నిద్రలో పీడకలలు వస్తే అవి దేనికి సంకేతం?
పీడకలలు వస్తే మనసు భయపడింది అని అర్థం. శివాభిషేకం, భస్మధారణ సులభమైన మార్గాలు అంటుంది శాస్త్రం, ధర్మం. నిద్రపోయే సమయంలో
రామస్కందం హనూమంతం వైనతేయం వృకోదరం!
శయనేయః స్మరేన్నిత్యం దుస్స్వప్నః తస్య నశ్యతి!!
అని స్మరించుకొని నిద్రపోతే ఎటువంటి పీడకలలు రావు. సాయంత్రం 6-9 మొదటియామము - గృహకార్యములు చక్కబెట్టుకునే సమయం, భోజన సమయం. 9-3 వరకు నిద్రించే కాలం. రెండవ యామము 9-12; మూడవయామము 12-తెల్లవారుఝాము 3 వరకు; నాల్గవ యామము 3-6. రెండవయామములో ఏమైనా పీడ కలలు వస్తే అవి వెంటనే సద్యోఫలాన్ని చూపిస్తాయి. అందువల్ల మానసికంగా కలిగే క్లేశము తప్పించుకోవడం కోసం పై శ్లోకం చదువుకోవాలి. పీడకలలు ఎవరికీ చెప్పకూడదు. తెల్లవారు ఝామున లేచి స్నానం చేసుకొని దేవతరాధన చేసుకొని భస్మం ధరించాలి. దానివల్ల అశుభ ఫలాలు రాబోతున్నవి అనుకుంటే వాటియొక్క పరిణామ తీవ్రతలు తగ్గుతాయి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment