What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 27 August 2014

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ఎందుకు దరిస్తాడు? కృష్ణుడు స్వభావం ఏమిటి?

శ్రీకృష్ణుడు నెమలి ఫించము ఎందుకు దరిస్తాడు?
కృష్ణుడు స్వభావం ఏమిటి?
నెమలిని మయూరము అని అంటారు ఎందుకు?... "మ" కారము మధనానికి అని అర్ధము."యూర" అనే పదం హృదయానికి అని అర్ధము.ఇంకా "మ" అంటే మగనెమలిని కూడా అంటారు.పక్షిజాతిలో "యోగవిద్య "తెలిసిన పక్షులు ఐదు మాత్రమే ఉన్నాయి, అవి: శుకము, హంస, గరుడుడు,నెమలి చివరిది పావురము. వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఞానము ఉన్నది. అసలు నెమలి అందమే పింఛం. క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వఛ్ఛ మైన నీటిబిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి. ఇక నెమలి పూర్వ వృత్తాంతం తెలిసికుందాము:-శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు క్రౌంచపక్షుల గాయాలు నయంచేసినందుకు గాను వృద్ధుడైన ఆ రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే, వద్దని, మీకు మల్లే నేను విహంగంగా ఆకాశంలో విహరించాలని ఉందని అది అనుగ్రహించండి. అలాగే అని మేము చెప్పబోయే దేవతా మంత్రం ఆకాశంలో మబ్బులు క్రమ్మినపుడే నీకు పనిచేసి, నీకు చిత్రవిచిత్రమైన వర్ణనలు కలిగిన ఈకలు, పింఛము కలుగగలవు. అప్పుడు ఈ జగత్తులో నీయంతటి అందమైన పక్షి మరొకటి యుండదు. ఒక హెచ్చరిక, ఎటువంటి పరిస్థితులలో ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు" అని వెళ్ళిపోయాయి.ఒకనాడు ఆకాశం మేఘావృతమై యుండగా ఈ మంత్రప్రభావం చూద్దామని, మంత్రోఛ్ఛరణంగా ఈ మంత్రాన్ని పఠించి మనోహరమైన, అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తూండగా అతని భార్య చూసింది. ఆనాటినుండి భర్తను ఎన్నోవిధాలుగా హింసిస్తూ, వేధిస్తూ ఆ మంత్రాన్ని తనకు చెప్పమంది. ఇక ఆ బాధలు పడలేక సరేనన్నాడు. ఇది తెలిసికున్న ఆ మంత్రాన్ని అధిష్టించిన దేవత అతని భార్యకు బుద్ధిచెప్పాలనుకుంది. ఆ మంత్రము చేత కారుమేఘాలను సృష్టించి వాతావరణాన్ని ఆనందమయం చేసింది. ఆ సమయంలో ఆయన భార్య తను అతిసుందరమైన విహంగంగా మారిపోతున్నాననే భావనలో " అతిసుందర:" అనబోయి "అసుందర: అన్నది. వెంటనే ఆ పదజాలంతో ఆమె పింఛంలేని ఆడ నెమలిగా మారిపోయింది. తమకిచ్చిన వాగ్దానాన్ని తప్పాడని ఆ క్రౌంచపక్షులు ఆ రాజుని శాశ్వతంగా మగనెమలిగా మారిపొమ్మన్నాయి. రేతస్సు అనగా వీర్యం : దీనిలో అమొఘమైన శక్తి నిల్వ ఉంటుంది. ఇలాంటి శక్తిని అధోపతన క్రియ ద్వారా మానవులు సంతానాన్నిపొంది వీర్యహీనులు అంటే తేజమును,శక్తిని కోల్పోతుండగా , యోగులు యిదే వీర్యాన్ని " ఊర్ధ్వపతన" క్రియ ద్వారా కపాల భాగానికి చేర్చి మోక్ష మార్గ గాములుగా అవుతున్నారు.ఇటువంటి యోగులందరిలోకి శ్రీకృష్ణభగవానుడు పరమొత్తమమయిన పరమయోగి. పదహారువేల మంది గోపికలున్నా, అష్టభార్యా సహితుడైనా, భామాలోలుడన్న పేరున్నా ఆయన అసలుసిసలైన నిఖార్సైన బ్రహ్మచారి. అందుకే ఆయన "అస్ఖలిత బ్రహ్మచారి" అయ్యాడు. నెమళ్ళకు తమ వీర్యాన్ని ఊర్ధ్వముఖంగా నడిపించగలశక్తి గలవి. అయితే జ్ఞానంలో మనిషికన్నా ఒక స్థాయి తక్కువగా ఉండటంవలన ఈ రేతస్సు (వీర్యం)పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు స్రవించబడి ఒక రకమైన మదపువాసనను చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది. ఈ మదజలం, ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్భం ధరిస్తుంది.ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైనది, స్త్రీపురుష జననేంద్రియాల సంభోగ ప్రక్రియ ప్రసక్తే లేదు. అందుకని నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. ఎప్పుడైతే,ఎక్కడైతే స్ఖలనము లేదో దాన్ని యోగీ-యోగ సమానమై ఆరాధ్యనీయము, పూజనీయమూ గౌరవస్థానాన్ని ఆక్రమించింది కనుకనే శ్రీకృష్ణుడు తన శిరముపైన నెమలిపింఛానికి సముచిత,సమున్నత స్థానాన్ని అనుగ్రహించాడు....

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML