సర్వదేవతా నిలయం.. గోవు!
‘అర్హత యోగ్యత లేని వారిని గౌరవించటం, గౌరవించదగిన వారిని అవమానించటం- ఈ రెండు విషయాల వల్ల లోకంలో మూడు రకాలుగా కీడు కలుగుతుంది. కరవు కాటకాలు పెరుగుతాయి. అకాల మరణాలు విపరీతవౌతాయి. ఆందోళన ఉద్వేగం భయం వృద్ధి పొందుతాయి’ అని శాస్త్ర వచనం. ఇప్పుడు పునరావృతమవుతున్న పరిస్థితి ఇదే. కవికుల గురువు కాళిదాసు రఘువంశ మహాకావ్యం రచించాడు. పందొమ్మిది సర్గల మహాకావ్యంలో మొదటి సర్గ పార్వతీపరమేశ్వర ప్రార్థనతో ప్రారంభవుతుంది. దిలీప మహారాజు చేసిన గోసేవా వ్రతం ఈ సర్గలో ముఖ్యమైన ఘట్టం. సంతానం కలుగకపోవటానికి కారణం తెలుసుకుని గురుకృపతో తమ కోరికను సిద్ధింపజేసుకోవాలనుకున్నారు రాజదంపతులు. పరిపాలనా బాధ్యతను మంత్రులకప్పగించి, సుదక్షిణాదేవి దిలీప మహారాజు గురువుగారి ఆశ్రమానికి వెళ్లారు.
సాయం సంధ్యాసమయంలో అరుంధతీ వసిష్ఠులను దర్శించారు రాజ దంపతులు. గురుపత్నికి గురుదేవులకు పాద నమస్కారం చేసి ఆశీస్సులు పొందారు. మహారాజు తన బాధను గురించి చెప్పుకున్నాడు. వసిష్ఠ మహర్షి ఒక్క క్షణం సమాధి మగ్నుడై మహారాజుతో ఇలా చెప్పాడు. ‘‘నాయనా! కొన్ని సంవత్సరాల క్రిందట, రాక్షస సంహార విషయంలో ఇంద్రుడికి సహాయం చేయటానికి నీవు దేవలోకానికి వెళ్లి, రాక్షస సంహారానంతరం భూలోకానికి బయలుదేరావు. మార్గమధ్యంలో కల్పవృక్షం క్రింద కామధేనువును చూసినప్పటికీ ధర్మ లోప భయంతో ఋతుస్నాతయైన నీ భార్యమీది ధ్యాసతో ఆ ధేనువుకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యకుండా వచ్చావు. ‘తన సంతానాన్ని సేవించకపోతే నీకు సంతానం కలుగదని’ కామధేనువు శపించింది. గంగా జలపాత ధ్వనిలో నీకు గాని రథ సారథి ‘మా తలి’కి గాని ఆ మాటలు వినిపించలేదు. పూజ్య పూజా వ్యతిక్రమణ దోషంవల్ల నీకు సంతానం కలుగలేదు. ఇప్పుడు కామధేనువు యొక్క సంతానమైన నందినీ ధేనువు ఇక్కడే ఉన్నది కనుక ఆ ధేనువు యొక్క అనుగ్రహం పొందేవరకు మీ దంపతులు ఆమెను సేవించండి’’.
వసిష్ఠ మహర్షి ఆదేశించిన విధంగా రాజ దంపతులు ఇరవై యొక్కరోజులపాటు గోసేవా వ్రతం చేశారు. వ్రత ఫలితంగా సుదక్షిణాదేవి గర్భవతి అయింది. రఘుమహారాజు జన్మించాడు. గోరక్ష,దేశరక్ష, భూరక్ష తన యొక్క జీవిత లక్ష్యంగా రాజ్యపాలన చేసిన ఆ రఘు మహారాజు యొక్క మునిమనుమడే శ్రీరామచంద్రుడు, ఇది త్రేతాయుగం నాటి సంఘటన.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలుడుగా ప్రసిద్ధి పొందాడు. గోపరిపాలన చేశాడు గోవులకు గోపకులకు గోపికలకు నాథుడయ్యాడు. బృందావనమంతా గోమయమే. గోపాలకృష్ణుడి మరళీ నాదానికి తన్మయత్వం పొంది అఖండమైన ఆత్మానందాన్ని పొందిన ధన్యజీవులు గోవులు గోపికలు గోపాలకులు.
శ్రీ గురుచరిత్రలో దత్తాత్రేయస్వామి మొదలు గురుపరంపరలోని శ్రీపాదవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి, శ్రీవాసుదేవానంద సరస్వతి, అక్కల్ కోటస్వామి, శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ షిరిడీ సాయినాథులు, శ్రీ సత్యసాయిబాబా, శ్రీ విశ్వయోగి విశ్వంజీస్వామి అందరూ కూడా గోసంరక్షణ చేసినవారు, శిష్యులచేత గోసేవ చేయించినవారూను.
‘ఓం నమశ్శివాయ,’ సిద్ధం నమః’ అని గురువు అక్షరాభ్యాసం చేసిన తరువాత అకారాది క్రమంలో పిల్లలు నేర్చుకునే పదాలు ‘అమ్మ, ఆవు, ఇల్లు’ మొదలైనవే కదా, ‘ఆవు సాధు జంతువు’- అందరికీ తెలిసిన చిన్న వాక్యమిది. తల్లి పాలు దొరకని శిశువులకు ఆవుపాలే కదా శ్రేష్ఠమైనవి. ఎవరూ కూడా కాదనలేని నగ్నసత్యాలివి. నేటికీ కూడా గోశాలలేని ఆశ్రమాలున్నాయా?
గోరక్ష దేశరక్ష ధర్మరక్ష తన ధ్యేయంగా హిందూ సామ్రాజ్యాన్ని సుస్థిరమొనర్చిన ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను ‘శివభారత’మనే కావ్యంగా రచించిన మహాకవి గడియారం వేంకటశేషశాస్ర్తీగారు. ఆ కావ్యంలోని సంఘటన చూద్దాం. బాల్యంలో రామాయణ భారత భాగవత కథలను చెప్పిన కన్నతల్లి పలుకులు భారతీయ సంస్కృతి ఏమిటో తెలియజేశాయి బాలశివుడికి. తత్ఫలితంగానే ఒక ఆవును హింసిస్తున్న భారత భూశ్వాసకోశ ’’ అని గర్జించాడు ఆ మహితాత్ముడు. దేహమాత దేశమాత, వేదమాత, భూమాత, గోమాత ఈ అయిదుగురు మనకు ఆరాధ్య దేవతలు.
గోమాత- మాతృస్థానాన్ని పొందటానికి కారణం- గోవు సర్వదేవతా నిలయం- అని వేదమాత చెప్పినమాట. పంచగవ్యాలలో ‘కాన్సర్ నిరోధకశక్తి’ అనే దివ్యమైన గుణమున్నది. దేశ విదేశ శాస్త్ర పరిశోధకులు నిర్ధారించిన విషయమిది.
గోశబ్దానికి, సూర్యుడు, కిరణం, చంద్రుడు, వాక్కు, భూమి, దిక్కు, నేత్రం, వజ్రం, జలం, సరస్వతి మొదలైన అర్థాలున్నాయి. ఇవన్నీ పర్యాయ పదాలే.
సాత్త్వికమైన ఆహారమే దైవాన్ని చేరటానికి మార్గం. పతంజలి యోగ సూత్రాన్ని అనుసరించి కందమూల ఫలాలు యోగాభ్యాసానికి ధ్యానానికి ఏకాగ్రతాసిద్ధికి ప్రేరకాలు.
యజుర్వేదంలోని తైత్తిరేయోపనిషత్తులో- శిక్షావల్లీ ప్రకరణంలో గురువుశిష్యులకు ఉపదేశిస్తాడు. ‘‘యాన్యస్మాకం సుచరితాని, తాని త్వయా ఉపాస్యాని, నో ఇతరాణి- మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ’’-
‘‘నాయనా! మా యొక్క మంచి ప్రవర్తననే స్వీకరించు. తల్లిని తండ్రిని గురువును అతిథిని దైవంగా భావించు ఆరాధించు.’’
‘హింసాం దునోతి ఇతి హిందుః’ మనసా వాచా కర్మణా హింసను పరిహరించేవాడే హిందువు. అటువంటి హిందూతత్త్వం భారతీయ సంస్కృతికి మూలం.
‘‘సమస్త లోకాలు సుఖంగా ఉండాలి’- అనే విశాలమైన వైదిక దృక్పథం భారతీయ సంస్కృతీ లక్షణం. ఆధ్యాత్మిక ఆధిక భౌతిక ఆధిదైవిక శాంతిని కోరే భారతీయులు సమస్త జీవుల యొక్క సుఖశాంతులను కోరుతూంటారు. ఆ జీవులలో సాధుజంతువైన గోమాత లేదా? విజ్ఞులైన భారతీయులు ఈ కోణంలో దృష్టి సారించండి. చివరి మాట-
‘‘కర్తా కారయితా చైవ, ప్రేరకశ్చాను మోదకః
సుకృతే దుష్కృతే చాపి, చత్వారస్సమ భాగినః॥
చేసేది మంచి పనైనా, చెడ్డపనైనా, చేసేవాడు చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, అంగీకరించేవాడు- నలుగురూ కర్మ ఫలితాన్ని సమానంగా పొందక తప్పదు.’
‘అర్హత యోగ్యత లేని వారిని గౌరవించటం, గౌరవించదగిన వారిని అవమానించటం- ఈ రెండు విషయాల వల్ల లోకంలో మూడు రకాలుగా కీడు కలుగుతుంది. కరవు కాటకాలు పెరుగుతాయి. అకాల మరణాలు విపరీతవౌతాయి. ఆందోళన ఉద్వేగం భయం వృద్ధి పొందుతాయి’ అని శాస్త్ర వచనం. ఇప్పుడు పునరావృతమవుతున్న పరిస్థితి ఇదే. కవికుల గురువు కాళిదాసు రఘువంశ మహాకావ్యం రచించాడు. పందొమ్మిది సర్గల మహాకావ్యంలో మొదటి సర్గ పార్వతీపరమేశ్వర ప్రార్థనతో ప్రారంభవుతుంది. దిలీప మహారాజు చేసిన గోసేవా వ్రతం ఈ సర్గలో ముఖ్యమైన ఘట్టం. సంతానం కలుగకపోవటానికి కారణం తెలుసుకుని గురుకృపతో తమ కోరికను సిద్ధింపజేసుకోవాలనుకున్నారు రాజదంపతులు. పరిపాలనా బాధ్యతను మంత్రులకప్పగించి, సుదక్షిణాదేవి దిలీప మహారాజు గురువుగారి ఆశ్రమానికి వెళ్లారు.
సాయం సంధ్యాసమయంలో అరుంధతీ వసిష్ఠులను దర్శించారు రాజ దంపతులు. గురుపత్నికి గురుదేవులకు పాద నమస్కారం చేసి ఆశీస్సులు పొందారు. మహారాజు తన బాధను గురించి చెప్పుకున్నాడు. వసిష్ఠ మహర్షి ఒక్క క్షణం సమాధి మగ్నుడై మహారాజుతో ఇలా చెప్పాడు. ‘‘నాయనా! కొన్ని సంవత్సరాల క్రిందట, రాక్షస సంహార విషయంలో ఇంద్రుడికి సహాయం చేయటానికి నీవు దేవలోకానికి వెళ్లి, రాక్షస సంహారానంతరం భూలోకానికి బయలుదేరావు. మార్గమధ్యంలో కల్పవృక్షం క్రింద కామధేనువును చూసినప్పటికీ ధర్మ లోప భయంతో ఋతుస్నాతయైన నీ భార్యమీది ధ్యాసతో ఆ ధేనువుకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యకుండా వచ్చావు. ‘తన సంతానాన్ని సేవించకపోతే నీకు సంతానం కలుగదని’ కామధేనువు శపించింది. గంగా జలపాత ధ్వనిలో నీకు గాని రథ సారథి ‘మా తలి’కి గాని ఆ మాటలు వినిపించలేదు. పూజ్య పూజా వ్యతిక్రమణ దోషంవల్ల నీకు సంతానం కలుగలేదు. ఇప్పుడు కామధేనువు యొక్క సంతానమైన నందినీ ధేనువు ఇక్కడే ఉన్నది కనుక ఆ ధేనువు యొక్క అనుగ్రహం పొందేవరకు మీ దంపతులు ఆమెను సేవించండి’’.
వసిష్ఠ మహర్షి ఆదేశించిన విధంగా రాజ దంపతులు ఇరవై యొక్కరోజులపాటు గోసేవా వ్రతం చేశారు. వ్రత ఫలితంగా సుదక్షిణాదేవి గర్భవతి అయింది. రఘుమహారాజు జన్మించాడు. గోరక్ష,దేశరక్ష, భూరక్ష తన యొక్క జీవిత లక్ష్యంగా రాజ్యపాలన చేసిన ఆ రఘు మహారాజు యొక్క మునిమనుమడే శ్రీరామచంద్రుడు, ఇది త్రేతాయుగం నాటి సంఘటన.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలుడుగా ప్రసిద్ధి పొందాడు. గోపరిపాలన చేశాడు గోవులకు గోపకులకు గోపికలకు నాథుడయ్యాడు. బృందావనమంతా గోమయమే. గోపాలకృష్ణుడి మరళీ నాదానికి తన్మయత్వం పొంది అఖండమైన ఆత్మానందాన్ని పొందిన ధన్యజీవులు గోవులు గోపికలు గోపాలకులు.
శ్రీ గురుచరిత్రలో దత్తాత్రేయస్వామి మొదలు గురుపరంపరలోని శ్రీపాదవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి, శ్రీవాసుదేవానంద సరస్వతి, అక్కల్ కోటస్వామి, శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ షిరిడీ సాయినాథులు, శ్రీ సత్యసాయిబాబా, శ్రీ విశ్వయోగి విశ్వంజీస్వామి అందరూ కూడా గోసంరక్షణ చేసినవారు, శిష్యులచేత గోసేవ చేయించినవారూను.
‘ఓం నమశ్శివాయ,’ సిద్ధం నమః’ అని గురువు అక్షరాభ్యాసం చేసిన తరువాత అకారాది క్రమంలో పిల్లలు నేర్చుకునే పదాలు ‘అమ్మ, ఆవు, ఇల్లు’ మొదలైనవే కదా, ‘ఆవు సాధు జంతువు’- అందరికీ తెలిసిన చిన్న వాక్యమిది. తల్లి పాలు దొరకని శిశువులకు ఆవుపాలే కదా శ్రేష్ఠమైనవి. ఎవరూ కూడా కాదనలేని నగ్నసత్యాలివి. నేటికీ కూడా గోశాలలేని ఆశ్రమాలున్నాయా?
గోరక్ష దేశరక్ష ధర్మరక్ష తన ధ్యేయంగా హిందూ సామ్రాజ్యాన్ని సుస్థిరమొనర్చిన ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను ‘శివభారత’మనే కావ్యంగా రచించిన మహాకవి గడియారం వేంకటశేషశాస్ర్తీగారు. ఆ కావ్యంలోని సంఘటన చూద్దాం. బాల్యంలో రామాయణ భారత భాగవత కథలను చెప్పిన కన్నతల్లి పలుకులు భారతీయ సంస్కృతి ఏమిటో తెలియజేశాయి బాలశివుడికి. తత్ఫలితంగానే ఒక ఆవును హింసిస్తున్న భారత భూశ్వాసకోశ ’’ అని గర్జించాడు ఆ మహితాత్ముడు. దేహమాత దేశమాత, వేదమాత, భూమాత, గోమాత ఈ అయిదుగురు మనకు ఆరాధ్య దేవతలు.
గోమాత- మాతృస్థానాన్ని పొందటానికి కారణం- గోవు సర్వదేవతా నిలయం- అని వేదమాత చెప్పినమాట. పంచగవ్యాలలో ‘కాన్సర్ నిరోధకశక్తి’ అనే దివ్యమైన గుణమున్నది. దేశ విదేశ శాస్త్ర పరిశోధకులు నిర్ధారించిన విషయమిది.
గోశబ్దానికి, సూర్యుడు, కిరణం, చంద్రుడు, వాక్కు, భూమి, దిక్కు, నేత్రం, వజ్రం, జలం, సరస్వతి మొదలైన అర్థాలున్నాయి. ఇవన్నీ పర్యాయ పదాలే.
సాత్త్వికమైన ఆహారమే దైవాన్ని చేరటానికి మార్గం. పతంజలి యోగ సూత్రాన్ని అనుసరించి కందమూల ఫలాలు యోగాభ్యాసానికి ధ్యానానికి ఏకాగ్రతాసిద్ధికి ప్రేరకాలు.
యజుర్వేదంలోని తైత్తిరేయోపనిషత్తులో- శిక్షావల్లీ ప్రకరణంలో గురువుశిష్యులకు ఉపదేశిస్తాడు. ‘‘యాన్యస్మాకం సుచరితాని, తాని త్వయా ఉపాస్యాని, నో ఇతరాణి- మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ’’-
‘‘నాయనా! మా యొక్క మంచి ప్రవర్తననే స్వీకరించు. తల్లిని తండ్రిని గురువును అతిథిని దైవంగా భావించు ఆరాధించు.’’
‘హింసాం దునోతి ఇతి హిందుః’ మనసా వాచా కర్మణా హింసను పరిహరించేవాడే హిందువు. అటువంటి హిందూతత్త్వం భారతీయ సంస్కృతికి మూలం.
‘‘సమస్త లోకాలు సుఖంగా ఉండాలి’- అనే విశాలమైన వైదిక దృక్పథం భారతీయ సంస్కృతీ లక్షణం. ఆధ్యాత్మిక ఆధిక భౌతిక ఆధిదైవిక శాంతిని కోరే భారతీయులు సమస్త జీవుల యొక్క సుఖశాంతులను కోరుతూంటారు. ఆ జీవులలో సాధుజంతువైన గోమాత లేదా? విజ్ఞులైన భారతీయులు ఈ కోణంలో దృష్టి సారించండి. చివరి మాట-
‘‘కర్తా కారయితా చైవ, ప్రేరకశ్చాను మోదకః
సుకృతే దుష్కృతే చాపి, చత్వారస్సమ భాగినః॥
చేసేది మంచి పనైనా, చెడ్డపనైనా, చేసేవాడు చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, అంగీకరించేవాడు- నలుగురూ కర్మ ఫలితాన్ని సమానంగా పొందక తప్పదు.’

No comments:
Post a Comment