What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్)

మీకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) గురించి తెలుసా?

కాంగ్రెస్ ప్రభుత్వం, కుహానా లౌకికవాదులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంటే ఎందుకు అంత బయపడుతారు? ఆర్.ఎస్.ఎస్ అంటే ఎందుకు అంత విషం కక్కుతారు?

రండి...రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి తెలుసుకుందాం !!!

1)ఫీల్డ్ మార్షల్ కరియప్ప(ఇండియన్ ఆర్మీ మొదటి చీఫ్) ఆర్.ఎస్.ఎస్. స్వయంసేవకులకు ఉపన్యాసం ఇస్తూ ఇలా చప్పారు: " రాష్ట్రీయ స్వయం స్వేవక్ సంఘ్ నా మనసుకు నచ్చినది. ఓ యువకులారా, పనికిమాలిన వాళ్ళు అనే మాటలను పట్టించుకోవద్దు. ముందుకు వెళ్ళండి. దేశానికి మీ సేవలు ఎంతో అవసరం"

2)డా. జకీర్ హుస్సేన్( మాజీ అధ్యక్షులు) 1949, నవంబరులో ఆర్.ఎస్.ఎస్. గురించి ఇలా చెప్పారు: "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముస్లింలను ద్వేషిస్తుందని, హింసకు పాల్పడుతుందని వచ్చిన ఆరోపణలన్ని వట్టి అబద్ధాలు మరియు కల్పితాలు. భారతీయ ముస్లింలు ఆర్.ఎస్.ఎస్ నుండి పరస్పర ప్రేమ, ఒకరికొకరు సహకరించుట వంటివి నేర్చుకోవాలి. "

3)జయ ప్రకాష్ నారాయణ్(రాజకీయ నాయకులు) 1977: ఆర్.ఎస్.ఎస్. అనేది ఒక విప్లవాత్మకమైన సంస్థ. ఈ దేశంలో వేరే ఏ ఇతర సంస్థ ఆర్.ఎస్.ఎస్ తో సమానం కాలేదు.

జయ ప్రకాష్ నారాయణ్ గాంధేయవాది, సర్వోదయా ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు మరియు ఒకప్పుడు ఆర్.ఎస్.ఎస్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యానించేవారు. కాని ఆయనే తరువతా పైవిధంగా ఆర్.ఎస్.ఎస్ గురించి గొప్పగా చెప్పారు. అంతే కాకుండా ఆయన ఇలా కూడా అన్నారు: "ఆర్.ఎస్.ఎస్ కి మాత్రమె సమాజన్ని మార్చే శక్తి, పేదవాళ్ళ కన్నెళ్ళను తుడిచే శక్తి ఉన్నది. నవభారత నిర్మాణం కొరకు కంకణం కట్టుకున్న ఈ విప్లవాత్మక సంస్థ నుండి నేను ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాను. "

4)సిక్కు పండితుడు అయిన జశ్వంత్ సింగ్(ఏ హిస్టర్య్ ఆఫ్ సిఖ్స్ పుస్తక రచయిత) 1984లో సిక్కులపై కాంగ్రెస్ చేసిన హింసాకాండ నుంచి ఎంతో మంది సిక్కులను కాపాడినందుకు ఆర్.ఎస్.ఎస్ ను ప్రశంసించారు. ఈయాన కూడా ఆర్.ఎస్.ఎస్ గురించి తప్పుడు ఆరోపణలను నమ్మి ఆర్.ఎస్.ఎస్ ని మతతత్వ సంస్థ అని అనుకునేవారు. కాని 1984లో సిక్కులను రక్షించిన తరువాత ఆర్.ఎస్.ఎస్ గొప్పతనం తెలుసుకున్నారు.

5)మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆర్.ఎస్.ఎస్ తో పాటు కొన్ని సంస్థలు "దాద్రా మరియు నగర్ హవేలి" ను పోర్చుగీసు" ఆక్రమణ నుండి విముక్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆర్.ఎస్.ఎస్ నేషనల్ మూమెంట్ లిబరేషన్ ఆర్గనైజాషన్" తో మరియు ఆజాద్ గోఅమాంతక్ దళ్ తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. జులై 21: ఆ రోజు రాత్రి ఒక స్వచ్చంధ సంస్థ పోర్చుగీసు పోలిసు స్టాషన్ ను ఆక్రమించి దాద్రాను విడుదల చేసారు. జుల్య్ 28న స్వయం సేవకులు భాగస్వామ్య సంస్థలతో కలిసి నరోలి, ఫిపరియా రాజ్యాలను మరియు రాజధాని సిల్వాస ను ఆక్రమించుకున్నారు. తరువాత పోర్చుగీసు సక్తులు అక్కడ నుంచి తప్పించుకున్న తరువాత స్వయంసేవకులు వారిని ఫట్టుకుని 1954లో భారతీయ సరిహద్దు పోలిసులకు అప్పగించారు. అలా దాద్రా మరియు నగర్ హవేలికి విముక్తి లభించింది. అప్పాసాహెబ్ కర్మల్కర్ దాద్ర మరియు నగర్ హవేలికి పాలకుడు అయ్యారు.

6)1955లో గోవాలో పోర్చుగీసు పాలనకు అంతమొందించాలని, గోవాను భారత్లో కలపాలని ఆర్.ఎస్.ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు భారతీయ సైనిక దళాన్ని పంపించాడినికి తిరస్కరించాడు. తరువాత ఆర్.ఎస్.ఎస్ నేత జగన్నాథ్ రావు జోషి సత్యాగ్రహాన్ని నిర్వహించి ఆ తీవ్రతను గోవాలోకి తీసుకువెళ్ళారు.

7)1962 సైనొ- భారత్ యుద్ధ సమయంలో తమ స్వచ్చంధ సేవా కర్యక్రమాల ద్వారా ఆర్.ఎస్.ఎస్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తరువాత అప్పటి ప్రధాని నెహ్రు ఆర్.ఎస్.ఎస్ ను గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు ఆహ్వానించాడు.

8)1975లో ఇందిరా గాంధి ఎమర్జెన్సీ పాలన ప్రకటించినపుడు, సామాన్య హక్కులు మరియు ప్రెస్ హక్కులు లేకుండా చసింది. అప్పుడు ఆర్.ఎస్.ఎస్ ఎన్నో ఉద్యమాలు నిర్వహింధి యువతలో అవగాహన కల్పించింది. కొన్ని వేల మంది స్వయం సేవకులు దేశంలో తిరిగి ప్రజాస్వామ్యం తీసుకురావడానికి ఉద్యమాలు చేసారు.

9)గాంధేయవాధి వినోభా భవె నిర్వహించిన భూదాన్ ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ కూడా పాల్గొంది. ఆర్.ఎస్.ఎస్ నేత ఎం.ఎస్.గోళ్వళ్కర్ ప్రజలలో మంచి నమ్మకాన్ని కలిగిస్తేనే కమ్మునిజంకు ఎదురు తిరిగి ఉద్యమం చేయగలం అని భావించారు.

10)రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క లక్ష్యం: విశ్వ ఐక్యత, శాంతి తో కూడిన భారతీయ విలువలను త్రిగి తీసుకురావడం !

11)1934 లో ఎం.కె. గాంధి ఆర్.ఎస్.ఎస్ క్యాంప్ కు వెళ్ళినపుడు అక్కడ ఉండే క్రమశిక్షణ, అంటరానితనం లేకపొవడం చూసి ఆశ్చర్యపోయాడు.

12)1939 లో డా. బి.ఆర్. అంబేద్కర్ పూణేలోని ఆర్.ఎస్.ఎస్ క్యాంప్ కు వెళ్ళినపుడు అక్కడ స్వయం సేవకుల మధ్య సమానత్వం, ఒకరితో ఒకరు కలిసి, కులాలు గురించి పట్టించుకోకుండా భోంచేయడం చూసి ఆశ్చర్యపోయారు. స్వయంసేవకులను ఉద్ధేశించి మాట్లాదుతూ ఆయన ఇలా అన్నారు" "నేను మొధతిసారి ఆర్.ఎస్.ఎస్ క్యాంప్ కు వచ్చాను. ఇక్కడ అగ్రవర్ణాల మధ్య, హరిజనుల మధ్య ఉండే సమానత్వాన్ని చూసి చాల ఆనందపడుతున్నాను" అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు పుజ్యనీయ దా.హెడ్గెవార్ ను "ఇక్కడ హరిజనులు ఎక్కడ ఉన్నారు అని అడిగినపుడు, ఆయన సమాధానం "ఇక్కడ అగ్రవఋణాల వారు అనబడేవారు ఎవరు లేరు మరియు హరిజనులు అనబడే వారు ఎవరు లేరు. కేవలం హిందువులు మాత్రమే ఉన్నారు" అని సమాధానమిచ్చారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML