What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

హరి ఓం

హరి ఓం.
అపౌరషేయములైన వేదము మొదట ఒకే స్వరూపములో కలగలసి ఉన్నందువలన విప్ర మహర్షి శ్రీ వ్యాస మునీంద్రులు ఏకరూపంలో ఉన్న వేదమును చతుర్వేదములుగా విభజించి వాటి విస్తరణ భారాన్ని తన శిష్యులైన పైల,జైమినీ,వైశంపాయన,సుమంత మునులకు అప్పగించటం ద్వారా వాటి విస్తరణను త్వరితం చేశాడు.మిగిలిన పురాణఇతిహాస వివరణ,విస్తరణా భాద్యతను రోమహర్షునికి అప్పగించాడు.
పురాణేతిహాస భాగమును రోమహర్షునికి అందించటానికి ముందు వేద విస్తరణ మందమతి కలిగిన జనులకు సైతము అర్దము అయ్యే విదముగా వివరిచటం జరిగిందా లేదా అని సరి చూసుకోనగా,అది కాస్త మందమతులకు అర్ధం చేసుకోలేని రీతిలో ఉన్నదని తెలిసి నిస్సతువకులోను అయ్యి,కలత చెందాడు.
కలత చెందుతూ ఈ వేదసారమును సర్వజనులకు అర్ధం అయ్యే విదముగా వివరించాలి అని నిర్ణయించుకుని ఆ సంకల్పముతో భగవత్స్వరూపమును వివరించే గ్రంధ రచనకు పూనుకుని సరైన మార్గదర్శకం కొరకు ఎదురు చూస్తున్నాడు.
ఆ సమయములో సరస్వతీ నదీ తటాకమున నివశిస్తున్న వ్యాసాశ్రమమునకు నారద మహర్షి అరుదెంచారు.నారద ముని శుభాగమనమును గాంచిన వ్యాసదేవుడు గౌరవముతో లేచి సృష్టి కర్తయిన బ్రహ్మకు అందించే గౌరవమును అందించి,బ్రహ్మమానస పుత్రుడు అయిన నారద మునిని గౌరవించి,అర్చించాడు.
వేద వ్యాసుని అసంతృప్తిని గ్రహించి అతని వద్దకు యేతెంచిన నారద ముని చిరు మందహాసముతో సుఖాసీనుడై విప్రర్షి అయిన వ్యాసునితో ఇలా పలికారు.
"శ్లో"
నారద ఉవాచ.
పారాశర్య మహా భాగ భవితః కచిదాత్మనాl
పరితుష్యతి శారీర ఆత్మా మానస ఏవవాll
భావము:
పరాశరతనయా వ్యాసా!!.దేహమును లేదా మనస్సును ఆత్మానుభవ లక్ష్యముగా భావించుట ద్వారా నీవు సంతృప్తి చెందియుంటివా?
సామాన్య మానవులు దేహాత్మ లేదా మనో ఆత్మానుభావన పొంది యుండుట వలన మనస్సునే ఆత్మ గా భావించవచ్చును కాని వ్యాసుని వంటి వారికి మాత్రమూ అది తగని కార్యము.అందుకే నారద ముని అలా వ్యాసుల వారిని అడగటం జరిగింది.
నీవు చేశిన గొప్ప కార్యాలు,వివరించిన జ్ఞాన భాగాలు మరచిపోయావా??ఇంత చేసినా నువ్వు ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉన్నావు నీ వేద విస్తరణ అనందించవలసిన అంశమే కదా??నీ అసంతృప్తికి కారణం ఏమిటి అని అడుగగా.
వ్యాస మునీంద్రుల వారు నారద మునికి ప్రణమిల్లి,,.ఆచార్య! తమకు తెలియని విషయము కాదు.నేనేమి చేసానో మీరే చెప్పారు.తమకు తెలుసు.నా మనస్సులోని అసంతృప్తికి కారణం కూడా తమకు తెలుసు.కాని అడగనిదే చెప్పకూడదు కనుక నేనే మిమ్ములను అడుగుతున్నాను.
నా ఈ వేద విస్తరణ సమస్త సర్వ జనులు అవగతం చేసుకునేలా వివరించాలి అని నిర్ణయించుకున్నాను.కాని దీనికి మొదలు ఏమిటో తెలియక సరైన మార్గదర్శకత్వం కొరకు ఎదురుచూస్తున్నాను.దయచేసి నాకు భగవత్ స్వరూప వర్ణన ను అందరికి అర్ధం అయ్యే రీతిలో వివరించే ఉపాయము తెలుపండి.భగవంతుని గాదను వివరించండి అని వేడుకొన్నాడు.
అప్పుడు నిరంతర హరి నామ స్మరణ చేసే నారద మహర్షి భాగవత వివరణ చేసి వ్యాస మహర్షిని శ్రీ మద్మహా భాగవతమును రచించే దిశగా మరలించటం జరిగింది. ఆ విదముగా వ్యాస మునీంద్రులు భాగవత రచన చెయ్యటం జరిగింది.మరి భాగవతమును నారదుని ద్వారా తెలుసుకుని రచించిన వ్యాస మునీంద్రులు దాని స్వీకరించి,వివరించవలసిన సర్వ సంగ పరిత్యాగి,జితేంద్రియుడు అయినవాడి ద్వారా సమస్త మానవులకు అందించాలి అని భావించి.అలా చేస్తేనే భాగవత వివరణ సవివరముగా,రక్షణగా,తన వివరణకు కొనసాగింపుగా ఉంటుంది అని భావించటం జరిగినది.అలా భావించి ఆ మనీషికై ఎదురు చూస్తూ ఉండగా,దైవ సంకల్పముతో వ్యాసుని ద్వారా జితేంద్రియుడు శుక మహర్షి జననం,ఆవిర్భావం జరిగినది.
వివరణ తరువాతి పోస్ట్ నందు.
_/\_
ఓం నమః శివాయ.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML