బ్రహ్మానంద పురాణ - కాల పట్టిక వ్యఖ్యానం
బ్రహ్మాంద పురాణం (3.4.2.92-103) లో పద్దెనిమిది సంఖ్యల వరకూ అంకడాలు వివరించారు. అవి:
దశ = 10
శతం; పరివృధ = 100
శహస్రం; పరిపద్మకం = 1,000
అయుతం = 10,000
నియుతం = 100,000
ప్రయుతం = 1,000,000
అర్వుతం; అర్బుదం = 10,000,000
న్యర్బుదం = 100,000,000
వృదం; ఖర్బుదం = 1,000,000,000
పరం = 10,000,000,000
ఖర్వం = 100,000,000,000
నిఖర్వం = 1,000,000,000,000
శంఖం = 10,000,000,000,000
పద్మం = 100,000,000,000,000
సముద్ర = 1,000,000,000,000
అంత్యం = 1,000,000,000,000,000
మధ్యమం = 10,000,000,000,000,000
పరార్ధం = 100,000,000,000,000,000
పర = 2 X పరార్ధ = బ్రహ్మా ఆయువు (లైఫ్ టైం) = 311.04 ట్రిలియన్ యేళ్ళు
తైత్తిరీయ సమ్హిత, కటక సమ్హితలు కూడా ఈ సంఖ్యా కాలాలు ప్రస్తావించేయి. వాజసనేయి సమ్హిత, బౌద్ధ గ్రంధం లలితవిస్తార (5 వ సంవత్సరం క్రీస్తు పూర్వం), శ్రీధర త్రైశతిక (క్రీ.శ.750), గణిత సార సంగ్రహ ఇత్యాది గ్రంధాలలో ఈ గణాంకాలు వివరిచబడ్డాయి.
అనేక వేల సంవత్సరాలకు పూర్వమే ఇట్టి అసాధరణమైన సంఖ్యలను ఉదాహరించారు భారతీయ వైజ్ఞానికులు, గణికులు, ఋషులు. దశాంశమాన గణితం కూడా ప్రాచుర్యంలో ఉందని వెరే చెప్పనక్కర లేదు. సుమారు 600-1000 సంవత్సర కాలం లో ఈ విషయాలు అరబ్ దేశాలు, ఉత్తర ఆఫ్రికా - మొరాక్కో ల మీదుగా ఇటలీ, స్పేన్, ఫ్రాన్స్, యూరోప్ చేరాయి. ఫిభొనాసి - క్రీ.శ.1225 సంవత్సరంలో - భారతీయ దశాంక గణితాన్ని యూరోప్ లో పరిచయం చేసినా, రోమన్ పద్ధతిని వీడి, భారతీయ దశాంశ గణాక పద్ధతిని అవలంబించడానికి దదాపు 200 సంవత్సరాలు పట్టింది.
అమెరికా ఎం ఐ టి విశ్వవిద్యాలయ తత్వ శాస్త్రం అచార్యుడు, రచయిత, హ్యూస్టన్ స్మిత్ మాటల్లో చెప్పాలంటే - " భారతీయులకు కనపడనిదంటూ ఏమి లేదు; కనిపించనిది, దేన్ని మినహాయించనిది లేదు - భారత దేశ ఆత్మ అనంతం. వారు అనంతంలో కూడా యేమి ఉందో మినహాయించకండా విశదీకరించి చెప్పేసారు. భారతీయుల మేధా శక్తి అంతః-కరణాన్ని అబ్బుర పరుస్తుంది". మరి కొంత వివరణ ఇస్తూ ఇలా అన్నారు " భారతీయులు - కల్పాలు, విశ్వం, అపార కాల గణాలు యెప్పుడో ప్రకటించారు. వారి వైదుష్యం యెంత గొప్పదీ అంటే, అభినవ ఖగోళ శాస్త్రం కూడా అందులో ఒక బిందువే. అంత అపారమైంది భారతీయుల జ్ఞానం " అని తన మనోగతాన్ని విశిదీకరించి చెప్పేరు.
అంతర్జాతీయ విఖ్యాతి చెందిన ఖగోళ శాస్త్ర అచార్యుడు, నోబెల్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం శిష్యుడు, "కాస్మోస్" (విశ్వం) టీ వీ ధరావాహికం (సీరియల్) నిర్వాహకుడు, ఖగోళ శాస్త్ర అచార్యుడు కార్ల్ సాగన్, హిందూ (భారతీయ) విశ్వాంతరాళ శాస్త్రానికి (కాస్మాలజీ) కి కేటాయించిన శీర్షికలో ఇలా వివరించారు - హిందూ కాస్మాలజీ అద్బుతమేమిటంటే ఇది ప్రపంచంలొనే అతి బృహత్ పరిమాణం గల ప్రపంచ కాల మానాన్ని అందించింది. ఇది నేటి అధునాతన సాంకేతిక కాస్మాలజీ (విశ్వశాస్త్రం) కి అనుగుణంగా ఉంది. భూమి వయస్సు సుమారు 4.6 బిల్లియన్ యేళ్ళు; ఇది " భారతీయ కాస్మొలాగికల్ సైకిల్ సిధ్ధాంతా"నికి అనుగుణంగా ఉంది. సాగన్ తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ " నాకు తెలిసినంత పరిదిలో ఇంత సరైన, భూమి యొక్క ఇంతటి బృహత్ కాల ప్రమాణాలు పేర్కున్న ఉదంతాలు యెక్కడా చూడలేదు " అని విశ్లేషించి చెప్పారు. ఇక భారతీయ వైజ్ఞానికుల పరిణితి యేపాటిదో ప్రాజ్ఞులైన పాఠకులే నిర్ణయించుకోవాలి.
సాగన్ ఇంకా ఇలా విశిదీకరించారు - " పశ్చిమ దేశాలలో జన బాహుళ్యానికి ఈ విశ్వం కొన్ని వేల సంవత్సరాల కిందట ఆవిద్భవించిందని నమ్మకం. కాని నిజానికి ప్రపంచంలో అద్బుత సాంప్రదాయం గల హిందూ భావన (కాన్సెప్ట్) ప్రకారం విశ్వం కొన్ని బిలియన్ల్ల యేళ మనుపు మొదలయ్యిందని స్పష్టంగాం చెప్పాయి ".
భారతీయ విశ్వశాస్త్రం ప్రకారం, విశ్వాంతరాళం - సృష్టి, స్థితి, లయ, కారక చక్రం, అంటే విశ్వం మొదలు నుంచి అంతం వరకు నిరాఘాటంగా సాగుతున్న కాలచక్రం స్వరూపాన్ని కూలంకషంగా వివరించారు - భారతీయ కాలజ్ఞానులు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment