What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 29 August 2014

వినాయక విజయం: వినాయక వ్రత కల్ప విధానము:

వినాయక విజయం: వినాయక వ్రత కల్ప విధానము:

వినాయక చవితి శుభాకాంక్షలు: వినాయకుడిని స్మరించడం ద్వారానే సర్వ విఘ్నాలు తొలిగిపోయి సుఖసంతోషాలకు మార్గం సుగమమవుతుంది. అందరు ఒకసారీ వినాయకా విఘ్న వినాశక అని అనండి!!

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ !
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా !!

గణపతి జననము:
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।

భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।

అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:
గణేశుడు అగ్రపూజనీయుడు:
పెద్దవాడిని కాబట్టి నాకు ఆ పదవిని ఇవ్వాలని గజాననుడు, కాదు కాదు నేనే పదవిని చేపడతానని కుమారస్వామి పోటీపడతారు. మీరిద్దరిలో ఎవరు మూడు లోకాలలో తిరగడంతో పాటు ఆయా లోకాలలోని పుణ్య తీర్థాలలో స్నానం చేసి వస్తారో వారికి విఘ్నాధిపతి పదవిని ఇస్తానని పరమశివుడు పరీక్ష పెడతాడు. వెంటనే నెమలిని అధిరోహించిన కుమారస్వామి విజయానికై బయలుదేరుతాడు. తండ్రి పరీక్షను విని నివ్వెరపోయిన గజాననుడు, నేను శక్తిలేనివాడనని తెలిసి కూడా ఇలాంటి పరీక్షను పెట్టటం భావ్యమా అని తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటాడు.

గజానుని పరిస్థితిని అర్థం చేసుకున్న శివుడు, అతనికి నారాయణ మంత్రమును ఉపదేశించడంతో, మంత్రమును మనఃపూర్వకముగా జపించిన గజాననుడు కైలాసంలో కదలకుండా కూర్చుంటాడు. ఇక విజయం సాధించడానికి బయలుదేరిన కుమారస్వామి ఎక్కడకు వెళ్ళినా సరే అక్కడ గజాననుడు కనపడుతున్నాడు. అన్నగారి గొప్పదనాన్ని తెలుసుకున్న కుమారస్వామి తన అపచారమును మన్నించవలసిందిగా పరమశివుని ప్రార్థిస్తాడు. విజయుడైన గజానుని భాద్రపద శుద్ధ చవితినాడు మహేశ్వరుడు విఘ్నాధిపతిగా నియమిస్తాడు.
ఆ రోజున యావత్‌ప్రపంచం విఘ్నేశ్వరుని భక్తితో పూజించి, కుడుములు తదితర పిండివంటలు, టెంకాయలు, తేనె, పాలు, అరటిపండ్లు, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించింది. సంతృప్తితో విఘ్నేశ్వరుడు వాటిని భుజించి, భుక్తాసయముతో కిందకు వంగలేని వాడై తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకుందామని ప్రయత్నిస్తున్న తీరును చూసిన శివుని తలలోని చంద్రుడు వికటాట్టహాసం చేస్తాడు. దిష్టి ప్రభావంతో గజానుని కడుపు విచ్ఛిన్నమై కుడుములన్నీ కింద పడతాయి. పార్వతి చంద్రుని వంక చూసి తీవ్రమైన స్వరంతో "పాపాత్ముడా! నీ దిష్టి తగిలి నా కుమారుడు కడుపు విచ్ఛిన్నమై కుడుములన్నీ కింద పడయి. కనుక ఇకపై నిన్ను చూసినవారు పాపాత్ములై నిందలను ఎదుర్కుంటారు" అని శపించింది.

అదేసమయంలో యజ్ఞం చేస్తున్న సప్త మహర్షుల భార్యలు అగ్నికి ప్రదక్షిణ చేస్తున్నారు. వారిని చూసి మోహించిన అగ్ని, భయముతో క్షీణించసాగాడు. అది గమనించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి, తానే మహర్షుల భార్యల రూపాన్ని పొంది భర్తకు సేవ చేయసాగింది. స్వాహాదేవి వైనాన్ని గుర్తించని మహర్షులు, అగ్నికి సేవ చేస్తున్నది తమ భార్యలేనని తలచి, వారిని వదిలివేస్తారు. పార్వతి శాపం పెట్టిన తరువాత చంద్రుని చూడటం వలన వారు నిందల పాలయ్యారు.

మునులు, దేవతలు, మహర్షుల భార్యల ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ, సప్తమహర్షలకు వాస్తవం తెలిపి, వారికి నచ్చచెప్పడంతో వారు భార్యలను స్వీకరిస్తారు. "నీ శాప ప్రభావంతో లోకాల్లన్నింటికి ముప్పు వాటిల్లింది. శాపము ఉపసంహరించుకో పార్వతి దేవీ!" అని దేవతలు ప్రార్ధించడంతో " ఏ రోజు నా కుమారుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ రోజు చంద్రుని చూడరాదు " అని తెలిపింది పార్వతి. సంతోషించిన బ్రహ్మ తదితర దేవతలు, భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా సుఖంగా ఉండసాగారు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML