదు. ఆహారం స్వీకరించాకుడదు, పొరపాటున కూడా సంభోగం చేయకూడదు. దీనివలన రాక్షశాంసతో పిల్లలు జన్మిస్తారు. అలా చేసినందువలనే కశ్యప్రజాపతికి, ధితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మించారు.
No comments:
Post a Comment