What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 28 August 2014

దూర్వాంకురాల మహిమను గణపతి దేవతలకు స్వయంగా ఇలా చెప్పాడు "దూర్వాలు లేకుండా నాకు చేసిన పూజ అధికమైనను అది వృధా. దూర్వాలు లేకుండా నాకు చేసిన పూజ నిష్ఫలం.

దూర్వాంకురాల మహిమను గణపతి దేవతలకు స్వయంగా ఇలా చెప్పాడు "దూర్వాలు లేకుండా నాకు చేసిన పూజ అధికమైనను అది వృధా. దూర్వాలు లేకుండా నాకు చేసిన పూజ నిష్ఫలం."

దూర్వాంకుర పూజా మహిమను వివరించే కథ:

పూర్వం అవంతీపురమును సులభుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆ దంపతులు స్నానాదికాలు ముగించుకుని శుచిగా పురాణశ్రవణం కొరకు కూర్చుని ఉండాగా అక్కడకు చిరిగిన గుడ్డలు కట్టుకొని ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. సద్గుణ సంపన్నుడైనను ఆ రాజు ఆ క్షణాన వివేకం కోల్పోయి బ్రాహ్మణుని చులకనగా మాట్లాడాడు. బ్రాహ్మణునికి చాలా కోపం వచ్చి రాజును నాగలి దున్నే ఎద్దుగా జన్మించమని శపించాడు. దానికి రాజు భార్యకు ఆగ్రహం వచ్చి ఆ బ్రాహ్మణుని గడ్డితినే గాడిదగా పుట్టమని శపించింది. దానితో బ్రాహ్మణుడు మరల తనను చండాల స్త్రీగా కటిక దరిద్రురాలుగా పుట్టమని శపించాడు. ఇలా ముగ్గురూ శాపగ్రస్తులై రాజు దుక్కిటెద్దుగాను, విప్రుడు గాడిదగాను, రాణి చాండాలిగాను జన్మలెత్తారు.

ఒకనాడు కుండపోతగా వర్షం కురుస్తూ ఉండగా తలదాచుకోడానికి ఆ చండాల స్త్రీ ఆ ఆలయంలో ప్రవేశించి ఒక మూల చలిమంట వేసుకుని శరీరం కాచుకుంటూ కూర్చుంది. ఆమె చలికాచుకొనుటకు ఏరితెచ్చుకున్న గడ్డిమోపులోంచి ఒక గడ్డిపరక (దూర్వాంకురము) గాలికి ఎగిరి వచ్చి గర్భగుడిలో గణేశ విగ్రహంపై పడింది. అలాగే నాగలినుండి విడివడిన ఎద్దు కూడా అక్కడకు వచ్చింది. ఇంతలో వానలో చిత్తుగా తడిసిన గాడిద కూడా తలదాచుకోడానికి ఆలయంలో ప్రవేశించింది. అవి రెండూ కూడా గడ్డిపరకలు మేస్తూ కుమ్ములాడుకోవడం మొదలు పెట్టాయి. ఆ అలజడికి ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రజలు ఎద్దును, గాడిదను చితకబాదడం మొదలుపెట్టారు. అవి దెబ్బలకోర్వలేక గుడిచుట్టూ ప్రదక్షిణంగా పరుగెత్తసాగాయి. వారి అదృష్టం కొద్దీ ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి. ఇది గమనిస్తున్న గణనాథునికి జాలికలిగింది. వినాయక చవితి నాడు తెలిసి కానీ తెలియక కానీ గణేశునకు దూర్వాంకురము అర్పించినవారు ఆయనకు ప్రీతిపాత్రులౌతారు. ఆ చాండాల స్త్రీ చేతి దూర్వాంకురము ఎలాగూ గణేశుని చేరింది. వెంటనే గణపతి తన దూతలద్వారా దివ్య విమానమును పంపి మువ్వురిని పునీతులను గావించి వాళ్ళకు గణేశ లోక ప్రాప్తి కలిగించారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML