ప్రపంచం ఎప్పుడు ఆవిర్భవించింది? ఈ అవనీ తలం యెప్పుడు యేర్పడింది? ఈ అనంత కాల ప్రవాహాన్ని యెలా కొలిచేది? దీని ఆది యెక్కడ? అంతం యెప్పుడు? అది తెలుసుకోడం యెలా? మానవ మనుగడకు సంబంధించిన ఇలాటి ప్రాధమిక ప్రశ్నలను, అతి సంక్లిష్ట సమస్యను పరిష్కారం చేసిన భారతీయ విజ్ఞానవేత్తల మేదస్సు మహాద్భుతమైనది. సమస్యని పరిష్కరించడంతో పాటు అది జనానికి సులభంగా అర్ధమయ్యేట్టు విశధీకరించడం, కాలాన్ని నియంత్రించే మార్గాన్ని రూపొందించడం వీరి మనవాతీత మేదస్సుకు ఓ మచ్చుతునక. ఆది, అంతం తెలీనప్పుడు కాలాన్ని యెలా కొలవడం? కొలిచిన కాల మానాన్ని మానవ సౌర సంవత్సరాలతో అనుసంధానం చేయడమెలా? ఇలాటి చిక్కు ముడి ప్రశ్నలకు అద్వితీయ సమాదానాలు ఇచ్చారు ప్రాచీన భారతీయ శాస్త్ర, విజ్ఞానవేత్తలు.
విద్యా, మేధా, క్రియా శక్తులకు ఆలవాలం భారతం. ఉదాహరణకు - నక్షత్ర విద్య, రాశీ విద్య, బ్రహ్మ విద్య, పర విద్య, గణితం, క్షేత్ర గణితం, విశ్వ శాస్త్రం, జ్యోతిషం, సంఖ్యాన, గణన, త్రైప్రశ్న (దిక్కు, స్థానం, కాలం) కాలశాస్త్రాలు, దిక్, కాల సంబంధ పరిపూర్ణ పరిజ్ఞానం అందించాయి. ప్రపంచం యక్కడ మొదలైయ్యిందో, యెంత కాలం గడచిందో, భవిషత్ కాలం యెంత వుందో, అందులో ఈ పృధ్వ్వీ మండలానికి యెంత కాల పరిమితి వుందో, మానవులకు, చరా చర రాశులకు యెంత కాల మానం నిర్ణయమై ఉందో తెలుసుకోవడం దుర్లభంగా గోచరించ వచ్చు. ఇట్టి ఉత్కృష్ట సమస్యలను పరిణితి చెందిన పాండిత్య ప్రకర్షలతో, విభిన్న శాస్త్రీయ పద్ధతులనుసారంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించారు ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు.
కాలాన్ని ఒక " ప్రాధమిక " పదార్ధంగా పేర్కొన్నాడు సుప్రసిద్ధ వైజ్ఞానికుడు, కణాదుడు - వైశేషిక శాస్త్రం లో. అకాశం, కాలం, దిక్ అనంతాలు; వీటికి అంతం లేదు. దిక్, కాలం - ఈ రెండూ సర్వ వ్యాప్త పదార్ధాలు. భూత, భవిషత్, వర్తమాన నిర్ధారణా చేయడానికి కాలమే మూలం. ఈ కొల బద్ధ లేనిదే భూత, భవిషత్, వర్తమాన వర్గీకరణ అసంభవం. కాలం సూర్య భ్రమణం మీద ఆధార పడి క్షణ, దిన, ఋతు, సంవత్సరాది కొలబద్ధ ప్రామాణికమయ్యాయి. ఆంగ్లం (ఇంగ్లిషు) లో పలికే " హవర్" కాల ప్రమాణానికి మూలం రూపం సంస్కృతంలోని " అహో రాత్రి " (అహొ - పగలు; రోజు; రాత్రి - రాత్రి; ఒక పగలు ఓ రాత్రి కలసినది అహో రాత్రి - కాల సంభంద మైన శాస్త్రం హోరా శాస్త్రం).
దదాపు 2300 యేళ్ళ నాటి జైన శాస్త్రాలలో - విభిన్న అనంతాలు (టైప్స్ ఆఫ్ ఇంఫినిటి) వాటి భావార్ధ, పరమార్ధాలు గ్రహించి వర్గీకరణ చేసారు, ఈ శతాబ్ధం ఆరంభంలో ప్రముఖ భారతీయ గణిత శాస్త్ర దిగ్గజం, ఐ ఎస్ ఐ వ్యవస్తాపకుడు డాక్టర్ ప్రశాంత చంద్ర మహాలనోబిస్, ఈ అనంతాల విభజనతో పాటు, షడ్వాద పద్ధతిని అవలోకనం చేసి నేటి విధానలతో అనుసందానం చేసి తన దృక్పథాలు, మెళకువలు చాటి చెప్పిన గణిత కోవిదుడు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment