జన ‘జీవ’నదులు
||గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి||
||నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు||
ఇది హిందువులు నీటికి ఇచ్చే అత్యంత ప్రాముఖ్యత. అందులోను, గంగకి ఆగ్రతాంబూలాన్ని ఇవ్వడం దాని వైశిష్ట్యానికి నిదర్శనం. ఏ నీటిని దోసిట పట్టినా అన్ని నదుల నీరూ ఇదే అగునుగాక అని మంత్రయుక్తంగా చేతిలోని నీటిని పవిత్రంగా భావించే సంప్రదాయం ఇక్కడే ఉందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
మన భారతదేశం నదీనదాలకి పెట్టింది పేరు. జీవనదుల కారణంగా మనదేశం సస్యశ్యామలంగా, నాగరికత పరిఢవిల్లిన ప్రాంతంగా, ఆధ్మాత్మిక యశస్సులు వెదజల్లే స్వర్గధామంగా, ప్రపంచదేశాలలో తలమానికంగా నిలిచింది. మంచు పర్వతాలు నుంచిగానీ, కురిసే వర్షాల వల్లగానీ, ప్రవహించే అనేక నీటి ప్రవాహాల కలయిక వల్ల పెద్ద ప్రవాహం గా మారి ప్రవహించే దానిని నది అని అంటాం. సాధారణంగా నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి, వేల కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలిసిపోతూవుంటాయి. ఇలా వృధాగా పోతున్న నీటిని ఆనకట్ట వేసి మరింత సుభిక్షం చేసుకుంటున్నాం.
మన దేశంలో ప్రవహిస్తున్న జీవనదులు:
గంగ...
ఇది బంగ్లాదేశ్కి కూడా ప్రధానమైన నది. మ నదేశంలో గంగకి చాలా ప్రాముఖ్యత ఉంది. గంగమ్మ తల్లిగా, గంగాభవానీగా, పావన గంగగా భారతీయులంతా పవిత్రంగా పూజిస్తారు. ఉత్తరాంచల్లోని హిమాలయాలలో గంగోత్రి అనే మంచు ప్రవాహం భాగీరధిగా ఉద్భవిస్తోంది. ప్రయాగ వద్ద అలకనంద దీనితో కలిసి గంగ అవుతోంది. అయితే దీనికి ఆయాప్రాంతాల్లో వాడుకలో ఉండే పేర్లు మాత్రమే. కానీ నీటిని ‘గంగ’ అని సంబోధించడం మన ఆనవాయితీ. ఇలా హిమాలయాలనుండి ప్రయాణమైన ఈ గంగ హరిద్వార్ చేరే సరికి సువిశాలమైన మైదానంలోని అడుగుపెడుతుంది. అక్కడినుంచి సాగే గంగా ప్రవాహంతో గోమతి, శోణ, కోసి అనే ఉపనదులు కలుస్తాయి.
ప్రయాగ సమీపానగల అలహాబాద్ చేరే సరికి అన్నిటికంటే పెద్దనది అయిన యమున గంగతో కలుస్తుంది. యమునానది గంగతో కలిసినప్పటికీ, అతి పెద్దనది అవడం చేత యమునని కూడా ప్రత్యేకంగా, పవిత్రంగా పూజిస్తారు. ఈ రెండు నదుల ఒడ్డున అనేక పుణ్య క్షేత్రాలు, పెద్దపెద్ద నగరాలు ఉద్భవించాయి. వారణాశి, ఢిల్లీ, అలహాబాద్, కాన్పూర్, కలకత్తా అటువంటి వాటిలో కొన్ని. అలహాబాద్ నుంచి ప్రవహిస్తున్న గంగానది ఎన్నో నదుల తో కలిసి మహాప్రవాహంగా మారుతుంది. ఇలా ప్రవహిస్తున్న గంగానది మశ్చిమ బెంగాల్లో మాల్దా అనే ప్రాంతంలో రెండుగా చీలుతుంది. ఇక్కడే ఈ నదికి మొదటిచీలిక. ఇక్కడి నుంచి ఒకపాయ హుగ్లీ నదిగా మారుతుంది.
కలకత్తా మహానగరం ఈ నది ఒడ్డునే ఉంది. మాల్దా ప్రాంతం దాటిన తరువాత రెండో పాయని పద్మానది గా వ్యవహరిస్తారు. ఈ నది బంగ్లాదేశ్లో అడుగుపెట్టిన తరువాత అక్కడ బ్రహ్మపుత్ర నుండి చీలిన యమునా నది పద్మానదితో ఏకమవుతుంది. బంగ్లాదేశ్లో అనేక మార్గాల ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ నదీ తీరం వెంబడి ఎన్నో అరణ్యాలు, వనాలు, జంతు సంపద పుష్కళంగా అభివృద్ది చెందాయి. గంగానది పొడవు 2,510 కిలోమీటర్లు.
యమున...
జమున, జమ్నా అనే పర్యాయ పదాలతో పిలుచుకునే ఈ యమునానది గంగానదికి అతి పెద్ద ఉపనది. ఈ నది భారతదేశంలో చాలా ముఖ్యమైనది, ఎంతో పవిత్రమైనది. హిమాలయా పర్వత ప్రాంతంలో ఉన్న కాళింది పర్వతంలో యమునోత్రి అనే చోట పుట్టి, గంగానదితో కలిసి ప్రవహిస్తూవుంటుంది. దీనినే సమాన శ్వాస, సూర్యతనయ అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. అందులో ఒకటి యమునగా పారి గంగానదిలో కలుస్తుంది. ఇలా ప్రయాణించిన ప్రవాహం అనేక మార్పులతో చివరికి బంగ్లాదేశ్లోని చాంద్పూర్ అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలిసిపోతుంది. యమునానది పొడవు 1370 కిలోమీటర్లు.
గోదావరి...
భారతదేశంలో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది ఈ గోదావరి. దీని ప్రాశస్త్యాన్ని గురించి చెప్పాలంటే ఒక మాట సరిపోదు. పెద్ద గ్రంధమే అవుతుంది. ఇది సముద్ర మట్టానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్టల్రో ని నాసికా త్రయంబకం అనే ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం మీదుగా ప్రయాణించి మన ఆంధ్రప్రదేశ్ చేరుకుంటుంది. ఇలా ప్రయాణించిన గోదావరి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్ని పాడిపంటలతో విలసిల్లేల్లా చేసి, చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గోదావరి ప్రాంతాన వెలసి నన్ని పుణ్యక్షేత్రాలు మరెక్కడాలేవనడం కూడా అతిశయోక్తి గాదేమో.
పరవళ్ళు తొక్కుతూ అనేక ప్రాంతాల్ని పునీతం చేస్తూ వచ్చిన గోదావరి, ధవిళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ ఏడు పాయలు సప్త ఋషూల పేర్లతో ప్రకాశిస్తుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ నదులు మాత్రం ప్రవాహనదులుగానూ, మిగిలినవి అంతర్వా హినులుగా ఉంటాయి. ఈ గోదావరికి పౌరాణిక, ఐతిహాసిక చరిత్ర ఎంతగానో ఉంది. ఈ నది ఒడ్డున వెలసిన దివ్యక్షేత్రాల్లో అత్యంత ప్రాధానమైనవి నాసిక్, త్రయంబకేశ్వర్, బాసర, కోటిలింగాలు, కాళేశ్వరం, భద్రాచలం, కొవ్వూరు, రాజమండ్రి, మందపల్లి, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది. ఇక ఈ గోదావరిలో కలిసే నదులు, పెన్ గంగ, వైనగంగ, వార్ధా, మంజీరా, ఇంద్రా వతి, బిందుసార, శబరి, ప్రవర, పూర్ణ, ప్రాణ హిత, సీలేరు, కిన్నెరసాని, మానేరు. ఈ గోదావరి నది పరీవాహక ప్రాంతం 3,13,000 చదరపు కిలోమీటర్లు విస్తరించివుంది.
సరస్వతీనది...
పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన నది ఈ సరస్వతీ నది. ఋగ్వేదం మొత్తంలో ఈ నది ప్రస్తా వన అరవై సార్లు వస్తుంది. మనం చెపకునే ఏడు పుణ్యనదుల్లో ఇది ఒకటి. కానీ మహాభా రత కాలంలో ఈ నది పూర్తిగా ఎండిపోయి నట్టు చెప్పబడింది. ఇదమిద్దంగా నేడు సరస్వ తీ నది లేదుగానీ, ప్రస్తుతం ఇక్కడ ప్రవిహ స్తున్న గఘర్, హక్రా అనే నదినే సరస్వతిగా భావించడం జరుగుతోంది. అయితే ఈ మధ్య ఇస్రో ఉపగ్రహం అందించిన ఛాయా చిత్రాల ద్వారా సరస్వతీనది కూడా హిమా లయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజ రాత్ మీదుగా ప్రయాణించి సింధూ వద్దగల అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది పొడవు 1,600 కిలోమీటర్లు.
నర్మదానది...
భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడు నదులలో నర్మదానది ఒక టి. మిగిలిన రెండూ తపతి, మహీనదులు. నర్మదానది మధ్యప్రదేశ్లోని అమర్కంఠక్ పర్వతాలలో ఉద్భవించింది. అక్కడి నుంచి జబల్పూర్ మీదుగా వింద్య, సాత్పురా శ్రేణు లు దాటుకుంటూ, నర్మదాలోయకి జాలువా రుతుంది. అలాగే కాంబేగల్ఫ్ని చేరి, మధ్య ప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ర్టలని తాకుతూ, చివరిగా గుజరాత్లోని బారూచ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని ప్రయాణగమనం అంతా 1,289 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
సింధూనది...
మన దేశంలో ఇది కూడా చాలా ప్రసిద్దమైన నది. ఇది హిమాలయాలోని టిబెట్టులో పుట్టి, కాశ్మీర్, పంజాబ్, సిధు రాష్ట్రాలగుండా ప్రవ హించి పాకిస్తాన్లో కరాచీ వద్ద గల అరేబి యా సముద్రంలో కలుస్తుంది. జీలం, చీనా బ్, రావీ, బియాస్, సట్లెజ్ దీనికి ఉపనదులు. మన దేశంలో అతి ప్రతిష్టాత్మకంగా నిర్మిం చిన బాక్రానంగల్ ఆనకట్ట సట్లెజ్ నదిమీద నిర్మించినదే. సింధు నదీపరీవాహక ప్రాంతా లు నాగరికతకి ఎంతో పేరు పొందినవి. ఈ సింధూ నది వద్ద గల హరప్పా, మొహంజి దారో పరిసరాలు సుమారుగా 5000 సంవత్సరాల సింధూనాగరికతతో వర్ధిల్లాయి. ఈ నది పొడవు 2,880 కిలోమీటర్లు.
కావేరి...
మనకున్న అతి ముఖ్యమైన ప్రధాన నదుల్లో కావేరి ఒకటి. కర్ణాటక రాష్ట్రం పడమటి కను మల్లో కొడగు జిల్లాలోని తలకావేరి ఈ నదికి జన్మస్థలం. దీనికే దక్షిణ గంగ అని మరో పేరు. కావేరీ నదీజలాలు ఋతుపవనాల మూలంగా కురిసే వర్షాల కారణంగానే అభి స్తుంది. వ్యవసాయ, విధ్యుదుత్పాదనకే కాక, గృహావసరాలకి కూడ ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతోంది. వర్షపు నీటిని, దీని పై కట్టిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట, మెట్టూరు ఆనకట్టలలో నిల్వచేసి, వర్షాభావ పరిస్థితుల్లో ఈ నీటిని వాడుకునేందుకు విడుదల చేస్తూ వుంటారు. ఈ కావేరీ నది పుట్టిన తలకావేరి లో తులా సంక్రమణంలో ఏలాది భక్తులు స్నా నమాచరించి, ఇక్కడ ఉన్న మూడు ప్రాచీన దేవాలయాల్లోనూ, పూజలు నిర్వహించడం ఆన వాయితీగా ఉంది. చందన వృక్షాల అడవు లకి ఈ కావేరీ నదీ పరీవాహక ప్రాంతం ఎం తో ప్రాముఖ్యత చెందింది. నాటి టిపసుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం, తమిళనాడులోని కుంభకోణం ఈ నది ఒడ్డున అలరారుతున్న పుణ్యక్షేత్రాలే.
ఈ విధంగా మంత్రానుష్టానంలో పొందుపరిచిన మన జీవనదులు యావద్భారతదేశానికి మకుటాయమానంగా ప్రకాశిస్తున్నాయి. అనే క నాగరికతలు, సాంప్రదాయాలు, వృత్తులు, జాతులతో అభివృద్ధిచెందడానికి అనుకూల మైన వాతావరణ పరిస్థితుల్ని సమకూరుస్తూ, సస్యశ్యామలం చేస్తూ, పారుతున్న ప్రశాంత, నిర్మల, గంభీర నీరదాలు ఈ మహానదులు. అయినప్పటికీ మానవ తప్పిదాలని క్షమించ లేని పరిస్థితులో ఇవి కూడా ఉగ్రరూపాన్ని ప్రదర్శించి తగిన గుణపాఠం చెప్తున్నాయి. కొండలు పిండిచేసి, అడవులు తెగ నరికి ప్రకృతి సమతౌల్యతని నాశనం చేసుకుంటూ, ఈ రోజు అవస్థలపాలవుతున్నామంటే ఈ వైపరీత్యాలకి మనమే భాధ్యత వహించవలసి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఇదే విధంగా ఉంటే, ముందు తరాలకి
మనం అందించగలిగేవి రోగాలు, రొచ్చులు, నీటి ఎద్దడి కరువు కాటకాలు మాత్రమే
అని గుర్తుంచుకోవాలి.
||గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి||
||నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు||
ఇది హిందువులు నీటికి ఇచ్చే అత్యంత ప్రాముఖ్యత. అందులోను, గంగకి ఆగ్రతాంబూలాన్ని ఇవ్వడం దాని వైశిష్ట్యానికి నిదర్శనం. ఏ నీటిని దోసిట పట్టినా అన్ని నదుల నీరూ ఇదే అగునుగాక అని మంత్రయుక్తంగా చేతిలోని నీటిని పవిత్రంగా భావించే సంప్రదాయం ఇక్కడే ఉందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
మన భారతదేశం నదీనదాలకి పెట్టింది పేరు. జీవనదుల కారణంగా మనదేశం సస్యశ్యామలంగా, నాగరికత పరిఢవిల్లిన ప్రాంతంగా, ఆధ్మాత్మిక యశస్సులు వెదజల్లే స్వర్గధామంగా, ప్రపంచదేశాలలో తలమానికంగా నిలిచింది. మంచు పర్వతాలు నుంచిగానీ, కురిసే వర్షాల వల్లగానీ, ప్రవహించే అనేక నీటి ప్రవాహాల కలయిక వల్ల పెద్ద ప్రవాహం గా మారి ప్రవహించే దానిని నది అని అంటాం. సాధారణంగా నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి, వేల కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలిసిపోతూవుంటాయి. ఇలా వృధాగా పోతున్న నీటిని ఆనకట్ట వేసి మరింత సుభిక్షం చేసుకుంటున్నాం.
మన దేశంలో ప్రవహిస్తున్న జీవనదులు:
గంగ...
ఇది బంగ్లాదేశ్కి కూడా ప్రధానమైన నది. మ నదేశంలో గంగకి చాలా ప్రాముఖ్యత ఉంది. గంగమ్మ తల్లిగా, గంగాభవానీగా, పావన గంగగా భారతీయులంతా పవిత్రంగా పూజిస్తారు. ఉత్తరాంచల్లోని హిమాలయాలలో గంగోత్రి అనే మంచు ప్రవాహం భాగీరధిగా ఉద్భవిస్తోంది. ప్రయాగ వద్ద అలకనంద దీనితో కలిసి గంగ అవుతోంది. అయితే దీనికి ఆయాప్రాంతాల్లో వాడుకలో ఉండే పేర్లు మాత్రమే. కానీ నీటిని ‘గంగ’ అని సంబోధించడం మన ఆనవాయితీ. ఇలా హిమాలయాలనుండి ప్రయాణమైన ఈ గంగ హరిద్వార్ చేరే సరికి సువిశాలమైన మైదానంలోని అడుగుపెడుతుంది. అక్కడినుంచి సాగే గంగా ప్రవాహంతో గోమతి, శోణ, కోసి అనే ఉపనదులు కలుస్తాయి.
ప్రయాగ సమీపానగల అలహాబాద్ చేరే సరికి అన్నిటికంటే పెద్దనది అయిన యమున గంగతో కలుస్తుంది. యమునానది గంగతో కలిసినప్పటికీ, అతి పెద్దనది అవడం చేత యమునని కూడా ప్రత్యేకంగా, పవిత్రంగా పూజిస్తారు. ఈ రెండు నదుల ఒడ్డున అనేక పుణ్య క్షేత్రాలు, పెద్దపెద్ద నగరాలు ఉద్భవించాయి. వారణాశి, ఢిల్లీ, అలహాబాద్, కాన్పూర్, కలకత్తా అటువంటి వాటిలో కొన్ని. అలహాబాద్ నుంచి ప్రవహిస్తున్న గంగానది ఎన్నో నదుల తో కలిసి మహాప్రవాహంగా మారుతుంది. ఇలా ప్రవహిస్తున్న గంగానది మశ్చిమ బెంగాల్లో మాల్దా అనే ప్రాంతంలో రెండుగా చీలుతుంది. ఇక్కడే ఈ నదికి మొదటిచీలిక. ఇక్కడి నుంచి ఒకపాయ హుగ్లీ నదిగా మారుతుంది.
కలకత్తా మహానగరం ఈ నది ఒడ్డునే ఉంది. మాల్దా ప్రాంతం దాటిన తరువాత రెండో పాయని పద్మానది గా వ్యవహరిస్తారు. ఈ నది బంగ్లాదేశ్లో అడుగుపెట్టిన తరువాత అక్కడ బ్రహ్మపుత్ర నుండి చీలిన యమునా నది పద్మానదితో ఏకమవుతుంది. బంగ్లాదేశ్లో అనేక మార్గాల ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ నదీ తీరం వెంబడి ఎన్నో అరణ్యాలు, వనాలు, జంతు సంపద పుష్కళంగా అభివృద్ది చెందాయి. గంగానది పొడవు 2,510 కిలోమీటర్లు.
యమున...
జమున, జమ్నా అనే పర్యాయ పదాలతో పిలుచుకునే ఈ యమునానది గంగానదికి అతి పెద్ద ఉపనది. ఈ నది భారతదేశంలో చాలా ముఖ్యమైనది, ఎంతో పవిత్రమైనది. హిమాలయా పర్వత ప్రాంతంలో ఉన్న కాళింది పర్వతంలో యమునోత్రి అనే చోట పుట్టి, గంగానదితో కలిసి ప్రవహిస్తూవుంటుంది. దీనినే సమాన శ్వాస, సూర్యతనయ అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. అందులో ఒకటి యమునగా పారి గంగానదిలో కలుస్తుంది. ఇలా ప్రయాణించిన ప్రవాహం అనేక మార్పులతో చివరికి బంగ్లాదేశ్లోని చాంద్పూర్ అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలిసిపోతుంది. యమునానది పొడవు 1370 కిలోమీటర్లు.
గోదావరి...
భారతదేశంలో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది ఈ గోదావరి. దీని ప్రాశస్త్యాన్ని గురించి చెప్పాలంటే ఒక మాట సరిపోదు. పెద్ద గ్రంధమే అవుతుంది. ఇది సముద్ర మట్టానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్టల్రో ని నాసికా త్రయంబకం అనే ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం మీదుగా ప్రయాణించి మన ఆంధ్రప్రదేశ్ చేరుకుంటుంది. ఇలా ప్రయాణించిన గోదావరి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్ని పాడిపంటలతో విలసిల్లేల్లా చేసి, చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గోదావరి ప్రాంతాన వెలసి నన్ని పుణ్యక్షేత్రాలు మరెక్కడాలేవనడం కూడా అతిశయోక్తి గాదేమో.
పరవళ్ళు తొక్కుతూ అనేక ప్రాంతాల్ని పునీతం చేస్తూ వచ్చిన గోదావరి, ధవిళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ ఏడు పాయలు సప్త ఋషూల పేర్లతో ప్రకాశిస్తుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ నదులు మాత్రం ప్రవాహనదులుగానూ, మిగిలినవి అంతర్వా హినులుగా ఉంటాయి. ఈ గోదావరికి పౌరాణిక, ఐతిహాసిక చరిత్ర ఎంతగానో ఉంది. ఈ నది ఒడ్డున వెలసిన దివ్యక్షేత్రాల్లో అత్యంత ప్రాధానమైనవి నాసిక్, త్రయంబకేశ్వర్, బాసర, కోటిలింగాలు, కాళేశ్వరం, భద్రాచలం, కొవ్వూరు, రాజమండ్రి, మందపల్లి, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది. ఇక ఈ గోదావరిలో కలిసే నదులు, పెన్ గంగ, వైనగంగ, వార్ధా, మంజీరా, ఇంద్రా వతి, బిందుసార, శబరి, ప్రవర, పూర్ణ, ప్రాణ హిత, సీలేరు, కిన్నెరసాని, మానేరు. ఈ గోదావరి నది పరీవాహక ప్రాంతం 3,13,000 చదరపు కిలోమీటర్లు విస్తరించివుంది.
సరస్వతీనది...
పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన నది ఈ సరస్వతీ నది. ఋగ్వేదం మొత్తంలో ఈ నది ప్రస్తా వన అరవై సార్లు వస్తుంది. మనం చెపకునే ఏడు పుణ్యనదుల్లో ఇది ఒకటి. కానీ మహాభా రత కాలంలో ఈ నది పూర్తిగా ఎండిపోయి నట్టు చెప్పబడింది. ఇదమిద్దంగా నేడు సరస్వ తీ నది లేదుగానీ, ప్రస్తుతం ఇక్కడ ప్రవిహ స్తున్న గఘర్, హక్రా అనే నదినే సరస్వతిగా భావించడం జరుగుతోంది. అయితే ఈ మధ్య ఇస్రో ఉపగ్రహం అందించిన ఛాయా చిత్రాల ద్వారా సరస్వతీనది కూడా హిమా లయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజ రాత్ మీదుగా ప్రయాణించి సింధూ వద్దగల అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది పొడవు 1,600 కిలోమీటర్లు.
నర్మదానది...
భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడు నదులలో నర్మదానది ఒక టి. మిగిలిన రెండూ తపతి, మహీనదులు. నర్మదానది మధ్యప్రదేశ్లోని అమర్కంఠక్ పర్వతాలలో ఉద్భవించింది. అక్కడి నుంచి జబల్పూర్ మీదుగా వింద్య, సాత్పురా శ్రేణు లు దాటుకుంటూ, నర్మదాలోయకి జాలువా రుతుంది. అలాగే కాంబేగల్ఫ్ని చేరి, మధ్య ప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ర్టలని తాకుతూ, చివరిగా గుజరాత్లోని బారూచ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని ప్రయాణగమనం అంతా 1,289 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
సింధూనది...
మన దేశంలో ఇది కూడా చాలా ప్రసిద్దమైన నది. ఇది హిమాలయాలోని టిబెట్టులో పుట్టి, కాశ్మీర్, పంజాబ్, సిధు రాష్ట్రాలగుండా ప్రవ హించి పాకిస్తాన్లో కరాచీ వద్ద గల అరేబి యా సముద్రంలో కలుస్తుంది. జీలం, చీనా బ్, రావీ, బియాస్, సట్లెజ్ దీనికి ఉపనదులు. మన దేశంలో అతి ప్రతిష్టాత్మకంగా నిర్మిం చిన బాక్రానంగల్ ఆనకట్ట సట్లెజ్ నదిమీద నిర్మించినదే. సింధు నదీపరీవాహక ప్రాంతా లు నాగరికతకి ఎంతో పేరు పొందినవి. ఈ సింధూ నది వద్ద గల హరప్పా, మొహంజి దారో పరిసరాలు సుమారుగా 5000 సంవత్సరాల సింధూనాగరికతతో వర్ధిల్లాయి. ఈ నది పొడవు 2,880 కిలోమీటర్లు.
కావేరి...
మనకున్న అతి ముఖ్యమైన ప్రధాన నదుల్లో కావేరి ఒకటి. కర్ణాటక రాష్ట్రం పడమటి కను మల్లో కొడగు జిల్లాలోని తలకావేరి ఈ నదికి జన్మస్థలం. దీనికే దక్షిణ గంగ అని మరో పేరు. కావేరీ నదీజలాలు ఋతుపవనాల మూలంగా కురిసే వర్షాల కారణంగానే అభి స్తుంది. వ్యవసాయ, విధ్యుదుత్పాదనకే కాక, గృహావసరాలకి కూడ ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతోంది. వర్షపు నీటిని, దీని పై కట్టిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట, మెట్టూరు ఆనకట్టలలో నిల్వచేసి, వర్షాభావ పరిస్థితుల్లో ఈ నీటిని వాడుకునేందుకు విడుదల చేస్తూ వుంటారు. ఈ కావేరీ నది పుట్టిన తలకావేరి లో తులా సంక్రమణంలో ఏలాది భక్తులు స్నా నమాచరించి, ఇక్కడ ఉన్న మూడు ప్రాచీన దేవాలయాల్లోనూ, పూజలు నిర్వహించడం ఆన వాయితీగా ఉంది. చందన వృక్షాల అడవు లకి ఈ కావేరీ నదీ పరీవాహక ప్రాంతం ఎం తో ప్రాముఖ్యత చెందింది. నాటి టిపసుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం, తమిళనాడులోని కుంభకోణం ఈ నది ఒడ్డున అలరారుతున్న పుణ్యక్షేత్రాలే.
ఈ విధంగా మంత్రానుష్టానంలో పొందుపరిచిన మన జీవనదులు యావద్భారతదేశానికి మకుటాయమానంగా ప్రకాశిస్తున్నాయి. అనే క నాగరికతలు, సాంప్రదాయాలు, వృత్తులు, జాతులతో అభివృద్ధిచెందడానికి అనుకూల మైన వాతావరణ పరిస్థితుల్ని సమకూరుస్తూ, సస్యశ్యామలం చేస్తూ, పారుతున్న ప్రశాంత, నిర్మల, గంభీర నీరదాలు ఈ మహానదులు. అయినప్పటికీ మానవ తప్పిదాలని క్షమించ లేని పరిస్థితులో ఇవి కూడా ఉగ్రరూపాన్ని ప్రదర్శించి తగిన గుణపాఠం చెప్తున్నాయి. కొండలు పిండిచేసి, అడవులు తెగ నరికి ప్రకృతి సమతౌల్యతని నాశనం చేసుకుంటూ, ఈ రోజు అవస్థలపాలవుతున్నామంటే ఈ వైపరీత్యాలకి మనమే భాధ్యత వహించవలసి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఇదే విధంగా ఉంటే, ముందు తరాలకి
మనం అందించగలిగేవి రోగాలు, రొచ్చులు, నీటి ఎద్దడి కరువు కాటకాలు మాత్రమే
అని గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment