What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 26 December 2013

భారతదేశం కన్న శాస్త్రవేత్తలలో ఆర్యభట్టు ప్రాతఃస్మరణీయుడు. ప్రపంచానికి సున్న("0") ను అందించిన గొప్పవాడు.

భారతదేశం కన్న శాస్త్రవేత్తలలో ఆర్యభట్టు ప్రాతఃస్మరణీయుడు. ప్రపంచానికి సున్న("0") ను అందించిన గొప్పవాడు.

ఆర్యభట్ట క్రీ.శ. 476 వ సంవత్సరంలో పాటలీపుత్రంలో(నేటి పాట్నా)లో జన్మించాడు.కానీ చాలామంది ఇతడు కేరళలో జన్మించి,పాటలీపుత్రంలో స్థిరపడ్డాడని వాదనలు ఉన్నాయి.కాని వీటికి ఆధారంలేదు.ఇతడు వర్తక కుటుంబానికి చెందినవాడు.వీరి తల్లిదండ్రులు,జీవితం గురించి అంతగా పరిశోధన జరగలేదు.

ఏదేమైనప్పటికీ ఆర్యభట్టు తన సుప్రసిద్ద ఆర్యభట్ట సిద్దాంతం(ఆర్యభట్టీయం) పాటలీపుత్రంలోనే రచించాడనడంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు.

గణితంలో ఇతని ఘనకార్యాలు:

1.ఇప్పుడు మనము పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న విషయాలైన "భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగడం,భూమి చుట్టు చంద్రుడు తిరగడం" గురించి ఆనాడె తన గ్రంథం లో పేర్కొన్నాడు.
2.4 కు 100 కూడి వచ్చినదాన్ని 8 తో హెచ్చవేసి తర్వాత 62,000కు కూడి వచ్చినదాన్ని 20,000తో భాగిస్తే వృత్తపరిధి మరియు వృత్తవ్యాసం నిష్పత్తికి సమానమని చెప్పాడు.దీని విలువ 3.1416 అని చెప్పాడు.గమనించి చూస్తే ఇదే గణితంలోని "పై"విలువ అని తెలుస్తుంది.ఆధునిక గణితం ప్రకారం ఈ విలువ 3.14159.చూడండి ఆనాడే ఇతను ఎంత సరిగా విలువ గణించాడో.
3.చంద్రుని వెలుతురు సూర్యరశ్మి పరావర్తనంవలన కలుగుతుందని చెప్పాడు.
4.గ్రహణాలు రాహు,కేతువులవలన కాదు అని అవి ఒకే వరుసలోకి వచ్చినప్పుడు కలుగుతాయని గ్రంథంలో పొందుపరచాడు.
5.సంవత్సరానికి 365 రొజులని కూడా చెప్పాడు.
6.భూమి యొక్క చుట్టుకొలత 24385 మైళ్లని (నేటి విజ్ఞానం ప్రకారం ఇది 24900 మైళ్ళు) అని కనుగొన్నాడు.
తర్వాతికాలంలో ఇతని గ్రంథాన్ని గ్రీకులు,అరబ్బులు గ్రహించారు.

వీరు క్రీ.శ.550 లో మరణించారు. 


 ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)

ఆర్యభట గురించి పైన టపాలో చెప్పాను.ఇందులో అతని ప్రఖ్యాత ఆర్యభటీయం లోని విశేషాలను వ్రాయడం జరిగింది.
1.భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది.
2.సూర్యుని దృష్ట్యా గ్రహాల రోజులు కనుగొనడం
3.చంద్రుడు మరియు ఇతర గ్రహాలు సూర్యకాంతి వలనే ప్రకాశిస్తున్నాయి
4.గ్రహణాలు సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే వరుసలోనికి వచ్చినపుడు ఏర్పడతాయి.(ఇక్కడ పూర్తి వివరాలు ఇచ్చారు).
5.ఈ గ్రంథం ప్రకారం సంవత్సరం=365 రోజులు,6 గంటలు,12 నిమిషాలు,30 సెకన్లు.(ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇది 365 రోజులు,6 గంటలు,9 నిమిషాలు,10 సెకన్లు)
6.ఈ గ్రంథం ప్రకారం గణితశాస్త్రంలో "పై(π)" విలువ దాదాపు 62832/20000=3.1416....( ఇప్పటి విలువ=3.14159...)
7.భూమి చుట్టూకొలత=24,835 మైళ్ళు ( ఇప్పటి ప్రకారం 24,902 మైళ్ళు)
8.సమస్య ద్వికరణీ. ప్రమాణం త్రితీయెన వర్ధయెత్ తచ్చతుర్థానాత్మ చతుసస్త్రింషెనెన సవిషెషహ్
ఇది 2 యొక్క వర్గమూలం కనుగొనడాన్ని వివరిస్తుంది.
2 యొక్క వర్గమూలం=1 + 1/3 + 1/(3.4) - 1(3.4.34)...=1.41421569(5 దశాంశాలకు సవరిస్తే).
9.sin(15 డిగ్రీలు)=890 ( ఇప్పటి విలువ 889.820) (ఇతను sin ను అర్దజ్యా గా వ్యవహరించాడు).

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML