వ్రతాలలో పూజించినటువంటి వినాయకుడు హరిద్రా గణపతి. "తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్" - విఘ్నాలన్నీ తొలగించుకోవడం కోసమని తొలుతగా గణపతిని పసుపు ముద్దలో అర్చిస్తూ ఉంటాం. ఈ గణపతిని అర్చించే సమయంలో కొంతమంది పసుపు ముద్ద రూపంలో అర్చించగా మరికొంతమంది వక్క రూపంలో కూడా అర్చిస్తూ ఉంటారు. ఏమైతేనేం? గణపతిని అర్చించిన తర్వాత ఆ గణపతి పసుపు ముద్దను "గచ్ఛగచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర" అంటూ ఆయనను పంపించివేశారు. అంతటి మహాశక్తి ఈ పసుపుముద్దలో వచ్చింది, కేంద్రీకృతమైంది, మనలను అనుగ్రహించింది, తిరిగి విశ్వంలోఉండే చైతన్యభాగంలో లీనమైంది అనుకున్నప్పటికీ ఆ పసుపు ముద్దలో ఇంకా చైతన్య స్వరూపం మిగిలే ఉంటుంది. కనుక సంపూర్ణమైన గౌరవంతో ఆ పసుపు ముద్దను ఇల్లాలి చేతికి అప్పగించాలి. ఇల్లాలు ఆ పసుపుముద్దను ముఖంపైన అలదుకోవచ్చును. లేదా ఆ పసుపుముద్దను తీసుకువెళ్ళి తులసికోటలో పెట్టవచ్చు. రోజూ నీళ్ళు పోస్తూ వుంటే కోటలో కలిసిపోతుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment